India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై అనంతపురం కలెక్టరేట్లో కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ప్రత్యేక పరిశీలకులు రామ్ మోహన్ మిశ్రా, అమిత్ కుమార్ సింగ్, అజయ నాథ్, పోలీసు పరిశీలకులు రవికుమార్ హాజరయ్యారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వహించాలన్నారు.
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గులపాళ్యం గ్రామ సమీపంలోని నీటి గుంతలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
రొళ్ల మండలంలోని పిల్లిగుండ్ల చెక్ పోస్ట్లో డ్యూటీల విషయంలో గొడవ పడిన కానిస్టేబుల్స్ శివ, నారాయణస్వామిని వీఆర్కు పంపుతూ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజుల క్రితం కానిస్టేబుల్స్ డ్యూటీలో విషయంలో గొడవపడి విషయం బహిర్గతం కావడంతో వారిని వీఆర్కు పంపారు. సంఘటనపై విచారణ అనంతరం పోలీస్ శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.
ఈనెల 9న సీఎం జగన్ కళ్యాణదుర్గానికి రానున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య తెలిపారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం కళ్యాణదుర్గంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని వెల్లడించారు. కావున నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
టీడీపీ రాష్ట్ర కమిటీలో అనంతపురం జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం కల్పిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం అర్బన్ నియోజక వర్గం నుంచి రాష్ట్ర కార్యదర్శిగా రాయల్ మురళీ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కొండవీటి భావన, కళ్యాణదుర్గం నుంచి తెలుగు యువత కార్యదర్శిగా అనిల్ చౌదరికి అవకాశం కల్పించారు.
అనంతపురం జిల్లాలో ఓ పౌరుడు ‘ఇచ్చట ఓట్లు అమ్మబడవు అంటూ’ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన స్టిక్కర్ వైరల్ అవుతోంది. గుత్తి పట్టణానికి చెందిన ఇస్మాయిల్ అనే వ్యక్తి తన ఇంటి వద్ద ఇచ్చట ఓట్లు అమ్మబడవు అంటూ స్టిక్కర్స్ అందరినీ ఆకర్షిస్తోంది.
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డుకు చెందిన నళిని అనే మహిళా వాలంటీర్పై సోమవారం కొందరు దాడి చేశారు. ఐదుగురు వ్యక్తులు నళిని ఇంటి వద్దకు వచ్చి దాడి చేశారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనంతపురం అర్బన్ నూతన డీఎస్పీగా టి.వి.వి ప్రతాప్ కుమార్ను నియమిస్తూ ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం సాయంత్రం 8 గంటల లోపు అనంతపురంలో విధుల్లో చేరాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన డీఎస్పీ వీరరాఘవరెడ్డిపై ఫిర్యాదులు రావడంతో ఎన్నికల కమిషనర్ బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటువేసింది. ఆయనను తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. అమ్మిరెడ్డికి ఎలాంటి ఎన్నికలు విధులు అప్పగించొద్దని ఈసీ ఆదేశించింది.
అనంతపురంలో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఇంటర్మీడియట్లో ప్రవేశానికి నిర్వహించే ఆర్డీటీ సెట్ ప్రవేశ పరీక్షకు 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మోహన్మురళీ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 500 పైన మార్కులు సాధించిన విద్యార్థులు ఆర్డీటీ సెట్ పరీక్షకు అర్హులన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆర్డీటీ ఫీల్డ్ ఆఫీసుల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.