Anantapur

News October 28, 2024

ప్రజా సమస్యల పరిష్కార వేదిక 410 అర్జీలు: కలెక్టర్

image

గుంతకల్లులోని టీటీడీ కళ్యాణ మండపంలో సోమవారం గుంతకల్లు రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుంచి కలెక్టర్ వినోద్ కుమార్ అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి 410 అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు.

News October 28, 2024

అనంతపురం జిల్లాలో పెట్టుబడులు పెట్టండి: నారా లోకేశ్

image

అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ అనంతపురం జిల్లాలో పెట్టుబడులు పెట్టాలని టెస్లా సీఎఫ్‌వో వైభవ్ తనేజాను కోరారు. ఆస్టిన్‌లోని టెస్లా కార్యాలయంలో ఆ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. టెస్లా EV తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు అనంతపురం జిల్లా వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుందని అన్నారు. 2029 నాటికి ఏపీలో 72గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

News October 28, 2024

ATP: చిన్నారిపై వృద్ధుడి అత్యాచారయత్నం!

image

ఆరేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈఘటన అనంతపురం జిల్లాలోని చెన్నేకొత్తపల్లి మండలంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. బాలిక ఆడుకుంటుండగా వృద్ధుడు(70) మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. అసభ్యంగా ప్రవర్తించగా బాలిక తప్పించుకుని ఇంటికెళ్లి తల్లికి చెప్పింది. చిన్నారి కుటుంబ సభ్యులు వృద్ధుడిని నిలదీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

News October 27, 2024

హిందూపురం: రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి

image

హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని A1 స్టీల్ ఫ్యాక్టరీ వద్ద రెండు బైక్‌లు ఢీకొని ఓ బాలిక మృతి చెందింది. ఆదివారం సాయంత్రం ఎదురుగా వస్తున్న బైక్‌లు ఢీకొనడంతో అలియా(8) అక్కడికక్కడే మృతి చెందగా.. తల్లిదండ్రులతో పాటు నాలుగేళ్ల చిన్నారికి గాయాలయ్యాయి. మరో ద్విచక్ర వాహన దారుడూ గాయపడ్డాడు.

News October 27, 2024

కలెక్టర్ కార్యాలయంలో రేపు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం

image

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం పదిన్నర గంటలకు మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు కలెక్టరేట్‌లో జరిగే ఫిర్యాదుల సేకరణకు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై వినతులు ఇవ్వవచ్చునన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

News October 27, 2024

విడపనకల్: విద్యుత్ షాక్‌తో మహిళా రైతు మృతి

image

అనంతపురం జిల్లా విడపనకల్ మండలంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. మండలం పరిధిలోని హవళిగి గ్రామానికి చెందిన వరలక్ష్మి, పెన్నయ్య దంపతులు ఉదయం పొలం పనులకు వెళ్లారు. ఈ క్రమంలో వరలక్ష్మి పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైంది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News October 27, 2024

ATP: శింగనమల వద్ద ఘోర ప్రమాదం.. పోలీసుల అదుపులో లారీ డ్రైవర్!

image

శింగనమల క్రాస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు హరేరామ.. హరే కృష్ణ భక్తులు <<14460473>>మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు టైరు పేలి లారీని ఢీకొందా? అతివేగం కారణమా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కౌలుట్లయ్య తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో మృతిచెందిన వారంతా 30 ఏళ్లలోపు వారే. వీరిలో నలుగురు అనంత, సత్యసాయి జిల్లా వాసులు.

News October 27, 2024

ఈ నెల 28న గుంతకల్లులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ఈ నెల 28వ తేదీన గుంతకల్లులో సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. గుంతకల్లు రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తామన్నారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

News October 26, 2024

అనంతపురం మృతుల కుటుంబాలకు సీఎం సానుభూతి

image

అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింగనమల మండలం, నాయనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇస్కాన్ టెంపుల్ భక్తులు దుర్మరణం చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

News October 26, 2024

సింగనమల: ‘ప్రమాదానికి కారణం అతివేగమే’

image

సింగనమలలోని నాయన పల్లి క్రాస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు తెలిపారు. కారు అతివేగంగా రావడంతో కారు టైర్ పేలి డివైడర్ పైనుంచి అవతలి వైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిందన్నారు. దీంతో కారులో ఉన్న ఆరుగురు మృతిచెందినట్లు పేర్కొన్నారు. కాగా యాక్సిడెంట్ జరగడంతో అనంతపురం-కడప హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.