News June 25, 2024

వైసీపీ మాజీ ఎంపీపై కేసు నమోదు

image

AP: విశాఖ మాజీ ఎంపీ MVV సత్యనారాయణపై కేసు నమోదైంది. MOU పేరిట ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారని ఆయనపై హయగ్రీవ కన్‌స్ట్రక్షన్ అధినేత జగదీశ్వరుడు ఫిర్యాదు చేశారు. విలువైన భూములు కాజేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీంతో ఆరిలోవ పోలీసులు MVVతో పాటు ఆయన ఆడిటర్ వెంకటేశ్వరరావు, రియల్టర్ బ్రహ్మాజీపై 10 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. MVV వెంటనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.

Similar News

News November 18, 2025

వరంగల్: అర్ధరాత్రి రైల్వే స్టేషన్, బస్టాండ్లో పోలీస్ తనిఖీలు

image

నేరాల నియంత్రణ, నేరస్థులను గుర్తించే చర్యల్లో భాగంగా సోమవారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ స్పర్జన్ రాజ్ సిబ్బందితో కలిసి వరంగల్, హన్మకొండ బస్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్లలో అనుమానిత వ్యక్తులు, వారి బ్యాగులను తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

News November 18, 2025

వరంగల్: అర్ధరాత్రి రైల్వే స్టేషన్, బస్టాండ్లో పోలీస్ తనిఖీలు

image

నేరాల నియంత్రణ, నేరస్థులను గుర్తించే చర్యల్లో భాగంగా సోమవారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ స్పర్జన్ రాజ్ సిబ్బందితో కలిసి వరంగల్, హన్మకొండ బస్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్లలో అనుమానిత వ్యక్తులు, వారి బ్యాగులను తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

News November 18, 2025

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో బదిలీలు.. అర్హులు ఎవరంటే?

image

* భార్యాభర్తల్లో ఎవరైనా ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, వర్సిటీల్లో పనిచేస్తూ ఉండాలి.
* ఒకరు ప్రభుత్వ, మరొకరు ప్రైవేట్ ఉద్యోగి అయితే <<18315066>>బదిలీ<<>> వర్తించదు.
* మ్యారేజ్ సర్టిఫికెట్, ఎంప్లాయి‌మెంట్ ఐడీ కార్డు తప్పనిసరి.
* ప్రభుత్వానికి బకాయిలు లేనట్లు ధ్రువీకరణపత్రం ఉండాలి.
* మెరిట్ ర్యాంకు ఆధారంగా బదిలీ చేస్తారు. ఒకవేళ టై అయితే సీనియారిటీ, DOB ఆధారంగా ప్రాధాన్యత ఇస్తారు.