News October 7, 2025
కర్ణాటకలో కులగణన.. స్కూళ్లకు 10 రోజుల సెలవులు

కులగణన సర్వే నేపథ్యంలో కర్ణాటక CM సిద్దరామయ్య రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లకు 10 రోజులు సెలవులు ప్రకటించారు. రేపటి నుంచి ఈనెల 18 వరకు మూసివేయనున్నట్లు తెలిపారు. సర్వేలో టీచర్లు పాల్గొంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. కులగణన ఇవాళే ముగియాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల మరో 10 రోజులు పొడిగించారు. అటు సర్వే చేస్తున్న ముగ్గురు సిబ్బంది మరణించగా రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
Similar News
News October 7, 2025
కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ సంతకాల సేకరణ

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అక్టోబర్ 10 నుంచి ప్రజా ఉద్యమం చేయనున్నట్లు YCP చీఫ్ వైఎస్ జగన్ వెల్లడించారు. దీనిపై కార్యాచరణ ప్రకటించారు. కోటి సంతకాల సేకరణకు ఈనెల 10 నుంచి 22 వరకు గ్రామ, వార్డు స్థాయిల్లో రచ్చబండ, 28న నియోజకవర్గ, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, సంతకాల పత్రాలు NOV 23న జిల్లా కేంద్రాలకు, 24న విజయవాడకు చేర్చాలని తెలిపారు. తర్వాత వాటిని గవర్నర్కు సమర్పిస్తామని చెప్పారు.
News October 7, 2025
ఎన్నికలు పక్కా.. అయితే ప్లాన్ ‘A’, లేదంటే ‘B’C

TG: ఏదేమైనా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని CM రేవంత్ స్పష్టం చేశారు. BCలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టులో రేపు విచారణ జరగనుండగా న్యాయ నిపుణులు, మంత్రులు, ముఖ్య నేతలతో CM సమావేశమయ్యారు. తమ నిర్ణయ ఉద్దేశం, గత తీర్పులను కోర్టుకు వివరించాలని లాయర్లకు సూచించారు. G.O.ను తోసిపుచ్చితే ఆదేశాలు పాటిస్తామని HCకి విన్నవించాలన్నారు. ఇలా అయితే పార్టీపరంగా 42% రిజర్వేషన్లతో (Plan:B) ఎన్నికలకు వెళ్దామని తెలిపారు.
News October 7, 2025
తప్పుదారి పట్టించేలా ఫేక్ వీడియోలు: నిర్మల

తాను మాట్లాడినట్టుగా రూపొందించిన AI వీడియోలపై మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఇవి వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయన్నారు. ఈ ఫేక్ వీడియోలతో నిజమేదో అబద్ధమేదో తెలీని గందరగోళం ఏర్పడుతోందని తెలిపారు. వీటిని నివారించేందుకు రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. వ్యక్తుల రూపాలు, స్వరాలను క్లోనింగ్ చేయడానికి AIని వాడుతూ కొందరు మోసాలకు దిగుతున్నారన్నారు.