Anantapur

News May 28, 2024

29న గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి కౌన్సెలింగ్

image

అనంతపురం రూరల్ మండలంలోని కురుగుంట గురుకుల పాఠశాలలో ఈనెల 29న 5వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆ విద్యాలయాల సమన్వయకర్త మురళీకృష్ణ తెలిపారు. గతంలో రాసిన ప్రవేశ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేస్తామని చెప్పారు. బాలుర విభాగంలో 26, బాలికల విభాగంలో 12 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు.

News May 28, 2024

శ్రీ సత్యసాయి: SBI ఉద్యోగి అరెస్ట్

image

SBI కదిరి వ్యవసాయ శాఖ విభాగంలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వెంకట నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. ఆయన రూ.1.50 కోట్లకు పైగా నగదును ఇతర ఖాతాలకు మళ్లించి తాను వాడుకున్నట్లు ఉన్నతాధికారుల తనిఖీల్లో తేలింది. దీంతో SBI రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఈ ఏడాది మార్చిలో ఆయనపై పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు.

News May 28, 2024

అనంత: బీఫార్మసీ ఫలితాల విడుదల

image

బీఫార్మసీ మొదటి సంవత్సరం ఒకటి, రెండు సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు జేఎన్టీయూ పరీక్షల విభాగం అధికారులు కేశవ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఫలితాల కోసం జేఎన్టీయూ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.

News May 28, 2024

అనంతపురం జిల్లా సీనియర్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా గిరినాథ్ రెడ్డి

image

కడపలో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న సౌత్ జోన్ అంతర్ జిల్లా సీనియర్ వన్డే క్రికెట్ పోటీల్లో పాల్గొనే అనంతపురం జట్టుకు గిరినాథ్ రెడ్డిని కెప్టెన్‌గా నియమించారు. ఈయన రంజీ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 3 వరకు ఈ పోటీలు నిర్వహిస్తారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా కూడా పాల్గొంటుందని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి మధు ఆచారి తెలిపారు.

News May 28, 2024

ఎస్కేయూలో రెండు నూతన కోర్సులు

image

శ్రీ కృష్ణదేవరాయ విశ్వ విద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలకు నూతనంగా రెండు కోర్సులు మంజూరైనట్లు వైస్ ఛాన్సలర్ హుసేన్ రెడ్డి తెలిపారు. కంప్యూటర్ సైన్స్‌కు అనుబంధంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్ మిషిన్ లర్నింగ్, కంప్యూటర్ సైన్సు డేటా కోర్సులకు ఏఐసీటీఈ అనుమతించిందని తెలిపారు. ఒక్కొక్క కోర్సుకు 60 సీట్లు ఉన్నట్లు తెలిపారు.

News May 28, 2024

ఉమ్మడి అనంత జిల్లాలో రానున్న 5 రోజుల పాటు వర్షాలు

image

నైరుతి రుతుపవనాల రాక నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వచ్చే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. ఐదు రోజుల్లో రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం మీదుగా లక్షద్వీప్, కేరళ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయని చెప్పారు. ఈ ప్రభావంతో జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.

News May 28, 2024

సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు: సత్యసాయి కలెక్టర్

image

జూన్ 4వ తేదీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం సమీపాన గల బిట్ కళాశాల, లేపాక్షి మండలంలోని చోళ సముద్రం వద్ద కల అంబేద్కర్ పాఠశాలలో జరుగు ఓట్ల లెక్కింపు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుందని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఈవీఎంల లెక్కింపు కొరకు మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేశామని, ఓట్ల లెక్కింపు గదులలో సీసీ కెమెరా, వీడియోగ్రఫీ నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు.

News May 27, 2024

వెల్డింగ్ పని చేస్తూ విద్యుత్ షాక్‌‌తో వ్యక్తి మృతి

image

వెల్డింగ్ పని చేస్తూ విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతిచెందిన ఘటన కనేకల్లు మండలంలోని ఆదిగానిపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బడిగే శ్రీనివాసులు (55) సోమవారం మధ్యాహ్నం వ్యవసాయం పనిముట్లు వెల్డింగ్ పనిచేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.

News May 27, 2024

రేపు పెన్నఅహోబిలం మహా రథోత్సవం.. స్పెషల్ స్టోరీ

image

14,15 శాతబ్దాల్లో విజయనగర రాజులు పెన్నఅహోబిలం ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ స్వామివారి పాదం కింద ఓ బిలం ఉంది. అభిషేకం చేసిన నీళ్లు ఈ బిలం గుండా వెళ్లి పెన్నా నదిలో కలుస్తాయి. అందువల్లనే ఈ క్షేత్రానికి పెన్నఅహోబిలం అనే పేరు వచ్చింది. ద్వాపరయుగంలో ఉద్ధాలక మహర్షి ఘోర తపస్సు చేయగా స్వామి ప్రసన్నుడై తన కుడి పాదం పెన్నఅహోబిలంపై ఎడమ కాలు అహోబిలంపై మోపినట్లు ఇక్కడి శాసనాలు, పురాణాలను బట్టి తెలుస్తోంది.

News May 27, 2024

ఫైర్ క్రాకర్ల తయారీ, అమ్మకం, కొనుగోలుపై నిషేధం: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలో ఫైర్ క్రాకర్ల తయారీ, అమ్మకం, కొనుగోలు, వినియోగం, రవాణాపై నిషేధం విధించినట్టు సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతల పరిరక్షణ శరీరంలో భాగంగా జూన్ 5వ తేదీ వరకు ఎక్కడ తయారీ, అమ్మకాలు, రవాణా జరగకూడదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.