Anantapur

News May 2, 2024

చదరంగంలో గుంతకల్లు విద్యార్థి అంతర్జాతీయ రేటింగ్

image

గుంతకల్లకు చెందిన విద్యార్థి యువరాజ్ కార్వా చదరంగంలో ఇంటర్నేషనల్ రాపిడ్ రేటింగ్ 1,418 సాధించాడు. బెంగుళూరు మరియు గోవాలో జరిగిన 5వ ఐసీఏ, సెకండ్ యూనిటీ క్లబ్, ఆల్ ఇండియా రాపిడ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లలో పాయింట్స్ గెలిచి ఈ రేటింగ్ సాధించాడు. తండ్రి వినోద్ కార్వా వద్ద చదరంగంలో శిక్షణ పొంది ఈ ఘనత సాధించాడు. యువరాజ్‌ను పలువురు అభినందించారు.

News May 2, 2024

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

image

పుట్టపర్తి రూరల్ మండల పరిధిలోనీ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం పుట్టపర్తి మండలంలోని నిడిమామిడి, రాచువారి పల్లి గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆయా గ్రామాలలో గత ఎన్నికలలో తలెత్తిన ఘటనలను సమీక్షించారు. ఎన్నికల సందర్భంగా గొడవలు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా వేయాలని సిబ్బందిని ఆదేశించారు.

News May 2, 2024

అనంత: నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడి మృతి 

image

గుంతకల్లు పట్టణ శివారు ప్రాంతంలోని బెస్ట్ కాలనీకి చెందిన జిశాంత్(4) నీటి సంపులో పడి మృతిచెందాడు. అక్క ఆయేషాతో కలిసి ఇంటిముందు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న తండ్రి మహబూబ్ అక్కడికి వెళ్లి సంపులో పడి ఉన్న బాలుడిని బయటకు తీయగా.. బాలుడు అప్పటికే మృతిచెందాడు.

News May 2, 2024

అనంత: నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడి మృతి 

image

గుంతకల్లు పట్టణ శివారు ప్రాంతంలోని బెస్ట్ కాలనీకి చెందిన జిశాంత్(4) నీటి సంపులో పడి మృతిచెందాడు. అక్క ఆయేషాతో కలిసి ఇంటిముందు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న తండ్రి మహబూబ్ అక్కడికి వెళ్లి సంపులో పడి ఉన్న బాలుడిని బయటకు తీయగా.. బాలుడు అప్పటికే మృతిచెందాడు.

News May 2, 2024

పుట్టపర్తి మండలంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం

image

పుట్టపర్తి మండలంలోని ఇరగరాజుపల్లి వద్ద టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం నెలకొంది. గురువారం ఉదయం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రంగనాథ్ టీడీపీలోకి వెళుతున్నారనే సమాచారంతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆయనను గ్రామం వెలుపలకు పిలిచారు. అక్కడ ఆయనతో చర్చిస్తుండగా అక్కడికి వచ్చిన టీడీపీ నాయకుడు లాయర్ శ్రీనివాస్‌కు వైసీపీ నాయకులకు మధ్య వివాదం జరిగింది. స్పందించిన పోలీసులు వివాదాన్ని అణిచివేశారు.

News May 2, 2024

నేడు ధర్మవరానికి ప్రముఖ హీరోయిన్ నమిత

image

ధర్మవరం పట్టణానికి ఇవాళ ప్రముఖ హీరోయిన్ నమిత విచ్చేస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్‌కు మద్దతుగా ఆమె ప్రచారంలో పాల్గొననున్నారు. ధర్మవరం పట్టణంలో ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.

News May 2, 2024

అనంత: మరో 3 నెలలు తిరుపతి- కదిరిదేవరపల్లి రైలు రద్దు

image

రాయదుర్గం మీదుగా ప్రయాణించే తిరుపతి-కదిరిదేవరపల్లి రైలును మరో మూడు నెలల పాటు రద్దుచేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 07589 నంబరు రైలును జులై 31 వరకు, 07590 రైలును ఆగస్టు 1వ తేదీ వరకు రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అభివృద్ధి పనుల కారణంగా ఈ రైలును రద్దు చేస్తున్నట్లు ప్రతి నెలా రైల్వే అధికారులు ప్రకటనలిస్తున్నారు. జనవరి నుంచి జులై వరకు ఈ రైలును పలు కారణాలతో రద్దు చేశారు.

News May 2, 2024

అనంతపురం జిల్లా టీడీపీ రాష్ట్ర కమిటీలో ముగ్గురికి చోటు

image

టీడీపీ రాష్ట్ర కమిటీలో అనంతపురం జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది. గుంతకల్ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌ను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి తమ్మినేని నటేస్ చౌదరి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా, రాయదుర్గం నుంచి మాజీ జడ్పీ ఛైర్మన్ పులా నాగరాజును రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు.

News May 2, 2024

అనంత జిల్లా వ్యాప్తంగా 70 శాతం పింఛన్ల పంపిణీ

image

జిల్లా వ్యాప్తంగా సామాజిక పింఛన్ల పంపిణీ 70శాతం పూర్తిచేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పింఛన్‌దారుల ఖాతాల్లోకి మొదటి రోజే దాదాపు నగదు జమ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 2,88,334 మందికి రూ.86.332 కోట్ల పింఛన్ మొత్తం విడుదలైందన్నారు. ఆధార్ అనుసంధానమైన 2,02,716 మంది పింఛన్‌దారులకు ఖాతాల్లోకి రూ.60.815 కోట్లు జమ చేస్తామన్నారు. 85,618 మంది ఇళ్ల వద్దకు వెళ్లి రూ. 25.517 కోట్లు పంపిణీ చేశామన్నారు.

News May 2, 2024

అనంత: నీళ్ల ట్యాంకర్ బోల్తాపడి యువకుడి మృతి

image

నీళ్ల ట్యాంకర్ బోల్తాపడి యువకుడు మృతిచెందిన ఘటన బుధవారం జరిగింది. గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన రైతు రాముడు తన కుమారుడు సోమశేఖర్‌తో కలిసి చీనిచెట్లకు నీళ్లు తెచ్చేందుకు నీళ్ల ట్యాంకర్ తీసుకెళ్లారు. ఈ క్రమంలో కమలాపురం వద్ద ప్రమాదవశశాత్తు ట్యాంకర్ బోల్తాపడి సోమశేఖర్ మృతిచెందగా.. తండ్రి రాముడికి తీవ్రగాయాలయ్యాయి.