India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని అమరాపురం మండలంలో అధిక వర్షపాతం నమోదైనట్టు జిల్లా అధికారులు పేర్కొన్నారు. అమరాపురం మండలంలో ఆదివారం రాత్రి 75.8 మిల్లీమీటర్లు, కనగానపల్లి లో 74.8, రామగిరి లో 36.4, గుడిబండలో 21.6, లేపాక్షిలో 19.2, ఆగలి మండలంలో 18.6 మిల్లీమీటర్ల పొందుతున్న జిల్లాలోని 18 మండలాల్లో 389.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది అన్నారు.
ఈ నెల 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ సప్లమెంటరీ థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీవీఈవో రఘునాథరెడ్డి తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ అధికారిక వెబ్సైట్ లాగిన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
అనంతపురం జిల్లా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు తత్కాల్ కింద చెల్లించేందుకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుందని ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వెంకటరమణనాయక్ తెలిపారు. పరీక్ష ఫీజుతో పాటు తత్కాల్ కింద రూ. 3 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని, ఆయా ప్రిన్సిపల్ ను కలిసి ఫీజు చెల్లించాలని సూచించారు.
అనంతపురంలో ఈనెల 24 న ఉపాధ్యాయ విద్య ప్రవేశ పరీక్ష, (డీసెట్ ) నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మీ తెలిపారు. పట్టణంలోని ఎన్సీపీఎస్ఐ కేంద్రంలో పరీక్ష జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు అందరూ కూడా విషయాన్ని గమనించాలని కోరారు.
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో విషాదం అలుముకుంది. ఆదివారం ఇందిరమ్మ కాలనీకి చెందిన ఇమామ్ బాషా (12) స్నేహితులలో కలిసి చిక్కవదియర్ చెరువులో ఈతకు వెళ్లి… ప్రమాదవ శాత్తు నీటి గుంటలో పడి మునిగిపోయాడు. పక్కనున్న పిల్లలు చుట్టుపక్కల వారికి సమాచారం అందించగా..వారు గాలించి బయటకు తీసి మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం పెట్రోల్ బంక్ యజమానులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బాటిళ్లలో పెట్రోలు వేయకూడదని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ను వాహనాలకు మాత్రమే సరఫరా చెయ్యలన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు నిబంధనలు అమలులో వుంటాయన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు.
అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం పెట్రోల్ బంక్ యజమానులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బాటిళ్లలో పెట్రోలు వేయకూడదని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ను వాహనాలకు మాత్రమే సరఫరా చెయ్యలన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు నిబంధనలు అమలులో వుంటాయన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు.
అనంతపురంలో నివాసముంటున్న ఉపాధ్యాయుడు పూల రాంప్రసాద్, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె పూల దివ్యతేజ తెలంగాణ ఈఏపీసెట్ అగ్రికల్చర్ విభాగంలో పదో ర్యాంకు సాధించింది. గుండె వైద్యురాలు కావాలన్నదే తన లక్ష్యమని దివ్యతేజ తెలిపింది. ఆమె విజయవాడలో చదువుకుంది. పదో తరగతిలో 587, ఇంటర్లో 984 మార్కులు సాధించింది.
అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి శాలిని నియమించిన విషయం తెలిసిందే. ఆమె ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతం పెద్దకన్నలి గ్రామానికి చెందిన ఈమె.. ఇంజినీరింగ్ పూర్తి చేశారు. చెన్నైలోని కాగ్నిజెంట్ కంపెనీలో ఉద్యోగం చేశారు. అదే సమయంలోనే యూపీఎస్సీకి ప్రయత్నించి 2015లో ఐపీఎస్కు ఎంపికయ్యారు. ఈమె కర్నూలు అదనపు ఎస్పీగా, అనకాపల్లి ఎస్పీగా పనిచేశారు.
హీరో శ్రీకాంత్ ఆదివారం అనంతపురం నగర పర్యటన వాయిదా పడింది. నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ప్రైవేట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించాల్సి ఉంది. అయితే ఎన్నికల నియమావళి, 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసుల అనుమతి లభించలేదు. ఈ కారణంగా శ్రీకాంత్ పర్యటన వాయిదా పడినట్లు ఆయన అనుచరులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.