News October 20, 2024
వైసీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు

AP: తిరుమల వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను అమ్ముకున్నట్లు ఓ భక్తుడు చేసిన ఫిర్యాదుతో వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలతో 6 టికెట్లను రూ.65వేలకు అమ్ముకున్నట్లు బెంగళూరుకు చెందిన సాయికుమార్ ఆరోపించారు. అయితే తాను టీడీపీలో చేరుతుండటంతో వైసీపీ నేతలే కుట్ర చేశారని జకియా ఖానమ్ విమర్శించారు. మైనార్టీ మహిళలకు ఆ పార్టీలో గౌరవం లేదన్నారు.
Similar News
News March 15, 2025
ధనికులుగా మారేందుకు హర్ష్ గోయెంకా చిట్కాలు

ఆర్థిక క్రమశిక్షణతో ధనికులుగా మారేందుకు వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా Xలో చెప్పిన టిప్స్ వైరలవుతున్నాయి.
* సంపదను సృష్టించే ఆస్తులను సంపాదించండి
* సంపాదించే దాని కన్నా తక్కువ ఖర్చు చేయండి
* ఆదాయంతో పాటు సంపదను సృష్టించడంపై దృష్టి పెట్టండి
* ఆర్థిక ఐక్యూను మెరుగుపరచుకొండి
* సంపదను పెంచే అవకాశాలను చూడండి
* మనీ కోసమే కాకుండా నేర్చుకునేందుకు పనిచేయండి
News March 15, 2025
MLAలు రూ.800కోట్లు డిమాండ్ చేస్తున్నారు: DK శివకుమార్

బెంగళూరులో చెత్త సంక్షోభంపై వివిధ పార్టీల ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని Dy.CM DK శివకుమార్ ఆరోపించారు. సిటీ ఎమ్మెల్యేలంతా కలసి సిటీ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.800 కోట్లు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. కాంట్రాక్టర్లంతా సిండికేట్గా మారి సాధారణ ధరల కంటే 85శాతం అధికంగా కోట్ చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా కోర్టును ఆశ్రయించారన్నారు.
News March 15, 2025
మార్చి15: చరిత్రలో ఈరోజు

*1493: మెుదటి పర్యటన అనంతరం స్పెయిన్ చేరిన కొలంబస్
*1564: జిజియా పన్ను రద్దు
*1934: బీఎస్పీ పార్టీ స్థాపకుడు కాన్షీరాం జననం
*1937: తెలుగు సాహితి విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య జననం
* 1950: ప్రణాళిక సంఘం ఏర్పాటు
*1983: ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
*1990: సోవియట్ యూనియన్ మెుదటి అధ్యక్షుడిగా గోర్బచేవ్ ఎన్నిక