Anantapur

News June 26, 2024

ఈ ఐక్యతతో హోదా సాధించండి: రఘువీరా రెడ్డి

image

రాష్ట్రంలోని ఎంపీలంతా ఎన్డీయే స్పీకర్ అభ్యర్థి ఓం బిర్లాకు మద్దతివ్వడంపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి స్పందించారు. ‘మన రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు ఎన్డీయే ప్రతిపాదించిన స్పీకర్ అభ్యర్థికి మద్దతిస్తున్నారు. అలాంటి ఐక్యతతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తారని, పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సమస్యలను పరిష్కరించి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.

News June 26, 2024

నేడు ఓటేయనున్న అనంత, హిందూపురం ఎంపీలు

image

పార్లమెంట్‌లో నేడు లోక్ సభ స్పీకర్ ఎలక్షన్​ జరగనుంది. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, హిందూపురం ఎంపీ పార్థసారథి తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఇరువురు టీడీపీ ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు ఓటేయనున్నారు.

News June 26, 2024

డాక్టర్ కాదు కామాంధుడు

image

శ్రీసత్యసాయి జిల్లాలో కామాంధ వైద్యుడి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని వైద్యుడు ఉదయ్‌ రోజూ రాత్రి 9 తర్వాత ఆసుపత్రి, సచివాలయాల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలకు సెల్‌ఫోన్లలో అసభ్యకర సందేశాలు పంపుతున్నాడు. ‘మీరు కాకపోతే మీ పిల్లలను పంపించండి’ అంటూ ఒత్తిడి చేస్తుండటతో ఐదుగురు ఏఎన్‌ఎంలు మంగళవారం జిల్లా వైద్యాధికారిణి మంజువాణికి ఫిర్యాదు చేశారు. ఆమె దీనిపై విచారణకు ఆదేశించారు.

News June 26, 2024

ATP: పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య

image

నత్తితో ఇబ్బంది పడుతున్న యువకుడు తనకు వివాహం కాలేదని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంకటరెడ్డిపల్లికి చెందిన లక్ష్మీనారాయణకు(28) నత్తి ఉంది. దీంతో పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మనస్తాపంతో మంగళవారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి తిమ్మక్క ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 26, 2024

నేడు తాడిపత్రి మున్సిపల్ అత్యవసర సమావేశం

image

తాడిపత్రి పురపాలక అత్యవసర సమావేశం నేడు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామ్ మోహన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఉంటుందని పట్టణంలోని అన్ని వార్డు కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది హాజరుకావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News June 25, 2024

అనంత: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

బుక్కరాయసముద్రం మండలం రోటరీ పురం గ్రామం వద్ద విద్యుత్ షాక్‌తో ఎస్.ఆర్.సి రోడ్డు నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న బీహార్ కార్మికుడు ఎం.డి సాదిక్ మంగళవారం మృతి చెందారు. ఉదయం స్నానం చేసేందుకు హీటర్‌తో నీళ్లు వేడి చేసి తీసుకునే సమయంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికి అక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 25, 2024

బ్యాంక్ లోన్ ఇప్పిస్తానని.. భూమిని అమ్మేశాడు

image

లోన్ ఇప్పిస్తానని నమ్మించి భూమిని అమ్మేశారని బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిగి(M) ఊటుకూరు చెందిన హనుమంతప్పకు 5.10 ఎకరాల భూమి ఉంది. హిందూపురానికి చెందిన జనార్దన్‌రెడ్డి భూమికి బ్యాంక్‌ లోన్ ఇప్పిస్తానని నిరాక్షరాస్యులైన హనుమంతప్ప, కుటుంబాన్ని నమ్మించి నెల్లూరు(D)కు చెందిన కుసుమకుమారికి రిజిస్ట్రేషన్ చేయించారు. అకౌంట్‌లు ఓపెన్ చేయించి రూ.3లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

News June 25, 2024

‘నా పెళ్లికి రండి’.. బాలకృష్ణకు నటి వరలక్ష్మి ఆహ్వానం

image

నటి వరలక్ష్మి శరత్ కుమార్ హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణను ఆయన నివాసంలో కలిశారు. బాలకృష్ణ దంపతులకు కార్డు అందించి, తన వివాహానికి రావాలంటూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాబోయే కొత్త జంటకు బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రియుడు నికోలయ్‌‌ సచ్‌దేవ్‌తో వరలక్ష్మి ఏడడుగులు వేయబోతున్నారు. జులై 2న వీరి పెళ్లి జరగనున్నట్లు వార్తలొస్తున్నాయి.

News June 25, 2024

అనంతపురం జిల్లాలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

image

జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. అనంతపురం జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.109.48 ఉండగా ఆ ధర నేటికి రూ.109.25కి చేరింది. డీజిల్ లీటర్ ధర రూ.97.33 నుంచి రూ.97.11కి తగ్గింది. సత్యసాయి జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.110.62 ఉండగా ఆ ధర నేటికి రూ.110.28కి చేరింది. డీజిల్ లీటర్ ధర రూ.98.39 నుంచి రూ.98.05కి తగ్గింది.

News June 25, 2024

అనంతపురం జిల్లాలో DSC పోస్టులు ఎన్నంటే?

image

మెగా డీఎస్సీ నోటిఫికేషన్, టెట్ నిర్వహణకు జులై 1న షెడ్యూల్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 16,347 డీఎస్సీ పోస్టులకు గానూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 183 ఎస్టీటీలతో కలిపి మొత్తం 811 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల ముందు రాష్ట్రంలో టెట్ పరీక్ష జరగ్గా.. బీఈడీ, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారికి మరోసారి టెట్ నిర్వహించాలని కేబినెట్‌లో సోమవారం నిర్ణయించారు. SHARE IT.