Anantapur

News May 4, 2024

సత్యసాయి జిల్లాలో 1,211 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

image

శ్రీ సత్యసాయి జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1,211 ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని హిందూపురం, కదిరి, ధర్మవరం, పెనుకొండ, పుట్టపర్తి, మడకశిర నియోజకవర్గాల నుంచి సివిల్ సప్లై, హోంగార్డ్, పోలీస్, రైల్వే, ఆర్టీసీ, వైద్యం, సెబ్, పౌర సంబంధాల శాఖ, విద్యుత్, ఆర్టీవో, ప్రెస్, అగ్నిమాపక శాఖల నుంచి 1,211 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

News May 4, 2024

కమాండ్ కంట్రోల్ రూమ్ పరిశీలించిన అధికారులు

image

అనంతపురం కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఎస్పీ అమిత్ బర్దర్‌తో కలసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. కంట్రోల్ సెంటర్‌లో నమోదయ్యే వివరాలను సేకరించారు. సిబ్బందితో మాట్లాడి అక్కడ ఎదురయ్యే సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

News May 3, 2024

ఎన్నికలవేళ సమర్థవంతంగా పనిచేయాలి: వినోద్ కుమార్

image

సాధారణ ఎన్నికల సమయంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులు, సెబ్ అధికారులు, పోలీసు అధికారులు చిత్తశుద్ధితో సమర్థవంతంగా పనిచేయాలని అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్. వి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ లో ఎక్సైజ్ అధికారులు, పోలీసు అధికారులు, డిపో మేనేజర్, రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమన్వయ సమావేశాన్ని జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ లతో కలసి జిల్లా కలెక్టర్ నిర్వహించారు.

News May 3, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ఖరారు!

image

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. విజయవాడ నుంచి బయలుదేరి శనివారం ఉదయం 10.10 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10:35 గంటలకు హిందూపురంలోని ఎంజీఎం మైదానానికి హెలికాప్టర్‌లో వస్తారు. అక్కడి నుంచి బహిరంగ సభకు చేరుకుంటారు. సభ అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్తారు.

News May 3, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో హోం ఓటింగ్‌కు 1,025 మంది ఓటర్లు

image

శ్రీ సత్యసాయి జిల్లాలో 1,025 మంది ఓటర్లు హోం ఓటింగ్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోనున్నారని జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు 499 మంది, వికలాంగులు 526 మంది ఈనెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అర్హులైన వారు హోం ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలిపారు.

News May 3, 2024

ఈనెల 5న ధర్మవరానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాక

image

ఈనెల 5న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధర్మవరానికి రానున్నట్టు బీజేపీ నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 5వ తేదీ ఉదయం 9: 45 గంటలకు బెంగళూరు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా 10:30 గంటలకు ధర్మవరం చేరుకుంటారు. ధర్మవరంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం 1.30 గంటలకు తిరిగి బెంగళూరుకు వెళ్తారు.

News May 3, 2024

అనంత జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ కోసం 23,532మంది దరఖాస్తు

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కోసం 23,532మంది దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్ కుమార్ వెల్లడించారు. నిర్దేశించిన తేదీల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు నియోజక వర్గానికి రెండు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

News May 3, 2024

గుంతకల్: మద్యం మత్తులో తమ్ముడిని చంపిన అన్న

image

గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని సొంత అన్న నారాయణరెడ్డి కట్టెతో దాడి చేసి హత్య చేశాడు. గురువారం రాత్రి అర్ధరాత్రి నిద్రలో ఉన్న రామకృష్ణారెడ్డిపై మద్యం మత్తులో నారాయణరెడ్డి దాడి చేసి చంపాడు. గుంతకల్లు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News May 3, 2024

ఎన్నికల రోజు చిన్న సమస్యకు కూడా తావు లేకుండా చూడండి: ఎస్పీ

image

బుక్కరాయసముద్రం మండలంలో అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ గురువారం పర్యటించారు. మండల పరిధిలోని వెంకటాపురం, చెన్నంపల్లి, అగ్రహారం, బుక్కరాయసముద్రంలోని సమస్య ఆత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ రోజు బారికేడ్లు, తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గ్రామాలలో పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రాణాళికా బద్ధంగా బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచనలు, సలహాలు అందజేశారు.

News May 2, 2024

చదరంగంలో గుంతకల్లు విద్యార్థి అంతర్జాతీయ రేటింగ్

image

గుంతకల్లకు చెందిన విద్యార్థి యువరాజ్ కార్వా చదరంగంలో ఇంటర్నేషనల్ రాపిడ్ రేటింగ్ 1,418 సాధించాడు. బెంగుళూరు మరియు గోవాలో జరిగిన 5వ ఐసీఏ, సెకండ్ యూనిటీ క్లబ్, ఆల్ ఇండియా రాపిడ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లలో పాయింట్స్ గెలిచి ఈ రేటింగ్ సాధించాడు. తండ్రి వినోద్ కార్వా వద్ద చదరంగంలో శిక్షణ పొంది ఈ ఘనత సాధించాడు. యువరాజ్‌ను పలువురు అభినందించారు.