News November 14, 2024

విద్య, ఉపాధి అవకాశాలు పెరగాలంటే కులగణన జరగాలి: CM

image

TG: కులగణనపై అపోహలు తొలగించే బాధ్యతను విద్యార్థులే తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ఎవరు అడ్డుపడ్డా కులగణన ఆగదు. మీ తల్లిదండ్రులకు, చుట్టుపక్కలవారికి దీనిపై అవగాహన కల్పించాలి. దీనివల్ల 50శాతానికిపైగా రిజర్వేషన్లు వస్తాయి. విద్య, ఉపాధి అవకాశాలు పెరగాలంటే కులగణన జరగాలి’ అని ఎల్బీ స్టేడియంలో జరిగిన బాలల దినోత్సవంలో సీఎం పేర్కొన్నారు.

Similar News

News November 11, 2025

₹12.92 ట్రిలియన్లకు పెరిగిన ప్రత్యక్ష పన్నుల ఆదాయం

image

కేంద్ర ప్రత్యక్ష పన్నుల ఆదాయం గతంతో పోలిస్తే 7% పెరిగి ₹12.92 ట్రిలియన్లకు చేరింది. APR 1-NOV 10 వరకు వచ్చిన ఆదాయ వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలానికి ₹12.08 ట్రిలియన్లు వచ్చాయి. రిఫండ్‌లు గత ఏడాది కన్నా 18% తగ్గి ₹2.42 ట్రిలియన్లుగా ఉన్నాయి. FY 2025-26కి ₹25.20 ట్రిలియన్ల డైరెక్ట్ ట్యాక్స్ ఆదాయాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది ఆదాయం కన్నా ఇది 12.7% అధికం.

News November 11, 2025

లేటెస్ట్ అప్‌డేట్స్

image

⋆ విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన NIA.. సిరాజ్ ఉర్ రెహమాన్(VZM), సయ్యద్ సమీర్(HYD) యువతను టెర్రరిజంవైపు ప్రేరేపించేలా కుట్ర పన్నారని అభియోగాలు
⋆ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్‌పై వెనక్కి తగ్గిన YS జగన్.. NOV 21లోగా CBI కోర్టులో హాజరవుతానని స్పష్టీకరణ.. యూరప్ వెళితే NOV 14లోగా కోర్టులో హాజరుకావాలని గతంలో ఆదేశించిన కోర్టు
* జూబ్లీహిల్స్‌లో 50.16% ఓటింగ్ నమోదు

News November 11, 2025

పాక్‌లో ఆత్మాహుతి దాడి వెనుక భారత్: షరీఫ్

image

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి భారత్‌పై విషం కక్కారు. ఇస్లామాబాద్‌లో జరిగిన <<18258453>>ఆత్మాహుతి దాడి<<>> వెనుక ఇండియా ఉందంటూ ఆరోపించారు. తమ దేశాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో ఢిల్లీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. అఫ్గాన్ కేంద్రంగా పనిచేసే TTP భారత్ ఆడించే తోలుబొమ్మ అని అక్కసు వెళ్లగక్కారు. ఇది అనేక మంది చిన్నపిల్లలపై దాడులు చేస్తోందని, దీన్ని ఎంత ఖండించినా సరిపోదంటూ మొసలి కన్నీళ్లు కార్చారు.