India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురంలోని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు ఈవీఎంలు చేరేవరకు అధికారులంతా సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్. వి ఆదేశించారు. సోమవారం రాత్రి నగరంలోని జేఎన్టీయూలో అనంతపురం అర్బన్, శింగనమల, రాప్తాడు, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాలకు సంబంధించి ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
అనంతపురం జిల్లాలో 9 గంటల సమయానికి పలుచోట్ల పోలింగ్ ముగియగా మరో పలుచోట్ల ఓటింగ్ కొనసాగుతోంది. పలుచోట్ల పోలింగ్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఓటింగ్ శాతం నియోజకవర్గాల వారిగా చూసుకుంటే రాయదుర్గం 77.6%, ఉరవకొండ 80.4%, గుంతకల్లు 71.56%, తాడిపత్రి 77.58%, శింగనమల 80.13%, అనంతపురం 64.5%, కళ్యాణదుర్గం 79.4%, రాప్తాడు 81.41 శాతంగా నమోదు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ తెలిపారు.
ఓబులదేవరచెరువు మండలంలోని కుసుమ వారి పల్లిలో డీలర్ ఇంద్రప్పపై కత్తితో దాడి జరిగింది. సోమవారం గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీకి చెందిన డీలర్ ఇంద్రప్పపై ఈశ్వరయ్య అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల కారణంగా దాడి జరిగినట్టు సమాచారం.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాల్లోని ఆయా పోలింగ్ కేంద్రాలకు అధికారులు ఏపీఎస్ఆర్టీసీ బస్సులను వినియోగించారు. దీంతో సాధారణ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉరవకొండ నుంచి అనంతపురం, బళ్లారి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అనంతపురం రైల్వేస్టేషన్లోని ప్లాట్ఫాం నం-4లో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు స్టేషన్ మేనేజర్ మాసినేని అశోక్ కుమార్ ప్రకటనలో తెలిపారు. శ్రీనివాసనగర్ వైపు నూతన భవన నిర్మాణాన్ని చేపట్టారు. నాలుగో నంబరు ప్లాట్ఫాం షెడ్డు ఏర్పాటు చేయనున్నారు. డిస్ప్లే బోర్డులు, ఫ్యాను ఇతర సౌకర్యాలను తొలగించారు. కొంతకాలం పాటు ఇందులో నడవాల్సిన రైళ్లను రద్దు చేశారు.
అనంతపురం జిల్లాలో మాక్ పోలింగ్ మొదలైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలింగ్ సమయానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ఏజెంట్లు రాకపోవడంతో మాక్ పోలింగ్ ఆలస్యమైంది. ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా ఏర్పాట్లు సిద్ధం చేశామని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలపై నిరంతరం కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ ఉంటుదన్నారు.
రాయదుర్గం పట్టణంలో ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. మరో మూడు రోజుల పాటు ఇలాంటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు సూచిస్తున్నారు.
ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆదివారం అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అత్యధిక ఓటింగ్ శాతం సాధించడానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే కలెక్టర్ పోలింగ్, ఎన్నికల సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ధర్మవరం వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై ధర్మవరం ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్పై విమర్శలు చేసినందుకుగాను మున్సిపల్ కమిషనర్ టి.రాంకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. MCC నిబంధనలను అతిక్రమించినందుకు గాను కేసు నమోదు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.