News January 27, 2025

అకౌంట్లలో డబ్బులు పడ్డాయా?

image

TG: అర్ధరాత్రి నుంచి ‘రైతు భరోసా’, ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని సీఎం రేవంత్ నిన్న ప్రకటించారు. తొలి దశలో భాగంగా ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో పడతాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటిన్నర ఎకరాలకు రైతు భరోసా అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సుమారు 10 లక్షల మంది రైతు కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ అందే సూచనలు ఉన్నట్లు సమాచారం. మరి మీకు డబ్బులు పడ్డాయా?

Similar News

News January 24, 2026

దీర్ఘాయుష్షుకు 5 నిమిషాల ఎక్స్‌ట్రా ఎక్సర్‌సైజ్ చాలు!

image

ఆయుష్షు పెంచుకోవడానికి గంటల తరబడి శ్రమించక్కర్లేదు. రోజుకు కేవలం 5 నిమిషాలు ఎక్స్‌ట్రా ఎక్సర్‌సైజ్ చేసినా లేదా 30 నిమిషాలు కూర్చునే సమయం తగ్గించినా ఆయుర్దాయం పెరుగుతుందని ‘ది లాన్సెట్’లో పబ్లిష్ అయిన తాజా స్టడీ వెల్లడించింది. మంచి నిద్ర, పోషకాహారం, తక్కువ ఒత్తిడి, స్మోకింగ్, డ్రింకింగ్‌కి దూరంగా ఉండడం వంటి మార్పులు తోడైతే దీర్ఘాయువు మీ సొంతం. రోజూ కాసేపు వేగంగా నడిచినా ఆరోగ్యం పదిలంగా ఉన్నట్లే.

News January 24, 2026

విష్ణుమూర్తికి నైవేద్యం ఏ పాత్రలో పెట్టాలి?

image

విష్ణువుకు నైవేద్యం సమర్పించడానికి రాగి పాత్ర శ్రేష్టం. పూర్వం విష్ణు భక్తుడైన గుడాకేశుడు తన శరీరం లోహంగా మారాలని కోరుకున్నాడు. స్వామి అనుగ్రహంతో రాగిగా మారాడు. తన భక్తుని శరీర రూపమైన రాగి పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడం విష్ణువుకు ప్రీతికరం. శాస్త్రీయంగా కూడా రాగికి బ్యాక్టీరియాను నశింపజేసే గుణం, రోగనిరోధక శక్తిని పెంచే స్వభావం ఉంది. అందుకే దేవాలయాల్లో రాగి పాత్రల్లోనే తీర్థం ఇస్తుంటారు.

News January 24, 2026

బొప్పాయిలో రసం పీల్చే పురుగులను ఎలా నివారించాలి?

image

బొప్పాయి మొక్కలు నాటడానికి 15 రోజుల ముందే తోట చుట్టూ 2 వరుసల్లో అవిశ, 2 వరుసల్లో మొక్కజొన్న మొక్కలను నాటాలి. అలాగే పొలంలో రసం పీల్చే పురుగుల ఉద్ధృతిని తెలుసుకోవడానికి ఎకరాకు 12-15 పసుపు రంగు జిగురు అట్టలను మొక్కల కన్నా ఎత్తులో పెట్టాలి. ఒకవేళ రసం పీల్చే పురుగులను గమనిస్తే లీటరు నీటికి వేపనూనె 2.5ml+ అసిఫేట్ 1.5 గ్రా+ జిగురు 0.5ml కలిపి 15 రోజుల వ్యవధిలో పురుగుల ఉద్ధృతిని బట్టి పిచికారీ చేయాలి.