News July 11, 2024
TDP ఆఫీసుపై దాడి కేసు.. వైసీపీ నేతలకు ఊరట

AP: హైకోర్టులో YCP నేతలకు ఊరట దక్కింది. 2021లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల, దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, రఘురామ్, ఆళ్ల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు ఈ నెల 16 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. మరోవైపు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్పై సైతం చర్యలు తీసుకోవద్దంది.
Similar News
News November 19, 2025
ప్రెగ్నెన్సీలో అవకాడో తింటే..

అవకాడో గర్భిణులకు ఔషధ ఫలం అంటున్నారు నిపుణులు. ఇది సంతానోత్పత్తి, పిండం అభివృద్ధి, జనన ఫలితాలు, తల్లి పాల కూర్పును ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇందులో మోనోశాచురేటెడ్ కొవ్వులు శరీరం విటమిన్లను శోషించుకునేలా చేస్తాయి. అధిక పీచువల్ల ఆకలి తగ్గి, బరువు అదుపులో ఉంటుంది. అలాగే ఫోలిక్ ఆమ్లం గర్భస్థ శిశువు మెదడు, నాడీ వ్యవస్థ లోపాలు రాకుండా చూస్తుందని చెబుతున్నారు.
News November 19, 2025
చరిత్ర లిఖించిన అతిచిన్న దేశం.. FIFA వరల్డ్ కప్కు అర్హత!

కరీబియన్ దీవి దేశమైన కురాకో FIFA ప్రపంచ కప్కు అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. కేవలం 1.56 లక్షల జనాభా కలిగిన ఈ దేశం ప్రపంచ కప్కు అర్హత సాధించిన అత్యంత చిన్న దేశంగా రికార్డు నెలకొల్పింది. గతంలో ఐస్లాండ్ పేరిట ఉన్న రికార్డును ఇది బద్దలు కొట్టింది. జమైకాతో జరిగిన కీలక క్వాలిఫయింగ్ మ్యాచ్లో 0-0తో డ్రా చేసుకొని 2026 WCలో స్థానం సాధించింది. అర్హత సాధించడంతో ప్లేయర్లు ఎమోషనలయ్యారు.
News November 19, 2025
ఇతిహాసాలు క్విజ్ – 71 సమాధానాలు

ప్రశ్న: గణేశుడు భారతాన్ని రాసేటప్పుడు తన దంతాన్ని ఎందుకు విరిచాడు?
జవాబు: వినాయకుడు భారతం రాసేటప్పుడు ఈకలు ప్రతిసారి విరిగిపోయాయి. రచనను మధ్యలో ఆగిపోకూడదనే షరతుకు కట్టుబడిన గణేషుడు ఈకలతో పని కాదని గ్రహించి తన దంతాన్ని విరిచి మహాభారతాన్ని రాయడం పూర్తిచేశాడు. మరో కథనం ప్రకారం.. పరశురాముణ్ని నిరోధించడంతో రెండు దంతాల్లో ఒక దాన్ని విరిచేస్తాడని చెబుతారు. <<-se>>#Ithihasaluquiz<<>>


