Anantapur

News May 5, 2024

గార్లదిన్నె: కుక్కు ఆపరేషన్ చేసి కాపాడారు

image

గార్లదిన్నె మండల కేంద్రంలో ఓ వీధి కుక్క ప్రసవించలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న దానిని స్థానికులు గుర్తించారు. తక్షణమే అనంతపురం పశువైద్యశాలకు తరలించారు. డాక్టర్ పద్మనాభం ఆపరేషన్ చేసి గర్భంలో చనిపోయిన 5 కుక్క పిల్లలను బయటకు తీసి దాని ప్రాణాలు కాపాడారు.

News May 5, 2024

మడకశిరలో కాంగ్రెస్ గట్టిపోటీ.. త్రిముఖ పోరులో నెగ్గేదెవరో?

image

జిల్లాలో ఎక్కడా లేనట్లు మడకశిర నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. టీడీపీ నుంచి ఎంఎస్ రాజు, వైసీపీ నుంచి ఈర లక్కప్ప బరిలో బరిలో ఉండగా.. వీరికి కాంగ్రెస్‌ అభ్యర్థి సుధాకర్ గట్టిపోటీ ఇచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మంచి పట్టున్న మాజీమంత్రి రఘువీరారెడ్డి విస్తృతంగా ప్రచారం చేయడం ఆ పార్టీకి ప్లస్‌గా మారింది. చూడాలి ‘మడకశిర’ ట్రయాంగిల్ ఫైట్లో ఎవరు నెగ్గుతారో?

News May 5, 2024

నేడు ధర్మవరానికి అమిత్ షా, చంద్రబాబు

image

కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్‌కు మద్దతుగా ధర్మవరంలో నిర్వహించే బహిరంగ సభలో కేంద్రమంత్రి అమిత్ షా, చంద్రబాబు ఆదివారం పాల్గొననున్నారు. ఈ సభకు కూటమి నేతలు, ప్రజలు భారీగా తరలివచ్చి ధర్మవరం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సత్యకుమార్ పిలుపునిచ్చారు. అటు జాతీయస్థాయిలో మంచిపేరున్న సత్యకుమార్ గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, దేశవ్యాప్తంగా ధర్మవరం పేరు మారుమోగుతుందని బీజేపీ నేతలు తెలిపారు.

News May 4, 2024

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన హిందూపురం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు

image

హిందూపురం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బాలాజీ మనోహర్ శనివారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. సిధ్ధం సభ అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బాలాజీ మనోహర్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ గెలుపునకు కృషి చేయాలని, భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు.

News May 4, 2024

అనంత: ఎన్నికల శిక్షణ కోసం వెళ్లి.. టీచర్ మృతి

image

తాడిపత్రి సమీపంలోని శివాలయం వద్ద రామాంజనేయులు అనే ఉపాధ్యాయుడు మృతిచెందాడు. ఉదయం 5 గంటల సమయంలో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బొమ్మనహల్ మండలం చంద్రగిరిలో విధులు నిర్వహిస్తున్న రామాంజనేయులు ఎన్నికల శిక్షణ కోసం తాడిపత్రికి వెళ్లినట్లు సమాచారం. మృతి చెందిన విషయం ఉరవకొండలో ఉన్న కుటుంబ సభ్యులకు, బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. వడదెబ్బకు గురై చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.

News May 4, 2024

నేటి నుంచి ఏడు వరకు నియోజవర్గ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్

image

నియోజవర్గ కేంద్రంలోని ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. 4, 6 తేదీలలో జిల్లాలో నిర్వహించే పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 4, 6 తేదీల్లో పీఓ, ఏపీఓలకు ఆయా నియోజకవర్గాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామన్నారు. ఓపీఓలకు ఏడో తేదీ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు.

News May 4, 2024

అనంతపురం: 2,350 ఈవీఎంల ర్యాండమైజేషన్

image

అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి సప్లిమెంటరీ ఈవీఎంల ర్యాండమైజేషన్ పారదర్శకంగా నిర్వహించామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో నగర పాలక కమిషనర్ మేఘ స్వరూప్‌తో కలిసి ఎన్నికల్లో పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు, పార్టీల ప్రతినిధుల సమక్షంలో సప్లిమెంటరీ ఈవీఎంల ర్యాండమైజేషన్ నిర్వహించారు.

News May 4, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ హత్య

image

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం జౌకల గ్రామంలో ఓ వ్యక్తిని దారుణ హత్య చేసిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నాగభూషణం(38) అనే వ్యక్తిని దుండగులు అతి దారుణంగా దాడిచేసి హత్య చేశారు. శనివారం ఉదయం గ్రామ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హత్య ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు కదిరి పోలీసులు తెలిపారు.

News May 4, 2024

అనంత: ఏపీ ఈసెట్-2024కు 37,767 దరఖాస్తులు

image

పాలిటెక్నిక్ డిప్లొమో పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఏపీ ఈసెట్-2024 పరీక్షకు 37,767 దరఖాస్తులు వచ్చాయని అనంతపురం జేఎన్టీయూకు చెందిన ఈసెట్ ఛైర్మన్ ఆచార్య శ్రీనివాసరావు, కన్వీనర్ భానుమూర్తి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ మే 2న ముగిసిందన్నారు. ఈ నెల 8న ఈసెట్ పరీక్ష జరుగుతుందన్నారు. హైదరాబాద్‌లో 2 కేంద్రాలు, ఏపీలో 98 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

News May 4, 2024

నేడు హిందూపురానికి సీఎం జగన్

image

సీఎం జగన్ ఇవాళ హిందూపురంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్ సెంటర్‌లో భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. 1985 నుంచి ఇప్పటి వరకు హిందూపురం టీడీపీ కంచుకోటగా మారింది. ఈ ఎన్నికల నేపథ్యంలో జగన్ పర్యటన హిందూపురంలో ఏ మాత్రం ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.