News October 20, 2024
వైసీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు

AP: తిరుమల వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను అమ్ముకున్నట్లు ఓ భక్తుడు చేసిన ఫిర్యాదుతో వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలతో 6 టికెట్లను రూ.65వేలకు అమ్ముకున్నట్లు బెంగళూరుకు చెందిన సాయికుమార్ ఆరోపించారు. అయితే తాను టీడీపీలో చేరుతుండటంతో వైసీపీ నేతలే కుట్ర చేశారని జకియా ఖానమ్ విమర్శించారు. మైనార్టీ మహిళలకు ఆ పార్టీలో గౌరవం లేదన్నారు.
Similar News
News December 6, 2025
బ్రెస్ట్ క్యాన్సర్ను ఎలా గుర్తించాలంటే?

బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తించడానికి మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచిస్తారు. అయితే భారతీయ మహిళల్లో రొమ్ములు చాలా దట్టంగా ఉండటం వల్ల.. ఈ పరీక్ష సమయంలో క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు మిస్ అవుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడం ఉత్తమమని చెబుతున్నారు పరిశోధకులు. అలాగే మహిళలు కూడా తమ రొమ్ములను ఎప్పటికప్పుడు స్వీయ పరీక్ష చేసుకోవాలని సూచిస్తున్నారు.
News December 6, 2025
భారీ జీతంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
గుడికెళ్లి, దేవుడిని దర్శిస్తే పుణ్యం లభిస్తుందా?

ఆలయాలకు వెళ్లడం అంటే కేవలం దేవుడిని చూడటం కాదు. విగ్రహారాధనలోని రహస్యాన్ని, దర్శనం పరమార్థాన్ని తెలుసుకోవాలి. భగవంతుని గొప్ప లీలలు, గుణాలను మనసులో తలుచుకోవాలి. ఆయనే మనకు శరణం అని గుర్తించాలి. నిరంతరం ఆయనపై ధ్యానం ఉంచుతూ, ఆయనకు నచ్చిన మంచి పనులు చేయాలి. కేవలం దర్శనం కాకుండా, ఈ సత్యాన్ని గ్రహిస్తేనే మనం జీవితంలో మోక్షాన్ని సాధించగలం. <<-se>>#Bakthi<<>>


