News November 14, 2024
విద్య, ఉపాధి అవకాశాలు పెరగాలంటే కులగణన జరగాలి: CM

TG: కులగణనపై అపోహలు తొలగించే బాధ్యతను విద్యార్థులే తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ఎవరు అడ్డుపడ్డా కులగణన ఆగదు. మీ తల్లిదండ్రులకు, చుట్టుపక్కలవారికి దీనిపై అవగాహన కల్పించాలి. దీనివల్ల 50శాతానికిపైగా రిజర్వేషన్లు వస్తాయి. విద్య, ఉపాధి అవకాశాలు పెరగాలంటే కులగణన జరగాలి’ అని ఎల్బీ స్టేడియంలో జరిగిన బాలల దినోత్సవంలో సీఎం పేర్కొన్నారు.
Similar News
News October 28, 2025
కాల్స్ అన్నీ రికార్డ్ చేస్తారంటూ ప్రచారం.. నిజమిదే

వాట్సాప్ కాల్స్కు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్ పోలీసులు ఖండించారు. అన్ని ఫోన్ కాల్స్ రికార్డు చేసి సేవ్ చేస్తారని, సోషల్ మీడియా ఖాతాలను పర్యవేక్షిస్తారంటూ సర్క్యులేట్ అవుతున్న నకిలీ పోస్టర్ను నమ్మొద్దని సూచించారు. ‘ఈ పోస్టర్లోని సమాచారం పూర్తిగా అవాస్తవం. పోలీసులు దీనిని విడుదల చేయలేదు. దీనిని ఎవరూ షేర్ చేయొద్దు’ అని Xలో రాసుకొచ్చారు.
News October 28, 2025
కల్లుపై నిషేధం ఎత్తేస్తాం: తేజస్వీ యాదవ్

బిహార్ను దేశంలోనే నం.1గా తీర్చిదిద్దుతామని RJD నేత తేజస్వీ యాదవ్ అన్నారు. తమ మ్యానిఫెస్టో దీనికి రోడ్ మ్యాప్ అని చెప్పారు. ‘మేం గెలిస్తే కల్లుపై నిషేధం ఎత్తేస్తాం. అవినీతి అధికారులు, బీజేపీ నేతలు CM నితీశ్ను పప్పెట్గా చేశారు. NDA ఆయనను మళ్లీ సీఎం చేయదు’ అని పేర్కొన్నారు. కాగా తాము ఎక్కువ సీట్లు గెలుస్తామని అభిషేక్ బెనర్జీ (TMC) అన్నారు. OPS అమలు చేస్తామని దీపాంకర్ భట్టాచార్య(CPI) తెలిపారు.
News October 28, 2025
BIG ALERT: కాకినాడ-యానాం మధ్య తీరాన్ని తాకిన తుఫాను

AP: మొంథా తుఫాను కాకినాడ-యానాం మధ్య తీరాన్ని తాకిందని APSDMA ప్రకటించింది. యానాం- అంతర్వేదిపాలెం దగ్గర తీవ్రమైన తుఫానుగా తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాను పూర్తిగా తీరాన్ని దాటేందుకు 3-4 గంటలు పడుతుందని వెల్లడించింది. తీరప్రాంత జిల్లాల్లో గంటకు 90-100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.


