India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్ట్స్ పరిధిలో ఖాళీగా ఉన్న 84 అంగన్వాడీ కార్యకర్తలు,హెల్పర్ పోస్టుల భర్తీకి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీదేవి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 24 నుంచి అక్టోబర్ 1 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రిజర్వేషన్లు ఆధారంగా భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు సీడీపీఓ కార్యాలయంలో సంప్రదించి వివరాలు పొందవచ్చని తెలిపారు.
అనంతపురం నగరం నేషనల్ పార్కు సమీపంలో సోమవారం టమాటా లోడ్తో వెళ్తున్న ఐచర్ వాహనం అదుపుతప్పి బైక్పై పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గుత్తి మండలం అబ్బే దొడ్డి గ్రామానికి చెందిన దంపతులు హనుమంత రెడ్డి, రంగమ్మగా పోలీసులు గుర్తించారు. వారు అనంతపురంలో ఉంటున్న తమ కుమార్తెలను చూసి తిరిగి వస్తుండగా ఈ ఘటన ప్రమాదం జరిగింది. భార్యాభర్తల మృతి స్థానికంగా విషాదం నింపింది.
అనంతపురం మండలం కందుకూరు గ్రామానికి చెందిన శివారెడ్డి హత్య కేసులో ఏడుగురికి రెండు జీవిత కాలాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ సోమవారం సంచలన తీర్పు వెలువరించారు. ఈ కేసులో ముగ్గురిని నిర్దోషులుగా తేల్చారు. 2018లో పొలంలో ఉండగా శివారెడ్డి హత్యకు గురయ్యారు. నేరం రుజువు కావడంతో బాలకృష్ణ, రమేశ్, అశోక్, భాస్కర్, విజయ్ కుమార్, సూర్యనారాయణ, మహీంద్రలకు కోర్టు శిక్ష విధించింది.
ఉమ్మడి అనంతపురం జిల్లాకు రానున్న రెండు రోజులూ వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయశంకరబాబు ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం, మంగళవారం ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడా మోస్తరుగా వర్షం పడే అవకాశం ఉందని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వివరించారు. రైతులు, పశు, గొర్రెల కాపరులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బుక్కరాయసముద్రం మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో ఓ.పవన్ అనే యువకుడు మదనపల్లిలో ఎంబీఏ పూర్తి చేసి 15 రోజుల క్రితం ఐటీ ఉద్యోగం సాధించారు. తమ కుమారుడికి ఉద్యోగం వచ్చిందన్న సంతోషం రెండు వారాల్లోనే ఆవిరైందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్వతమయ్యారు. మంచి భవిష్యత్తును ఊహించుకున్న ఆ యువకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడం స్థానికంగా తీవ్ర విషాదం మిగిల్చింది.
అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓగా రామచంద్రారెడ్డి నియమిస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సీఈఓగా పనిచేస్తున్న ఓబులమ్మను కడప జిల్లా పరిషత్ సీఈవోగా బదిలీ చేశారు. రామచంద్రారెడ్డి ప్రస్తుతం నంద్యాల జిల్లా DWMAలో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో వెల్లడించారు.
అనంతపురం జిల్లా కేంద్రంలో ఇండియా స్టార్ క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ ఆదివారం సందడి చేశారు. దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్లో పాల్గొనేందుకు వచ్చిన క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ట్రోపీ మ్యాచ్ అనంతరం నగరంలోని వైసీపీ రాష్ట్ర నాయకుడు హరీష్ కుమార్ యాదవ్ ఇంటికి వెళ్ళారు. ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ హరీష్ కుమార్ యాదవ్ ఇంటిలో అందరితో మమేకమై సందడిగా గడిపారు. అభిమానులకు సైతం సెల్ఫీలు, ఆటో గ్రాఫ్లు ఇచ్చారు.
బెలుగుప్ప మండలం జీడిపల్లి వద్ద ఉన్న హంద్రీనీవా పంప్ హౌస్ను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు కాలువ శ్రీనివాసులు, అమిలేనేని సురేంద్ర బాబు పరిశీలించారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో హంద్రీనీవా కాలువలను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి ప్రోజెక్టుకు నీటిని అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జీడిపల్లి ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా 33 మంది రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేస్తూ కలెక్టర్ వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 33 మందిని బదిలీ చేశారు. వారికి కేటాయించిన తహశీల్దార్ కార్యాలయాల్లో రిపోర్ట్ చేసుకోవాలని సూచించారు.
అనంతపురం జిల్లాలో 73 మంది డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వారిని బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన అధికారులు వెంటనే కలెక్టర్ కార్యాలయంలో సంప్రదించి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ పొంది సంబంధిత కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.