India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్ఛార్జులతో నేడు సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉ.11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. మద్యం, ఇసుక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు సీఎం స్పష్టం చేయనున్నారు. అలాగే జిల్లాలో పార్టీ బలోపేతంపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశం కోసం ఇప్పటికే నేతలు విజయవాడ చేరుకున్నారు.
కర్ణాటక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షానికి చిత్రావతి నదిలో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని పరగోడు డ్యాం దాదాపు 80 శాతం నిండినట్లు తెలిసిందని అన్నారు. ఎగువ నుంచి వచ్చే వరదకు చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహించే అవకాశం ఉందని, ప్రజలెవరూ ఇసుక కోసం నదీ పరివాహక ప్రాంతానికి వెళ్లొద్దని సూచించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో మూడ్రోజుల నుంచి జోరు వానలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు లేపాక్షి మండలం మామిడిమాకుల పల్లి గ్రామంలో హరిజన నారాయణప్పకు చెందిన ఇల్లు కూలింది. ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుండటంతో పాత ఇంటి పైకప్పు నాని కుప్ప కూలిందని బాధితుడు తెలిపారు. అలాగే గుత్తి చెర్లోపల్లి కాలనీలో రహమత్ బీ అనే మహిళ ఇల్లు పైకప్పు నేలకూలింది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా బీసీ రక్షణ చట్టం రూపొందిస్తున్నట్లు మంత్రి సవిత స్పష్టం చేశారు. బుధవారం అమరావతిలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ చట్టం రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు రక్షణ కవచంలాంటిదన్నారు. సీఎం చంద్రబాబు గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి బీసీ డిక్లరేషన్లో పేర్కొన్న అంశాలను అమలు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు.
అనంతపురంలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతోత్సవాలలో భాగంగా గుత్తి రోడ్ లో ఉన్న బల్లా కన్వెన్షన్ హాల్లో గురువారం జరగబోయే రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతోత్సవం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. అనంతరం పాతవూరు పవర్ ఆఫీస్ వద్ద ఉన్న వాల్మీకి విగ్రహం వద్ద ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.
పుట్టపర్తి పట్టణ విద్యుత్ శాఖ అధికారులపై ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పుట్టపర్తిలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు. విద్యుత్ స్తంభానికి తీగలు వేలాడుతూ వ్యక్తి ప్రమాదానికి గురి కాగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంబంధిత శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో కనీస జాగ్రత్తలు పాటించరా అంటూ ఫైర్ అయ్యారు.
అల్పపీడన ప్రభావంతో అనంతపురం జిల్లాలో వర్షం పడుతోంది. నిన్నటి నుంచి కదిరి, రోళ్ల, ధర్మవరం, బుక్కపట్నం తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. మరోవైపు నేడు, రేపు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కేంద్రాల్లో <<14360726>>కంట్రోల్ రూమ్స్<<>> ఏర్పాటు చేశారు.
15 సంవత్సరాలు నిండిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. వయోజన విద్య అభివృద్ధిపై కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో మంగళవారం రాత్రి గూగుల్ మీట్ విధానం ద్వారా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.
శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పరిశీలించారు. అల్పపీడన పరిస్థితుల సమాచారాన్ని తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన టీవీ ద్వారా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం తెలపాలని కంట్రోల్ రూమ్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచించారు. విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలోని పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్ష సూచనతో విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తోంది. జిల్లా ప్రజల ఫోన్లకు APSDMA అలర్ట్ మెసేజ్లు పంపుతోంది. మరోవైపు జిల్లా అధికారులు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.