News January 27, 2025
అకౌంట్లలో డబ్బులు పడ్డాయా?

TG: అర్ధరాత్రి నుంచి ‘రైతు భరోసా’, ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని సీఎం రేవంత్ నిన్న ప్రకటించారు. తొలి దశలో భాగంగా ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో పడతాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటిన్నర ఎకరాలకు రైతు భరోసా అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సుమారు 10 లక్షల మంది రైతు కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ అందే సూచనలు ఉన్నట్లు సమాచారం. మరి మీకు డబ్బులు పడ్డాయా?
Similar News
News November 26, 2025
IPL ఆధారంగా టెస్టులకు సెలక్ట్ చేస్తే..

టీమ్ ఇండియా బ్యాటర్లు టెస్టుల్లో విఫలం అవడానికి ప్రధాన కారణం IPL ఆధారంగా సెలక్ట్ చేయడమేనని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దూకుడుగా ఆడే బ్యాటర్లను వన్డేలు, టీ20లకు ఎంపిక చేయాలి కానీ టెస్టులకు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్, ఇంద్రజిత్, యశ్ రాథోడ్, పృథ్వీ షా, జగదీశన్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి డొమెస్టిక్ ప్లేయర్లను తీసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు.
News November 26, 2025
IPL ఆధారంగా టెస్టులకు సెలక్ట్ చేస్తే..

టీమ్ ఇండియా బ్యాటర్లు టెస్టుల్లో విఫలం అవడానికి ప్రధాన కారణం IPL ఆధారంగా సెలక్ట్ చేయడమేనని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దూకుడుగా ఆడే బ్యాటర్లను వన్డేలు, టీ20లకు ఎంపిక చేయాలి కానీ టెస్టులకు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్, ఇంద్రజిత్, యశ్ రాథోడ్, పృథ్వీ షా, జగదీశన్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి డొమెస్టిక్ ప్లేయర్లను తీసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు.
News November 26, 2025
సిద్దిపేట: ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులు చేసుకోండి: కలెక్టర్

సిద్దిపేట జిల్లా కలెక్టర్ K.హైమావతి BC, SC విద్యార్థుల ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల సమీక్ష నిర్వహించారు. MEOలు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో సమీకృత జిల్లా కలెక్టరేట్లో సమీక్ష జరిగింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో 5-10వ తరగతి BC, SC విద్యార్థులు, ప్రైవేట్ పాఠశాలల్లో 9-10వ తరగతి BC, SC విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.


