India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం కోర్టు రోడ్డులో నివాసముంటున్న జూనియర్ న్యాయవాది రుక్సానా ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని మృతిచెందారు. విషయం తెలుసుకున్న రెండో పట్టణ ఎస్ఐ రుష్యేంద్రబాబు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈమె అనంతపురం న్యాయవాదుల బార్ అసోసియేషన్లో క్రియాశీల సభ్యురాలిగా ఉండేవారు. SKUలో LLB పూర్తి చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో జరుగుతున్న రహదారుల నిర్మాణపు పనులను ఎవరైనా అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్తో కలిసి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, రైల్వే లైన్ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నష్టపరిహారం చెల్లించిన భూముల్లో పనులు ప్రారంభించాలన్నారు.
అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారిగా మలోలాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో డీఆర్ఓగా ఉన్న రామకృష్ణారెడ్డిని సచివాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం డీఆర్ఓగా వస్తున్న మలోలా గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్టీఓగా విధులు నిర్వహించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షాల కారణంగా చెరువులు పొంగిపొర్లి ప్రకృతి సోయగాలతో కనువిందు చేస్తూ దర్శనమిస్తున్నాయి. ధర్మవరం పట్టణ సమీపంలోని చెరువు భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. చెరువు అందాలను తిలకించేందుకు పెద్దఎత్తున ప్రకృతి ప్రేమికులతో పాటు ధర్మవరం పట్టణ ప్రజలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతం సందడిగా మారి దర్శనమిస్తోంది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు కాపులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. గురువారం సాయంత్రం తాడేపల్లి కాపు కార్పొరేషన్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తారని అన్నారు. త్వరలో అన్ని జిల్లాల్లో కాపు భవనాల నిర్మాణాలు చేపట్టబోతున్నామన్నారు.
మహిళలకు దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం కానుంది. అర్హులైన వారికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. నాలుగు నెలలకు ఒక సిలిండర్ పంపిణీ చేస్తారు. ‘దీపం పథకం’ కింద ఈ దీపావళికి తొలి సిలిండర్ అందజేస్తారు. అర్హులను తెల్లరేషన్ కార్డుల ప్రాతిపదికన నిర్ణయిస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12,08,293 కుటుంబాలు లబ్ధిపొందుతాయి. మొత్తంగా జిల్లాలో 12,54,911 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.
మహిళలకు దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం కానుంది. అర్హులైన వారికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. నాలుగు నెలలకు ఒక సిలిండర్ పంపిణీ చేస్తారు. ‘దీపం పథకం’ కింద ఈ దీపావళికి తొలి సిలిండర్ అందజేస్తారు. అర్హులను తెల్లరేషన్ కార్డుల ప్రాతిపదికన నిర్ణయిస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12,08,293 కుటుంబాలు లబ్ధిపొందుతాయి. మొత్తంగా జిల్లాలో 12,54,911 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.
అనంతపురం జిల్లా యాడికిలో నిన్న దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆస్తి తగాదా విషయపై కన్న కొడుకే తండ్రిని హత మార్చినట్లు సీఐ ఈరన్న తెలిపారు. మండలంలోని ఈరన్నపల్లికి చెందిన మృతుడు లక్ష్మీనారాయణతో మొదటి భార్య కొడుకు కార్తీక్ గొడవ పెట్టుకుని కత్తితో పొడిచి, రాళ్లతో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. రెండవ భార్య రమాదేవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
రెండ్రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షానికి అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న రెండు రోజులు మళ్లీ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అనంతపురం జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ తెలిపారు. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జలాశయాల వద్దకు ఎవరూ వెళ్లొద్దని సూచించారు. హగరి, చిత్రావతి, పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహించే అవకాశం ఉందన్నారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూసేకరణకు సంబంధించి అన్ని పనులను సత్వరమే పూర్తి చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్హెచ్ 342, ఎన్హెచ్ 716జీ, జాతీయ రహదారులు, గ్రీన్ ఫీల్డ్ బెంగళూరు-కడప-విజయవాడకు సంబంధించిన పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.