News July 13, 2024
యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై కేసు నమోదు

ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై మహారాష్ట్ర సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు UPSC పరీక్షకు హాజరుకాకుండానే ఉత్తీర్ణత సాధించినట్లు ధ్రువ్ పేరడీ X అకౌంట్లో పోస్టయ్యింది. బిర్లా బంధువు ఫిర్యాదు మేరకు BNS, IT సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. అయితే ధ్రువ్ మెయిన్ అకౌంట్కు దీనికి సంబంధం లేదని జర్నలిస్టులు ప్రస్తావించగా, ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Similar News
News March 24, 2026
మార్చి 24: చరిత్రలో ఈరోజు

1603: బ్రిటిషు మహారాణి ఎలిజబెత్ మరణం
1775: కవి, వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు జననం
1882: క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్క్యులాసిస్ను రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు
1977: భారత ప్రధానిగా మొరార్జీ దేశాయ్ బాధ్యతలు (ఫొటోలో)
1984 : భారత హాకీ క్రీడాకారుడు ఆడ్రియన్ డిసౌజా జననం
1991: సినీ గేయ రచయిత చెరువు ఆంజనేయ శాస్త్రి మరణం
* ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం
News March 24, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 24, 2026
నాసిక్ దొంగ బాబా.. గర్భవతినీ వదల్లేదు

నాసిక్ (MH) దొంగ బాబా అశోక్ ఖారత్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పూజలు చేస్తే ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారని నమ్మించి ఒక గర్భవతిని దారుణంగా రేప్ చేశాడు. పెళ్లి కుదురుతుందని నమ్మబలికి మరో యువతిని లోబర్చుకున్నాడు. ఇప్పటికే అరెస్టైన ఈ దొంగ బాబాపై ఇప్పుడు మరిన్ని కేసులు నమోదయ్యాయి. అలాగే కిలో ₹100 దొరికే చింతపిక్కలను రత్నాలంటూ ఒక్కోదాన్ని ₹10,000కు అమ్మి భక్తుల వీక్నెస్తో ఆడుకున్నాడు.


