News June 25, 2024
వైసీపీ మాజీ ఎంపీపై కేసు నమోదు

AP: విశాఖ మాజీ ఎంపీ MVV సత్యనారాయణపై కేసు నమోదైంది. MOU పేరిట ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారని ఆయనపై హయగ్రీవ కన్స్ట్రక్షన్ అధినేత జగదీశ్వరుడు ఫిర్యాదు చేశారు. విలువైన భూములు కాజేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీంతో ఆరిలోవ పోలీసులు MVVతో పాటు ఆయన ఆడిటర్ వెంకటేశ్వరరావు, రియల్టర్ బ్రహ్మాజీపై 10 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. MVV వెంటనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.
Similar News
News November 19, 2025
కన్నె స్వాములు తప్పక చూడాల్సిన స్థానం

శబరిమల యాత్రలో పేరూర్తోడు నుంచి 12KM దూరంలో కాళైకట్టి అనే కారడవి ఉంటుంది. నేడు ఇది పచ్చని తోటగా మారింది. ఈ స్థలానికి 2 ప్రాముఖ్యతలున్నాయి. ఓనాడు అయ్యప్ప స్వామి తన సైన్య వృషభాలను ఇక్కడే కట్టేశాడట. మరోనాడు మహిషీ మర్దనం చూడడానికి వచ్చిన పరమేశ్వరుడు తన వృషభ వాహనాన్ని ఇక్కడ బంధించాడట. తొలిసారి యాత్ర చేసే కన్నె స్వాములు ఇక్కడ కొబ్బరికాయలు కొడితే ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. <<-se>>#AyyappaMala<<>>
News November 19, 2025
భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు

ఎన్టీపీసీ లిమిటెడ్ 4 ఎగ్జిక్యూటివ్(<
News November 19, 2025
లొంగిపోయేందుకు సిద్ధమైన హిడ్మా!

ఎన్కౌంటర్లో చనిపోయిన హిడ్మా నవంబర్ 10న రాసిన ఓ లేఖ వైరల్ అవుతోంది. ఛత్తీస్గఢ్లోని ఓ లోకల్ జర్నలిస్టుకు ఈ లెటర్ రాసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ‘జోహార్.. మొత్తం పార్టీ లొంగిపోయేందుకు సిద్ధంగా లేదు. సెక్యూరిటీ రిస్కులతో పాటు చాలా సమస్యలు ఉన్నాయి. మా భద్రతకు హామీ ఇస్తే ఎవరినైనా (లొంగిపోయేందుకు) కలిసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం లొకేషన్ నిర్ణయించాలి’ అని లేఖలో ఉన్నట్లు పేర్కొంది.


