Anantapur

News May 15, 2024

అనంత: తల్లిని సుత్తితో కొట్టి చంపిన కొడుకు

image

కంబదూరు మండలం వైసీ పల్లి గ్రామంలో మంగళవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి సుంకమ్మను కొడుకు వెంకటేశులు సుత్తితో కొట్టి చంపాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని సుంకమ్మ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడానికి చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 15, 2024

తాడిపత్రిలో యుద్ధ వాతావరణం.. భారీగా పోలీసు బలగాల మోహరింపు..!

image

తాడిపత్రిలో నిన్న 8 గంటల పాటు యుద్ధ వాతావరణం తలపించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి అనుచరులు రాళ్లతో దాడులు చేసుకున్నారు. విషయం తెలిసి పట్టణంలో డీఐజీ షిమోషీ వాజ్ పాయ్ పర్యటించారు. ఘర్షణలకు దారి తీసిన పరిస్థితులపై ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల కోసం మరిన్ని పోలీసు బలగాలను రప్పించారు. డీఐజీతో పాటు కర్నూలు డీఐజీ, ఎస్పీ, కడప, అన్నమయ్య, జిల్లాల ఎస్పీలు తాడిపత్రికి చేరుకున్నారు.

News May 14, 2024

తాడిపత్రిలో అదుపులోకి వచ్చిన పరిస్థితి

image

రాళ్లదాడితో అట్టుడికిన తాడిపత్రి పట్టణంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది.. తాడిపత్రిలో దాదాపు 5 గంటలపాటు ఘర్షణ కొనసాగింది. అయితే ఈ ఘర్షణలో పోలీసు అధికారులతో పాటు పలువురు కార్యకర్తలు, నాయకులు సైతం గాయపడ్డారు. ప్రస్తుతం జూనియర్ కళాశాల మైదానం, జేసీ నివాసం, ఎమ్మెల్యే పెద్దారెడ్డి నివాసాల ప్రాంతాలలో కేంద్ర బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులు, పోలీసులు పహారా కాస్తున్నాయి.

News May 14, 2024

అనంత: బండల ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి

image

వజ్రకరూర్ మండలం తట్రకల్లు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ టైర్ పంక్చర్ కావడంతో బోల్తా పడి ఉరవకొండ మండలం చిన్న ముష్టురు గ్రామానికి చెందిన సురేశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఉరవకొండ నుంచి గుంతకల్లుకు బండల లోడును ట్రాక్టర్‌లో వేసుకొని వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 14, 2024

తాడిపత్రి MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్

image

తాడిపత్రిలో జరుగుతున్న టీడీపీ-వైసీపీ దాడుల నేపథ్యంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు కేవలం గన్‌మెన్‌లను మాత్రమే అనుమతించినట్లు సమాచారం. పెద్దారెడ్డిని ఎక్కడికి తీసుకెళ్లారన్న సమాచారం పోలీసులు వెల్లడించలేదు.

News May 14, 2024

శ్రీ సత్యసాయి: అర్ధరాత్రి ఇరువర్గాల దాడి.. టీడీపీ కార్యకర్త మృతి

image

పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని యనమలపల్లిలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘర్షణలో వ్యక్తి మృతి చెందాడు. ఎరికల గురుమూర్తి అనే టీడీపీ కార్యకర్తపై సమీప బంధువులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గురుమూర్తిని చికిత్స నిమిత్తం అనంతపురం తీసుకెళ్లగా అక్కడ మృతిచెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పుట్టపర్తి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 14, 2024

శ్రీ సత్యసాయి: చెరువులో గుర్తుతెలియని మృతదేహం

image

లేపాక్షి మండలం మానేపల్లిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ గోపీ తెలిపారు. దాదాపు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి పడేశారని పేర్కొన్నారు. ఎక్కడో హత్యచేసి ఇక్కడ పడేశారా? లేక ఇక్కడే హత్య చేశారా? అనే కోణంలో విచారిస్తున్నామని చెప్పారు. హత్యచేసి దాదాపు పది రోజులై ఉంటుందని, మృతదేహం బాగా కుళ్లిపోయిందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

News May 14, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో 79.25 శాతం పోలింగ్

image

శ్రీ సత్యసాయి జిల్లాలో దాదాపు రాత్రి 11.30 గంటల వరకు పోలింగ్ జరిగింది. జిల్లాలో అత్యధికంగా ధర్మవరం నియోజకవర్గంలో 88.61 శాతం, హిందూపురం నియోజకవర్గంలో 77.82 శాతం నమోదైంది. కదిరి 81.37, మడకశిర 79.20, పెనుకొండ 85.40, పుట్టపర్తి నియోజకవర్గంలో 84.11 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కొన్నిచోట్ల పోలింగ్ ఆలస్యమైన నేపథ్యంలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

News May 14, 2024

అనంత జిల్లాలో 79.25 శాతం నమోదు..

image

అనంతపురం జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో అత్యధికంగా ఉరవకొండ నియోజకవర్గంలో 87.67శాతం, అనంతపురం అర్బన్‌లో 65.08 శాతం నమోదైంది. గుంతకల్లు 76.84, కళ్యాణదుర్గం 84.48, రాప్తాడు 84.50, రాయదుర్గం 78.98, శింగనమల 81.21, తాడిపత్రి 80.60 శాతం నమోదైంది. కొన్నిచోట్ల పోలింగ్ ఆలస్యమైన నేపథ్యంలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

News May 13, 2024

స్ట్రాంగ్ రూములకు ఈవీఎంలు చేరేవరకు సమర్థవంతంగా పనిచేయాలి: కలెక్టర్

image

అనంతపురంలోని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు ఈవీఎంలు చేరేవరకు అధికారులంతా సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్. వి ఆదేశించారు. సోమవారం రాత్రి నగరంలోని జేఎన్టీయూలో అనంతపురం అర్బన్, శింగనమల, రాప్తాడు, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాలకు సంబంధించి ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు.