News December 24, 2024
కాకినాడ పోర్టులో అక్రమాల కేసు.. కె.వి.రావు పిటిషన్

AP: కాకినాడ పోర్టులో అక్రమాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోర్టు మాజీ యజమాని కె.వి.రావు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. అటు ఈ కేసులో వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 31కి వాయిదా పడింది. అప్పటివరకు ఆయనపై చర్యలు వద్దని, కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా సీ పోర్టును అక్రమంగా రాయించుకున్నారని విక్రాంత్పై ఆరోపణలొచ్చాయి.
Similar News
News October 20, 2025
మేం మొదలుపెడితే తట్టుకోలేరు.. కేతిరెడ్డిపై జేసీ ఫైర్

AP: ధర్మవరం మాజీ MLA కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ‘ఇదే మీకు లాస్ట్ దీపావళి అని కేతిరెడ్డి అంటున్నారు. అలా అంటే చూస్తూ ఊరుకోవాలా? మేం మొదలుపెడితే మీరెవరూ తట్టుకోలేరు’ అని ఫైరయ్యారు. ఆయన ఆలోచించి మాట్లాడాలని, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేరని అన్నారు.
News October 20, 2025
కూతురిపై అత్యాచారానికి యత్నించాడని కొట్టిచంపిన తండ్రి!

తన కూతురిపై అత్యాచారానికి యత్నించిన కామాంధుడిని రాయితో కొట్టి చంపాడో తండ్రి. ఒడిశాలోని థెన్కనల్ జిల్లాలో జరిగిందీ ఘటన. కాలువలో స్నానం చేసేందుకు తండ్రితో కలిసి బాలిక (10) వెళ్లింది. స్నానం ముగించుకున్నాక పక్కకు వెళ్లిన సమయంలో కరుణాకర్ (27) అనే వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక ఏడుపు విన్న తండ్రి వచ్చి బండరాయితో కొట్టి చంపాడు. తర్వాత స్థానిక పర్జంగ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
News October 20, 2025
రోహిత్, విరాట్ ఫామ్పై స్పందించిన గవాస్కర్

ఆస్ట్రేలియాతో రెండో ODIలో రోహిత్, విరాట్ తిరిగి పుంజుకుంటారని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆశాభావం వ్యక్తంచేశారు. వారిద్దరూ భారీ స్కోర్లు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అన్నారు. ‘రోహిత్, కోహ్లీ 2 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడట్లేదు. AUSలో బౌన్సీ పిచ్పై అంత ఈజీ కాదు. వారు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా లయను అందుకుంటారు. టీమ్ ఇండియా 300+ రన్స్ చేస్తుంది’ అని ఓ ఇంటర్వ్యూలో అన్నారు.