Anantapur

News September 27, 2024

అనంతపురం జిల్లాలో మరో దారుణం.. చిన్నారిపై అఘాయిత్యం

image

అనంతపురం జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. పుట్లూరు మండలం శనగలగూడూరులో 10 ఏళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు తిరుపాలు అఘాయిత్యానికి యత్నించాడు. దీంతో తిరుపాలుకు గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News September 27, 2024

జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేయాలి: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో 50వ జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనలకు అవసరమైన ప్రోత్సాహం అందించాలని కలెక్టర్ సూచించారు.

News September 27, 2024

మీ ఫేవరెట్ పర్యాటక ప్లేస్ ఏది?

image

అనంతపురం జిల్లా పర్యాటకులకు స్వర్గధామం. ఎన్నో దర్శనీయ స్థలాలు మన జిల్లాలో ఉన్నాయి. పెన్న అహోబిలం, లేపాక్షి, పెనుకొండ కోట, తిమ్మమ్మ మర్రిమాను, గుత్తి కోట, పుట్టపర్తి, ఆలూరు కోన, కసాపురం, జంబు ద్విపా, యోగి వేమన సమాధి, కదిరి నరసింహ స్వామి ఆలయం ఇలా ఎన్నో మధురానుభూతులు పంచే పర్యాటక ప్రాంతాలు మన జిల్లా సొంతం. మరి జిల్లాలో మీకు ఇష్టమైన స్పాట్ ఏంటో కామెంట్ చెయ్యండి..
#World Tourism Day

News September 27, 2024

మీ ఫేవరెట్ పర్యాటక ప్లేస్ ఏది?

image

అనంతపురం జిల్లా పర్యాటకులకు స్వర్గధామం. ఎన్నో దర్శనీయ స్థలాలు మన జిల్లాలో ఉన్నాయి. పెన్న అహోబిలం, లేపాక్షి, పెనుకొండ కోట, తిమ్మమ్మ మర్రిమాను, గుత్తి కోట, పుట్టపర్తి, ఆలూరు కోన, కసాపురం, జంబు ద్విపా, యోగి వేమన సమాధి, కదిరి నరసింహ స్వామి ఆలయం ఇలా ఎన్నో మధురానుభూతులు పంచే పర్యాటక ప్రాంతాలు మన జిల్లా సొంతం. మరి జిల్లాలో మీకు ఇష్టమైన స్పాట్ ఏంటో కామెంట్ చెయ్యండి..
#World Tourism Day

News September 27, 2024

ATP: దారుణం.. చెల్లిపై అన్న అత్యాచారం

image

చెల్లెలిపై అన్న అత్యాచారానికి పాల్పడిన ఘటన పెద్దపప్పూరు మండలంలో జరిగింది. ఓ గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు మృతి చెందారు. అప్పటి నుంచి ఆ బాలిక ఆలనాపాలన పెదనాన్న కుమారుడు రామాంజనేయులు చూసుకుంటున్నాడు. పాఠశాలకు తీసుకెళ్లడం, తీసుకురావడం చేస్తుండేవాడు. ఈ క్రమంలో బాలికపై అత్యాచారానికి పాల్పడగా విషయం ఉపాధ్యాయులకు తెలిసింది. వారి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై గౌస్ బాషా తెలిపారు.

News September 27, 2024

అనంతపురం మార్కెట్‌లో కిలో టమాటా రూ.46

image

అనంతపురం కక్కలపల్లి మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.46 పలికింది. నిన్న మార్కెట్‌కు 1650 టన్నులు వచ్చినట్లు మార్కెటింగ్ శాఖ కార్యదర్శి రామ్ ప్రసాద్ తెలిపారు. అందులో సరాసరి కిలో రూ.37, కనిష్ఠంగా రూ.27 పలికినట్లు పేర్కొన్నారు. వరదలతో ఇతర ప్రాంతాల్లో పంట దెబ్బ తినడంతో వారం రోజులుగా ధరలు నిలకడగా ఉన్నాయి. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News September 27, 2024

రోడ్ సేఫ్టీ కమిటీతో కలెక్టర్ సమీక్ష సమావేశం

image

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ చేతన్ సెటిల్మెంట్ కమిటీ, రోడ్ సేఫ్టీ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, జిల్లా రవాణాధికారి కరుణసాగర్ రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి శిక్ష పడేటట్టు చేయాలన్నారు.

News September 26, 2024

జిల్లాస్థాయికి ఎంపికైన బత్తలపల్లి అండర్-14 కబడ్డీ జట్టు

image

బత్తలపల్లి అండర్-14 బాలుర కబడ్డీ జట్టు జిల్లా స్థాయికి ఎంపికైనట్లు రామాపురం పాఠశాల పీడీ లక్ష్మీనారాయణ, మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రధానోపాధ్యాయురాలు మాధవి తెలిపారు. వారు మాట్లాడుతూ.. గురువారం ధర్మవరంలో జరిగిన నియోజకవర్గ స్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు బత్తలపల్లి మండలం అండర్-14 బాలల విభాగంలో కబడ్డీ విన్నర్స్‌గా నిలిచి జిల్లాస్థాయికి ఎంపికైనట్లు వారు తెలిపారు.

News September 26, 2024

నేడు ధర్మవరానికి మంత్రి సత్యకుమార్ యాదవ్

image

మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం ధర్మవరంలో పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 10 గంటలకు తాడిమర్రికి మంత్రి చేరుకుని ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. 27న ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. 28న పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ, 29న పీటీ కాలనీలో మంత్రి పర్యటిస్తారని తెలిపారు.

News September 25, 2024

గ్రూపు తగాదాలను పార్టీలకు ఆపాదిస్తారా?: మాజీ ఎమ్మెల్యే అనంత

image

‘గ్రామాలలోని గ్రూపు తగాదాలను పార్టీలకు ఆపాదిస్తారా’ అని అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. రాముల వారి రథం దగ్ధం ఘటన బాధాకరమని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనను వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని, అధికార పార్టీకి జిల్లా ఎస్పీ ఊడిగం చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు.