News July 11, 2024
TDP ఆఫీసుపై దాడి కేసు.. వైసీపీ నేతలకు ఊరట

AP: హైకోర్టులో YCP నేతలకు ఊరట దక్కింది. 2021లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల, దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, రఘురామ్, ఆళ్ల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు ఈ నెల 16 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. మరోవైపు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్పై సైతం చర్యలు తీసుకోవద్దంది.
Similar News
News October 14, 2025
నేడు కీలక ఒప్పందం

AP: విశాఖలో ఏర్పాటు కానున్న 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ కోసం ప్రభుత్వం నేడు కీలక ఒప్పందం కుదుర్చుకోనుంది. రూ.88,628CR(10 బి.డాలర్ల)తో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్తో MOU కుదరనుంది. ఢిల్లీలో 10AMకు CM చంద్రబాబు, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్, మంత్రి లోకేశ్ సమక్షంలో MOUపై సంతకాలు చేయనున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని ప్రభుత్వం చెబుతోంది.
News October 14, 2025
వైకుంఠ గంగే స్వామివారి పుష్కరిణి

తిరుమల కొండతో పాటు, స్వామి పుష్కరిణిని కూడా గరుత్మంతుడు వైకుంఠం నుంచి భూమిపైకి తెచ్చాడు. ఇది శ్రీదేవి, భూదేవిలకు ప్రియమైనది. దీన్ని సర్వతీర్థాలకు జన్మస్థానంగానూ భావిస్తారు. విరజా నదిలా సకల పాపాలను పోగొట్టే శక్తి దీనికి ఉంటుంది. ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే ఐహిక ఫలాలన్నీ లభిస్తాయి. ఈ పుష్కరిణిని దర్శించడం, స్మరించడం, సేవించడం వలన సమస్త శుభాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News October 14, 2025
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్లో ఉద్యోగాలు

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ 4 చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA, PGDBM, PGDM, BSC, MSC(అగ్రికల్చర్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. చీఫ్ మేనేజర్కు నెలకు ₹90వేల నుంచి ₹2.40లక్షలు, సీనియర్ మేనేజర్కు ₹80వేల నుంచి ₹2.20లక్షలు జీతం అందుతుంది. వెబ్సైట్: https://www.nationalfertilizers.com/