Anantapur

News March 8, 2025

ల్యాండ్స్ సమస్యల పరిష్కారానికి చర్యలు: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లా స్థాయి డాటెడ్ ల్యాండ్స్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ వినోద్ నిర్వహించారు. నిషేధిత జాబితాలో ఉన్న డాటెడ్ ల్యాండ్స్‌ని తొలగించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వస్తున్న అర్జీలు, పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతివారం షెడ్యూల్ వేసుకుని జిల్లా స్థాయి డాటెడ్ ల్యాండ్స్ కమిటీ నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.

News March 8, 2025

10 రోజుల్లోపు చార్జిషీట్ వేయాలి: అనంత కలెక్టర్

image

ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించిన కేసులపై 10 రోజుల్లోపు చార్జిషీట్ వేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో సాధారణ ఎన్నికలు- 2024 అనంతరం జరిగిన హింసపై సంబంధిత అధికారులతో జిల్లా ఎస్పీ పి. జగదీశ్‌తో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల అనంతరం జరిగిన హింస చాలా సున్నితమైన అంశమన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

News March 7, 2025

షెడ్యూల్ కులాలకు సహాయం అందాలి: అనంతపురం కలెక్టర్

image

షెడ్యూల్ కులాలు, షెడ్యూలు తెగల వారికి ప్రభుత్వం నుంచి అందే సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందేలా చూడాలని, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో మినీ కాన్ఫరెన్స్ హాల్లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కాంపోనెంట్ కమిటీ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని సంబంధిత అధికారులతో నిర్వహించారు.

News March 7, 2025

అత్యాచార నిరోధక చట్టంపై అవగాహన: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల పరిరక్షణ/అత్యాచార నిరోధక చట్టం జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. గ్రామాలలో పలు అంశాలపై మహిళలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఎంపీ అంబికా లక్ష్మినారాయణ సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జగదీశ్ పాల్గొన్నారు.

News March 7, 2025

ఫ్రీ బస్.. ప్రజల భిన్నాభిప్రాయాలు

image

ATP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఫ్రీ జర్నీ జిల్లా వరకే పరిమితం.. మీ కామెంట్’ అంటూ వే2న్యూస్ అనంతపురం జిల్లాలో వార్త <<15677166>>పబ్లిష్<<>> చేయగా ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పారు. 41శాతం మంది దీనిని స్వాగతించారు. మరికొందరు ఈ పథకం వద్దని, బస్సు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. వృద్ధులు, కాలేజ్ పిల్లల వరకు పరిమితం చేయాలని కొందరు కామెంట్ చేశారు.

News March 7, 2025

అనంతపురంలో టన్ను చీనీ రూ.24,500

image

అనంతపురంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో చీనీ కాయల సంత ప్రారంభమైంది. గురువారం టన్ను చీనీ కాయలు గరిష్ఠంగా రూ.24,500 పలికాయి. మార్కెట్‌కు నిన్న 520 టన్నుల చీనీ కాయలు వచ్చాయి.
☞ ఇక కక్కలపల్లి మార్కెట్‌లో కిలో టమాటా రూ.8 పలికింది. కనిష్ఠంగా రూ.5 ప్రకారం విక్రయాలు సాగాయి. నిన్న మార్కెట్‌కు 270 టన్నుల సరకు వచ్చింది.

News March 7, 2025

అరకు కాఫీ స్టాల్‌ ఏర్పాటుకు ఎమ్మెల్యే వినతి

image

శింగనమల నియోజకవర్గం జంతులూరు గ్రామంలోని సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ప్రభుత్వం తరఫున అరకు కాఫీ స్టాల్‌ ఎమ్మెల్యే బండారు శ్రావణి మంత్రి సంధ్యారాణిని కోరారు. సచివాలయంలో ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే నియోజకవర్గంలోని ఎస్టీలకు సంబంధించిన పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అనంతరం మంత్రి గొట్టిపాటిని కలిసి నియోజకవర్గంలో విద్యుత్ లైన్ మ్యాన్‌ల కొరత లేకుండా చేయాలని కోరారు.

News March 7, 2025

నీటి తొట్టిలో పడి బాలుడి మృతి

image

ఓబులదేవరచెరువు మండలం వేమారెడ్డిపల్లికి చెందిన గంగరాజు కుమారుడు ద్వారకనాథ్ (4) గురువారం నీటి తొట్టిలో పడి మృతి చెందాడు. తాత, నానమ్మ పనిలో ఉండగా బాలుడు ఇంటి వెనకాల ఆడుకుంటూ పశువుల కోసం ఏర్పాటు చేసిన తొట్టిలో ప్రమాదవశాత్తు పడ్డాడు. వెంటనే గుర్తించిన స్థానికులు బాలుడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం కదిరి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది.

News March 7, 2025

నెమలి వాహనంపై విహరించిన చంద్రమౌళీశ్వరుడు

image

ఉరవకొండ గవిమఠం శ్రీ స్థిత చంద్రమౌళీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం రాత్రి నెమలి వాహనోత్సవం ఘనంగా జరిగింది. స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని నెమలి వాహనంపై ఉంచి చిన్న రథంపై ఎదురు బసవన్న గుడి వరకు ఊరేగించారు. అనంతరం యథాస్థానానికి చేర్చారు. అంతకుముందు చంద్రమౌళీశ్వరస్వామి వారి మూల విరాట్‌కు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

News March 6, 2025

భారతి హత్య కేసులో తండ్రి, మరొకరి అరెస్ట్

image

గుంతకల్లు మండల పరిధిలోని కసాపురంలో వద్ద జరిగిన పరువు హత్యలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి రామాంజనేయులు, బావ మారుతి కలిసి భారతి (21)ని హత్య చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆటోను సీజ్ చేశారు. అనంతరం ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కాగా కూతురు ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పడంతో తండ్రి దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే.