Anantapur

News November 3, 2024

సత్యసాయిబాబా 99వ జయంతి స్పెషల్

image

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి బాబా 99వ జయంతి వేడుకలు ఈనెల 23న ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ప్రశాంతి నిలయంలో సత్యసాయి సెంటర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్ జె రత్నాకర్‌తో పాటు, ట్రస్ట్ సభ్యులు 99వ జన్మదినం పురస్కరించుకొని స్తూపం ఆవిష్కరించారు. ఈ ఏడాది నిర్వహించే జయంతి వేడుకలకు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున సత్యసాయి భక్తులు వస్తున్నట్లు వారు తెలిపారు.

News November 3, 2024

నేడు అనంతపురం రానున్న హీరో శ్రీకాంత్

image

అనంతపురం నగరంలో ఆదివారం సినీ నటుడు హీరో శ్రీకాంత్ సందడి చేయనున్నారు. నేటి సాయంత్రం 5:30 గంటలకు స్థానిక నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. హీరో శ్రీకాంత్ వస్తుండటంతో అభిమానులు ఇప్పటికే అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుంటూ సందడి చేస్తున్నారు. నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

News November 3, 2024

గోరంట్ల మాధవ్‌పై కేసు నమోదు

image

హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై కేసు నమోదైంది. అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించిన ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రసారం చేసిన సాక్షి మీడియాపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో మాధవ్, సాక్షి మీడియాపై పోక్సో చట్టంలోని సెక్షన్ 23, BNSలోని 72, 79 సెక్షన్ల కింద విజయవాడ సైబర్ క్రైం పీఎస్‌లో కేసు నమోదైంది.

News November 3, 2024

ఉరవకొండ: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

image

ఉరవకొండ పట్టణ శివారులోని 42వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ట్రాక్టర్‌ను బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతిచెందిన యువకుడు పట్టణానికి చెందిన అంజిగా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.

News November 3, 2024

ప్రగతికి సంబంధించిన నివేదికలను సిద్ధం చేసుకోవాలి:

image

ఐదు నెలల కాలంలో జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి సాధించిన ప్రగతికి సంబంధించిన నివేదికలు సిద్ధం చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 4వ తేదీ రాష్ట్ర రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి సత్య ప్రసాద్ జిల్లా అభివృద్ధి సమావేశంలో పాల్గొంటారని కలెక్టర్ పేర్కొన్నారు.

News November 3, 2024

ఉరవకొండ: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

image

ఉరవకొండ పట్టణ శివారులోని 42వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ట్రాక్టర్‌ను బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతిచెందిన యువకుడు పట్టణానికి చెందిన అంజిగా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.

News November 2, 2024

రాష్ట్రస్థాయికి తాడిపత్రి విద్యార్థి అబ్బాస్ ఎంపిక

image

అనంతపురం జిల్లాస్థాయిలో జరిగిన సాఫ్ట్ బాల్ క్రీడా పోటీల్లో తాడిపత్రి విద్యార్థి అబ్బాస్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జరిగిన పోటీల్లో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 9న గుంటూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పీఈటీ చంద్ర తెలిపారు. విద్యార్థి అబ్బాస్‌ను హెచ్ఎం ప్రసాద్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

News November 2, 2024

పింఛన్ పంపిణీ.. అనంత 96.68, సత్యసాయి జిల్లాలో 94.63 శాతం పూర్తి

image

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పింఛన్ పంపిణీ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 8 గంటలకు అనంతపురం జిల్లాలో 96.68, సత్యసాయి జిల్లాలో 94.63 శాతం పంపిణీ పూర్తయింది. అనంత జిల్లాలో 2,82,554 మందికి గానూ 2,73,185 మందికి, సత్యసాయి జిల్లాలో 2,66,137 మందికి గానూ 2,51,848 మందికి పింఛన్ సొమ్ము అందింది. నిన్న సర్వర్ ప్రాబ్లంతో పంపిణీలో కొంత జాప్యం జరిగింది.

News November 2, 2024

పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలి: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూ సేకరణకు సంబంధించి అన్ని పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో ఎన్‌హెచ్ 342, 716జీ, జాతీయ రహదారులు, గ్రీన్ ఫీల్డ్ బెంగళూరు- కడప- విజయవాడకు సంబంధించిన పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారులకు సేకరించిన భూమి వివరాలను తెలుసుకున్నారు.

News November 1, 2024

ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

image

శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవరచెరువు మండలం కొండకమర్లలో మెహెతాజ్ (36) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. ఆమెకు కొంతకాలంగా ఇర్ఫాన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఆ మహిళ మరో వ్యక్తితో కూడా చనువుగా ఉందని అనుమానించిన ఇర్ఫాన్ రాత్రి ఆమెను హత్య చేశాడు. తానే చంపినట్లు శుక్రవారం పోలీసుల వద్ద వాంగ్మూలం ఇచ్చి లొంగిపోయాడు. ఓబులదేవరచెరువు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.