News March 18, 2025

‘దమ్ముంటే పట్టుకోరా’.. ఇన్విజిలేటర్‌కు సవాల్

image

AP: రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు జరుగుతున్న వేళ ఓ పరీక్షా కేంద్రం వద్ద రాసిన రాతలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. శ్రీకాకుళం (D) టెక్కలిలోని ఓ ఎగ్జామ్ సెంటర్ గోడపై ‘దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు.. పట్టుకుంటే వదిలేస్తా బుక్ లెట్’ అనే రాతలు కనిపించాయి. దీన్ని చూసిన ఇన్విజిలేటర్లు మండిపడ్డారు. ఇది ఆకతాయిల పనే అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ పిచ్చిరాతలపై మీ COMMENT.

Similar News

News March 18, 2025

చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి రూ.50,000: సీఎం

image

AP: చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని CM చంద్రబాబు తెలిపారు. దీంతో 93వేల మంది చేనేతకారులకు, 10,534 మరమగ్గాల యజమానులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి ₹50,000 సాయం చేస్తామని ప్రకటించారు. అలాగే వారికి GST రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ సహకారంతో నేతన్నలు వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.

News March 18, 2025

ఆధార్- ఓటర్ కార్డు అనుసంధానానికి నిర్ణయం

image

ఆధార్- ఓటర్ కార్డు అనుసంధానించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అనుసంధానానికి గల సాంకేతిక అంశాలపై UIDAIతో సంప్రదింపులు జరుపుతామని స్పష్టం చేశారు. ఇవాళ పలు శాఖల కార్యదర్శులతో సమావేశమైన CEC ఈ మేరకు వెల్లడించారు.

News March 18, 2025

ప్రభుత్వ సంస్థల విద్యుత్ సర్‌ఛార్జీ రద్దు

image

AP: ప్రభుత్వ సంస్థలు, విభాగాల విద్యుత్ సర్‌ఛార్జీని మాఫీ చేస్తూ APERC ఉత్తర్వులు ఇచ్చింది. 2024-25కు గాను ఆయా సంస్థలు రూ.3,176 కోట్లు బకాయిపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో వన్ టైమ్ సెటిల్మెంట్ కింద సర్‌ఛార్జీని ఈఆర్సీ ఉపసంహరించుకుంది.

error: Content is protected !!