Anantapur

News October 27, 2024

కలెక్టర్ కార్యాలయంలో రేపు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం

image

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం పదిన్నర గంటలకు మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు కలెక్టరేట్‌లో జరిగే ఫిర్యాదుల సేకరణకు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై వినతులు ఇవ్వవచ్చునన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

News October 27, 2024

విడపనకల్: విద్యుత్ షాక్‌తో మహిళా రైతు మృతి

image

అనంతపురం జిల్లా విడపనకల్ మండలంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. మండలం పరిధిలోని హవళిగి గ్రామానికి చెందిన వరలక్ష్మి, పెన్నయ్య దంపతులు ఉదయం పొలం పనులకు వెళ్లారు. ఈ క్రమంలో వరలక్ష్మి పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైంది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News October 27, 2024

ATP: శింగనమల వద్ద ఘోర ప్రమాదం.. పోలీసుల అదుపులో లారీ డ్రైవర్!

image

శింగనమల క్రాస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు హరేరామ.. హరే కృష్ణ భక్తులు <<14460473>>మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు టైరు పేలి లారీని ఢీకొందా? అతివేగం కారణమా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కౌలుట్లయ్య తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో మృతిచెందిన వారంతా 30 ఏళ్లలోపు వారే. వీరిలో నలుగురు అనంత, సత్యసాయి జిల్లా వాసులు.

News October 27, 2024

ఈ నెల 28న గుంతకల్లులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ఈ నెల 28వ తేదీన గుంతకల్లులో సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. గుంతకల్లు రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తామన్నారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

News October 26, 2024

అనంతపురం మృతుల కుటుంబాలకు సీఎం సానుభూతి

image

అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింగనమల మండలం, నాయనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇస్కాన్ టెంపుల్ భక్తులు దుర్మరణం చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

News October 26, 2024

సింగనమల: ‘ప్రమాదానికి కారణం అతివేగమే’

image

సింగనమలలోని నాయన పల్లి క్రాస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు తెలిపారు. కారు అతివేగంగా రావడంతో కారు టైర్ పేలి డివైడర్ పైనుంచి అవతలి వైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిందన్నారు. దీంతో కారులో ఉన్న ఆరుగురు మృతిచెందినట్లు పేర్కొన్నారు. కాగా యాక్సిడెంట్ జరగడంతో అనంతపురం-కడప హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

News October 26, 2024

పుట్టపర్తికి వచ్చిన వెనిజులా వైస్ ప్రెసిడెంట్

image

వెనిజులా వైస్ ప్రెసిడెంట్ రోడ్రిగ్జ్‌ డెల్సీ పుట్టపర్తికి వచ్చారు. శ్రీ సత్యసాయి మహా సమాధి దర్శనార్థం శనివారం వైస్ ప్రెసిడెంట్ బృందం ప్రత్యేక విమానం ద్వారా శ్రీ సత్య సాయి విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి సత్య సాయి ట్రస్టు సభ్యుడు రత్నాకర్, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ విజయకుమార్ స్వాగతం పలికారు.

News October 26, 2024

సింగనమలలో ఆరుగురు మృతి.. వివరాలు ఇవే.!

image

అనంతపురం జిల్లా సింగనమల మండల నాయనపల్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డుప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. కారు టైరు పేలి లారీని ఢీకొనడంతో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మృతులు అనంతపురం ఇస్కాన్‌కి చెందిన వారని, తాడిపత్రిలోని ఇస్కాన్ నగర సంకీర్తనకి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృతులు సంతోష్, షణ్ముక్, వెంకన్న, శ్రీధర్, ప్రసన్న, వెంకీగా గుర్తించారు.

News October 26, 2024

యాడికి వద్ద కారు-ఆటో ఢీ.. 15 మందికి గాయాలు

image

తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలంలోని వేములపాడు-తాడిపత్రి మధ్య శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మంది వ్యవసాయ కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై యాడికి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News October 26, 2024

కేంద్ర మంత్రిత్వ శాఖల కమిటీల్లో జిల్లా ఎంపీలకు చోటు

image

అనంతపురం, హిందూపురం ఎంపీలు అంబికా లక్ష్మినారాయణ, బీకే పార్థసారథిలకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. కేంద్ర మంత్రిత్వ శాఖల సంప్రదింపులు(కన్సల్టేటివ్) కమిటీల్లో సభ్యులుగా వీరికి అవకాశం కల్పించింది. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథికి రహదారులు, రవాణాశాఖ కమిటీలో చోటు కల్పించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.