India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచార పర్వం మరొ కొన్ని గంటల్లో ముగియనుంది. ఇన్నిరోజులు పార్టీల అభ్యర్థుల విమర్శలు, ఆరోపణలు, హామీలు నడుమ ప్రచార హోరు కొనసాగింది. అభ్యర్థుల తరఫున సినీ ప్రముఖులు, స్టార్ క్యాంపెయినర్ల రాకతో ఉమ్మడి అనంతపురం జిల్లా నిత్యం వార్తల్లో నిలిచింది. రేపు సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియనుంది. దీంతో కొన్ని చోట్ల డబ్బులతో ఓటర్లను ప్రభాలకు తెరలేసింది.
అనంతపురం జేఎన్టీయూ పరిధిలో నిర్వహించిన బీటెక్ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్, బీ ఫార్మసీ రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల విభాగం అధికారులు ఆచార్య కేశవరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. బీటెక్లో 14,263 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 13,344 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. బీ ఫార్మసీలో 2,492 మందికి గానూ 1,958 మంది పాసయ్యారని వెల్లడించారు.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా 101.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా ఉరవకొండలో 23.6 మి.మీటర్లు, యాడికి 18.4, రాయదుర్గం 16.2, విడపనకల్లు 15.2, బెలుగుప్ప 13.6, కళ్యాణదుర్గం 11.6, గుమ్మగట్ట 4.8, కంబదూరు 4.6, కనేకల్ 2.0, పెద్దపప్పూరు 1.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అనంతపురం రూరల్ మండలంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రంలో డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు గురువారం ఉపకులపతి హుస్సేన్ రెడ్డి విడుదల చేశారు. బీఏలో 159 మందికి గాను 104 మంది ఉత్తీర్ణులయ్యారు. బీకాంలో 22 మందికి గాను 13 మంది, బీబీఏ, బీకాం కంప్యూటర్స్లో 150 మందికి గాను 98 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
అనంత జిల్లా కంబదూరు మండలంలోని కదిరిదేవరపల్లిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అచ్చంపల్లికి చెందిన వాలంటీర్ ఉప్పర తిమ్మరాజు(26) మృతిచెందాడు. కళ్యాణదుర్గంలో గురువారం జరిగిన సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభకు వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన టాటా సుమో ఢీకొంది. ప్రమాదంలో తిమ్మరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్నికల నేపథ్యంలో అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 12, 13వ తేదీల్లో నిర్వహించే సంతలు బంద్ చేస్తున్నట్లు యార్డు అధికారి జయలక్ష్మి తెలిపారు. ఈ నెల 12న ఆదివారం పశువుల సంత, 13న చీనీ సంతలు నిర్వహించడం లేదని వెల్లడించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులు, రైతులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
మే 12, 13వ తేదీల్లో పత్రిక ప్రకటనలపై అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాలని సత్యసాయి జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. పోలింగ్కు ముందు రోజు పత్రికలలో వేసే ప్రకటనలకు పోటీచేసే అభ్యర్థులు రెండు రోజులు ముందుగా ఎంసీఎంసీ ధ్రువీకరణ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. అలాగే పత్రిక యాజమాన్యాలు కూడా ఎంసీఎంసీ ధ్రువీకరణ ముందస్తు అనుమతి లేకుండా రాజకీయ పార్టీల ప్రకటనలు ప్రచురించరాదన్నారు.
సీఎం జగన్ కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకున్నారు. కళ్యాణదుర్గం సిద్ధమా? అని ప్రజలను పలకరించగానే కార్యకర్తలు కేరింతలు కొట్టారు. ‘మధ్యాహ్నం 2 గంటలు కావొస్తోంది. ఎండలు చూస్తే తీవ్రంగా ఉన్నాయి. అయినా ఏ ఒక్కరూ ఖాతరు చేయలేదు. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలను పంచిపెడుతున్న ప్రతి అక్కచెల్లెమ్మకు, నా ప్రతి సోదరుడికి రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతున్నా’అని జగన్ అన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా అగళి మండలంలోని అల్లూడిలో గురువారం విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. కందపల్లి గ్రామానికి చెందిన శీనప్ప విద్యుత్ మరమ్మతులు చేయడానికి స్తంభం ఎక్కగా షాక్కు గురయ్యాడు. లైన్మెన్ ఆపరేటర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కళ్యాణదుర్గం రానున్నారు. ముందుగా కర్నూలులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం ఒంటి గంటకు కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సభాస్థలికి చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం రాజంపేట బయలుదేరి వెళ్తారు.
Sorry, no posts matched your criteria.