Anantapur

News May 31, 2024

శ్రీసత్యసాయి: గురుకులాల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు

image

శ్రీసత్యసాయి జిల్లాలోని మహాత్మ జ్యోతిబా గురుకుల పాఠశాలలో మిగిలి ఉన్న 6,7,8,9 తరగతిలో ఉన్న ఖాళీలను ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ ప్రిన్సిపాల్ ప్రసాద్ తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూన్ 20న జరిగే పరీక్షకు హాజరు కావాలని తెలిపారు.

News May 31, 2024

జేఎన్టీయూ చుట్టూ మూడు కిలోమీటర్లు రెడ్ జోన్

image

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ అనంతపురంలోని జేఎన్టీయూలో నిర్వహిస్తున్నందున జేఎన్టీయూ నుంచి మూడు కిలోమీటర్ల వరకు రెడ్ జోన్‌ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ గౌతమి శాలి తెలిపారు. శుక్రవారం జేఎన్టీయూను ప్రత్యేక పోలీసు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

News May 31, 2024

జేసీ ప్రభాకర్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు

image

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 6 వరకు అరెస్టు చేయవద్దంటూ పోలీసులను ఆదేశించింది. తాడిపత్రిలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో జేసీపై కేసులు నమోదు చేశారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించగా జేసీ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య కారణాలు చూపుతూ అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

News May 31, 2024

అనంత: పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఎన్ని రౌండ్లలో తెలుస్తాయంటే..!

image

అనంత జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లోక్ సభ పరిధి, 8అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్లను వేరుగా లెక్కిస్తారు. అసెంబ్లీ స్థానాల కొస్తే ఒక్క తాడిపత్రి మాత్రమే 6 టేబుళ్లు, మిగతా స్థానాలకు 4 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అనంతపురం అర్బన్ 5 రౌండ్లు, రాప్తాడు 3, ఉరవకొండ, గుంతకల్లు, శింగనమల, కళ్యాణదుర్గంలో 2 రౌండ్లు చొప్పున, తాడిపత్రి, రాయదుర్గం 1 రౌండ్లోనే లెక్కింపు పూర్తి కానుంది.

News May 31, 2024

ధర్మవరంలో సంపత్ కుమార్ హత్య..UPDATE

image

ధర్మవరంలో బుధవారం న్యాయవాది సంపత్ కుమార్ హత్యకు గురైన విషయం తెలిసిందే.. మృతుని స్నేహితునికి, మరో న్యాయవాది కృష్ణారెడ్డికి స్థల వివాదం ఉందని, స్నేహితుడికి మద్దతు తెలపడంతో హత్య చేశారని సంపత్ తండ్రి ఆరోపిస్తున్నారు. కాగా బుధవారం రాత్రి హంతకులు సంపత్‌ను హిందూపురంలో కారులో ఎత్తుకెళ్లి మార్గమధ్యలో కొడవలిలో నరికి చంపి.. ధర్మవరం చెరువు కట్టలో పడేసినట్లు సమాచారం. నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

News May 31, 2024

కళ్యాణదుర్గంలో చిరుత సంచారం

image

కళ్యాణదుర్గం మండలంలోని హులికల్లు బీసీ కాలనీ సమీపంలో గురువారం
చిరుత సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎటునుంచి వచ్చి దాడి చేస్తుందోనని పొలాలకు వెళ్లే రైతులు, కాలనీవాసులు బిక్కుబిక్కు మంటూ కాలం వెల్లదీస్తున్నారు. చిరుతను బంధించి అడవిలో వదలాలని కోరుతున్నారు. అటవీ అధికారి నాగే నాయక్ సిబ్బందితో రాత్రి గస్తీ నిర్వహించారు.

News May 31, 2024

అనంత జిల్లాలో తొలి ఫలితం విడుదల ఇక్కడే..?

image

అనంత జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గం తొలి ఫలితానికి నాంది పలకనున్నట్లు తెలుస్తోంది. ఉరవకొండకు 18 టేబుళ్లను ఏర్పాటు చేయగా.. ఇక్కడ 15 రౌండ్లకే లెక్కింపు పూర్తవుతుంది. దీంతో తొలి ఫలితం విడుదల కానుంది. కళ్యాణదుర్గం 19, గుంతకల్లు, తాడిపత్రి 20, శింగనమల, అనంత, రాప్తాడు 21, రాయదుర్గం 22 రౌండ్లలో లెక్కించనున్నారు. కాగా జూన్ 4న ఫలితాలు వెల్లడికానుండగా.. గెలుపోటములపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

News May 31, 2024

నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేశాం: కలెక్టర్

image

జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయా కౌంటింగ్ కేంద్రాలలో 14 టేబుల్ ఏర్పాటు చేశామని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం లేపాక్షిలో కలెక్టర్ మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రాల్లోకి అధికారులు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు వెళ్లేందుకు భారీ ఏర్పాటు చేశామన్నారు. ఈవీఎంల కౌంటింగ్ కోసం ప్రతి టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారన్నారు.

News May 31, 2024

అనంత: విద్యుత్ స్థంబాల ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

image

గుమ్మగట్ట మండలం పూలకుంట వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరు మృతి చెందారు. బీటీపీ గ్రామానికి చెందిన వీరేశ్ పరిస్థితి విషమించడంతో రాయదుర్గం ప్రభుత్వాసుపత్రి నుంచి బళ్లారి విమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో గురువారం రాత్రి మృతి చెందాడు. విద్యుత్ స్తంభాలతో వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో స్థంబాలు మీదపడి తీవ్రగాయాలవడంతో మృతిచెందినట్లు సమాచారం.

News May 31, 2024

రాయదుర్గంలో శ్రీవారి శయణోత్సవం.. ముగిసిన బ్రహ్మోత్సవాలు

image

రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన ప్రసన్న వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవ వేడుకలు గురువారం ముగిశాయని ఆలయ ఈవో నరసింహారెడ్డి మీడియాతో తెలిపారు. సాయంత్రం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సప్త ప్రాకారోత్సవం కార్యక్రమం చేపట్టారు. అనంతరం శయనోత్సవం కార్యక్రమం చేపట్టారు. దీంతో బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయన్నారు. బ్రహ్మోత్సవాలకు సహకరించిన పట్టణ పుర ప్రజలకు, భక్తులకు ఆలయ ఈవో ధన్యవాదాలు తెలిపారు.