News October 20, 2024

వైసీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు

image

AP: తిరుమల వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను అమ్ముకున్నట్లు ఓ భక్తుడు చేసిన ఫిర్యాదుతో వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలతో 6 టికెట్లను రూ.65వేలకు అమ్ముకున్నట్లు బెంగళూరుకు చెందిన సాయికుమార్ ఆరోపించారు. అయితే తాను టీడీపీలో చేరుతుండటంతో వైసీపీ నేతలే కుట్ర చేశారని జకియా ఖానమ్ విమర్శించారు. మైనార్టీ మహిళలకు ఆ పార్టీలో గౌరవం లేదన్నారు.

Similar News

News December 10, 2025

అంతర పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

దీర్ఘకాలిక పంటల మధ్య.. స్వల్పకాలిక పంటలను అంతర పంటలుగా వేసుకోవాలి. పప్పు జాతి రకాలను సాగు చేస్తే పోషకాలను గ్రహించే విషయంలో పంటల మధ్య పోటీ ఉండదు. ప్రధాన పంటకు ఆశించే చీడపీడలను అడ్డుకునేలా అంతరపంటల ఎంపిక ఉండాలి. ప్రధాన, అంతర పంటలపై ఒకే తెగులు వ్యాపించే ఛాన్సుంటే సాగు చేయకపోవడం మేలు. చీడపీడల తాకిడిని దృష్టిలో ఉంచుకొని పంటలను ఎంచుకోవాలి. సేంద్రియ ఎరువుల వాడకంతో ఎక్కువ దిగుబడి పొందవచ్చు.

News December 10, 2025

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) 5 సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా(ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్, మెకానికల్ ఇంజినీర్) ఉత్తీర్ణతతో పాటు 15ఏళ్ల పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన అభ్యర్థులు డిసెంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. జీతం నెలకు రూ.30,000-రూ.1,20,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/

News December 10, 2025

మీ పిల్లల స్కూల్ బ్యాగు ఎంత బరువుండాలంటే?

image

ప్రస్తుతం ప్రైమరీ విద్యార్థులు కూడా మోయలేనంత బరువున్న బ్యాగులతో స్కూళ్లకు వెళ్తూ ఇబ్బందిపడుతున్నారు. అయితే ‘NEP-2020’ మార్గదర్శకాల ప్రకారం స్కూల్ బ్యాగ్ బరువు పిల్లల శరీర బరువులో 10 శాతం ఉండాలి. ప్రీ ప్రైమరీకి బ్యాగులే ఉండవు. 5వ తరగతి వరకు 1.6-2.5KG, 6-7 క్లాస్‌కి 2-3KG, 9-10 విద్యార్థుల బ్యాగులు 2.5-4.5KG మించకూడదు. అధిక భారం వల్ల పిల్లలకు వెన్ను నొప్పి, భుజాల సమస్యలు రావొచ్చు. SHARE IT