Anantapur

News May 30, 2024

అనంత: ప్రిన్సిపల్‌కు జైలు శిక్ష

image

విశ్రాంత ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన ఓ ప్రిన్సిపల్‌కు కర్నూలు ఏసీబీ కోర్టు జైలు శిక్షతోపాటు బుధవారం జరిమానా విధించింది. అనంతపురం రేంజ్ ఏసీబీ డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపిన మేరకు హిందూపురం ప్రభుత్వ అందుల రెసిడెన్షియల్ పాఠశాలలో 2017లో రాజేశ్వర్ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. పెన్షనరీ బెనిఫిట్స్ బిల్లుల కోసం ప్రిన్సిపల్ రూ. 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

News May 30, 2024

వజ్రకరూరులో వజ్రాల వేట

image

అనంతపురం జిల్లాలో చినుకులు పడితే చాలు ప్రజలు వజ్రకరూరు చేలలోకి పరుగులు తీస్తున్నారు. పొలాల్లో దొరికే రాళ్లు, వజ్రాలని అవి వారి తలరాతలు మారుస్తాయని అంటుంటారు. ఏటా జూన్ నుంచి సెప్టెంబరు వరకు వేట సాగిస్తారు. స్థానికులతో పాటు కర్నూలు, కడప, గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు బళ్లారి నుంచి కూడా వస్తారు. అయితే ఈ ప్రాంతంలో ఏటా 40 నుంచి 50 వజ్రాలు దొరుకుతాయని స్థానికులు చెబుతున్నారు.

News May 30, 2024

శ్రీసత్యసాయి: ఎన్నికల కౌంటింగ్‌పై డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సమీక్ష

image

శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురం, లేపాక్షి మండలాల్లో జరగనున్న ఎన్నికల కౌంటింగ్ సన్నద్ధతపై సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ సత్యసాయి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్ఓ కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

News May 29, 2024

చెన్నై ఆసుపత్రిలో గుత్తి యువతి మృతి

image

గుత్తి పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన న్యాయవాది నగదాని రాజశేఖర్ కుమార్తె మాధురి(26) చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. కొన్ని రోజులుగా మాధురి అనారోగ్యంతో బాధపడుతుండేది. ఈ క్రమంలో కుటుంబసభ్యులు చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మాధురి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News May 29, 2024

చార్‌ధామ్ యాత్రలో అనంతపురం వాసి మృతి

image

అనంతపురానికి చెందిన హనుమంతకారి సురేశ్ రావు బుధవారం తెల్లవారుజామున గంగోత్రిలో అనారోగ్యంతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. 12 రోజులుగా ఆయన చార్‌ధామ్ యాత్రలో ఉన్నారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థకు గురి కావడంతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గంగోత్రిలోనే హనుమంతకారి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న కుటుంబీకులు తెలిపారు.

News May 29, 2024

నేషనల్ టీం బాస్కెట్ బాల్ శిక్షణకు అనంత కుర్రాడు

image

అనంతపురానికి చెందిన ద్వారకానాథ రెడ్డి ఇండోర్‌లో జూన్ 6 నుంచి జులై 6 వరకు జరిగే భారత జూనియర్ బాస్కెట్ బాల్ శిక్షణ శిబిరానికి ఎంపికయ్యాడు. ఈ శిబిరంలో మంచి ఆట తీరును ప్రదర్శిస్తే దక్షిణాసియా జూనియర్ బాస్కెట్ బాల్ పోటీలకు భారత జట్టుకు ఎంపిక చేస్తారు. ఇటీవల జరిగిన అండర్-18 జాతీయస్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను ఈ శిబిరానికి ఎంపిక చేసినట్లు జిల్లా బాస్కెట్ బాల్ కార్యదర్శి నరేంద్ర చౌదరి తెలిపారు.

News May 29, 2024

అనంత: జూన్ 2న తైక్వాండో జట్ల ఎంపికలు

image

అనంతపురంలోని రాంనగర్ చిన్నా బ్యాడ్మింటన్ అకాడమీలో జిల్లా తైక్వాండో సంఘం ఆధ్వర్యంలో జూన్ 2న ఉదయం 10 గంటలకు జిల్లా తైక్వాండో జట్లను ఎంపిక చేయనున్నట్లు ఆ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి కె. శాంతరాజ్ తెలిపారు. ఏపీ తైక్వాండో సంఘం నుంచి రెడ్వన్ బెల్ట్ గ్రేడింగ్ కలిగి 15-17 ఏళ్ల వయసున్న బాలబాలికలు పాల్గొనడానికి అర్హులన్నారు. ఎంపికైన వారు వచ్చే నెలలో విజయనగరంలో జరగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు.

News May 29, 2024

శింగనమల: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

image

శింగనమల మండలం ఉల్లికల్లుకి చెందిన రైతు బాలకృష్ణ(41) విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. రైతు పంట సాగు కోసం ఐదు లక్షల రూపాయలు అప్పు చేశాడు. సరైన దిగుబడులు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పు తీర్చే మార్గం లేక సోమవారం విషపు గుళికలు మింగాడు. మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 29, 2024

అనంతపురం: వేరుశనగ విత్తనాల కోసం 60,578 మంది దరఖాస్తు

image

జిల్లాలో ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వేరుశనగ విత్తనాల కోసం 60,578 మంది రైతులు 53,475 క్వింటాళ్ల విత్తనాల కోసం రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ తెలిపారు. కాగా ఇప్పటి వరకు 29 మండలాల్లో 38,419 మంది రైతులకు 33,895 క్వింటాళ్ల వేరుశనగ కాయలు పంపిణీ చేసినట్లు తెలిపారు.

News May 29, 2024

అనంత: పది ఫలితాల్లో ముందు 18.. రీ వెరిఫికేషన్‌లో 82 మార్కులు

image

10వ తరగతి మూల్యాంకనంలో జరిగిన తప్పిదాల వల్ల బత్తలపల్లి విద్యార్థి అంజికి ఇంగ్లిష్ సబ్జెక్టులో తొలుత 18 మార్కులు వచ్చాయి. రీ వెరిఫికేషన్‌లో 82 మార్కులు వచ్చాయి. ఈ తప్పిదాల వల్ల విద్యార్థులు మానసికంగా బాధ పడుతూ, అందరి చేత అవమానాలకు గురవుతున్నారని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.