India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అబ్బురపరిచే శిల్ప సంపదకు నిలయం అనంతలోని లేపాక్షి ఆలయం. నందీశ్వరుడి విగ్రహాన్ని చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. ఉట్టిపడే రాజసం ఈ విగ్రహం సొంతం. ఈ ఆలయంలో వేలాడే స్తంభం ముఖ్య ఆకర్షణ. పర్యాటకులు ఈ అద్భుతాన్ని చూసి పరీక్షిస్తుంటారు. 7 పడగల భారీ నాగేంద్రుడు వంటి ఎన్నో ఆశ్చర్యపరచే వింతలు ఇక్కడున్నాయి. రాముడు జటాయు పక్షిని ‘లే పక్షీ’ అని పిలవడంతో ఈ ఊరికి ‘లేపాక్షి’ అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది.
పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సీఐటీయు నాయకులు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ ఎస్ వెంకటేశ్, పాలసముద్రం గ్రామంలో నాసన్, బెల్ కంపెనీలకు భూములు కోల్పోయిన నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ రైతులు పాల్గొన్నారు.
అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని జులై నెలలో నిర్వహించిన M.SC 2వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ (R21).. అలాగే 1వ సెమిస్టర్ సప్లిమెంటరీ (R21) ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్ను సందర్శించాలని సూచించారు.
ఆత్మకూరు మండలం ముట్టాల గ్రామంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సిమెంట్ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల ముందు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సిమెంట్ రోడ్లు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్పై పోలీసులు ఉక్కు పాదం మోపారు. బెట్టింగ్కు పాల్పడిన 19 మందిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పారు. వీరిలో ఏడుగురు హరియాణాకు చెందిన వారని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.8,60,000ల నగదు, 19 సెల్ ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇటుకులపల్లి సీఐ హేమంత్ కుమార్, రాప్తాడు సీఐ వెంకట శ్రీ హర్ష, ఎస్ఐ విజయ్ కుమార్లను అభినందించారు.
అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన గూనపాటి దీపక్ రెడ్డిని ప్రభుత్వం SEEDAP ఛైర్మన్గా నియమించింది. ఆయన 2021లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో అనంతపురం స్థానిక సంస్థల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీపక్ రెడ్డి 2020లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏర్పాటు చేసిన సెలక్ట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. జేసీ బ్రదర్స్కి అల్లుడు. టీడీపీలో కీలకంగా ఉన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో సోమవారం జరిగిన ఘటనపై కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితో పాటు జడ్పీ వైస్ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, డ్రైవర్ రామాంజనేయులు, అంజి, రఫీ, విజయ్, రంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి చిగిచెర్ల తమపై దాడికి పాల్పడ్డారంటూ బీజేపీ కార్యకర్త ప్రతాప్ రెడ్డి ధర్మవరం వన్ టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ ఎత్తున పంచాయతీ కార్యదర్శుల బదిలీలు జరిగాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 243 మంది పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తూ అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు. భారీ ఎత్తున పంచాయతీ కార్యదర్శుల బదిలీలు జరగగా, బదిలీ అయిన వారు త్వరలో వారికి కేటాయించిన స్థానాలలో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాలు జారీ చేశారు.
పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక జిల్లా ఎస్పీ వి రత్న ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి 76 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. అర్జీదారుల సమస్యలు సకాలంలో పరిష్కరించాలని జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు తెలిపారు.
ఈనెల 28వ తేదీ శ్రీ సత్యసాయి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో మన ఇల్లు-మన గౌరవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. జిల్లాల మంజూరైన గృహాలను పూర్తి చేయాలనే అంశంపై ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో 31,449 గృహాలు మంజూరు అయ్యాయని, అందులో కొన్ని ప్రారంభ దశలోనే ఉన్నాయన్నారు.
Sorry, no posts matched your criteria.