India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి HIVపై విద్యార్థులకు అవగాహణ కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 26న విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీల్లో తాడిపత్రి కళాశాల విద్యార్థిని గౌసియా మొదటి బహుమతి సాధించింది. కాగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ రెవెన్యూ భవన్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అనంతరం విద్యార్థిని అభినందించారు. జాతీయ స్థాయి క్విజ్ పోటీల్లో రాణించాలన్నారు.
జాతిపిత మహాత్మా గాంధీ పెయింటింగ్ చిత్రపటాన్ని గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ భాస్కర్ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్కు బహుకరించారు. చీరాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రవి జర్మన్ కాన్వాస్పై చిత్రీకరించిన గాంధీజీ చిత్రపటాన్ని అనంతపురంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గుత్తికోట సంరక్షణ సమితి సభ్యులను అభినందించారు.
జాతిపిత మహాత్మా గాంధీ పెయింటింగ్ చిత్రపటాన్ని గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ భాస్కర్ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్కు బహుకరించారు. చీరాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రవి జర్మన్ కాన్వాస్పై చిత్రీకరించిన గాంధీజీ చిత్రపటాన్ని అనంతపురంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గుత్తికోట సంరక్షణ సమితి సభ్యులను అభినందించారు.
చెత్త సంపద తయారీ కేంద్రాలతో పంచాయతీలు అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం రూరల్లోని చియ్యేడులో నూతన గోకులం షెడ్డును అధికారులు కలిసి ప్రారంభించారు. ముందుగా మొక్కలను నాటారు. అనంతరం చెత్త సంపద సృష్టి కేంద్రంలోని తొట్టెల్లో తయారవుతున్న వర్మీ కంపోస్టు, సేంద్రియ ఎరువును ఆయన పరిశీలించారు.
అనంతపురంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేయాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తామన్నారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అనంతపురంలో ఆదివారం జరిగే గణేశ్ నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా ముగిసేలా పటిష్ఠ పోలీసు బందోబస్తు చేపట్టామని ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. ప్రజలు, ఉత్సవ కమిటీలు.. మరీ ముఖ్యంగా యువత పోలీసులతో సహకరించాలని కోరారు. ఆనందంగా, సంతోషకర వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు. శోభాయాత్ర, నిమజ్జనం నేపథ్యంలో అనంతపురం పోలీస్ పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
నార్పలలోని సూర్య నగర్ కాలనీలో నివాసమున్న మల్లారెడ్డి కుమారుడు హేమేశ్ కుమార్ అదే కాలనీకి చెందిన యువతిని ప్రేమించమని వేధించేవాడు. ఇదే క్రమంలో శనివారం ఆ అమ్మాయి ఇంటికి వెళ్లగా తండ్రి అడ్డుకున్నాడు. దీంతో హేమేశ్ యువతి తండ్రిపై కొడవలితో దాడి చేశాడు. బాధితుడిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు నార్పల ఎస్ఐ సాగర్ తెలిపారు.
తాడిపత్రి నుంచి నంద్యాల, కడపకు వెళ్లే వాహనాలను డైవర్ట్ చేసినట్లు సీఐ సాయి ప్రసాద్ పేర్కొన్నారు. అనంతపురం నుంచి కడపకు వెళ్లేందుకు శివుడి విగ్రహం నుంచి ఆటోనగర్ మీదుగా, అనంతపురం టు నంద్యాలకు శ్రీకృష్ణదేవరాయలు సర్కిల్ మీదుగా, చుక్కలూరు బ్రిడ్జి సజ్జలదిన్నె క్రాస్ బుగ్గ మీదుగా, కడప నుంచి నంద్యాలకు వెళ్లాలన్నా ఇదే మార్గంలో వెళ్లాలని సూచించారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మళ్లింపు ఉంటుందన్నారు.
నార్పలలోని సూర్య నగర్ కాలనీలో నివాసమున్న మల్లారెడ్డి కుమారుడు హేమేశ్ కుమార్ అదే కాలనీకి చెందిన యువతిని ప్రేమించమని వేధించేవాడు. ఇదే క్రమంలో శనివారం ఆ అమ్మాయి ఇంటికి వెళ్లగా తండ్రి అడ్డుకున్నాడు. దీంతో హేమేశ్ యువతి తండ్రిపై కొడవలితో దాడి చేశాడు. బాధితుడిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు నార్పల ఎస్ఐ సాగర్ తెలిపారు.
అనంతపురంలో ఆదివారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా చర్యలు చేపట్టామని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రజలు, ఉత్సవ కమిటీలు, యువత సహకరించాలని కోరారు. ఆనందంగా, సంతోషకర వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. శోభాయాత్ర, నిమజ్జనం నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేయమని ఎస్పీని కోరారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు వినియోగించాలన్నారు.
Sorry, no posts matched your criteria.