India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మహిళలకు నిర్వహించనున్న క్రికెట్ శిక్షణ శిబిరాలకు జిల్లాకు చెందిన పలువురిని శిక్షకులుగా ఎంపిక చేశారు. జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి మధుసూదన్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు చెందిన బొమ్మన్న సీనియర్ మహిళా జట్టుకు నైపుణ్య శిబిరానికి టైనర్గా నియమించారు. శర్మాస్వలిని జూనియర్ మహిళా జట్టుకు మొదటి బ్యాచ్ శిక్షకుడిగా, రెండో బ్యాచ్ శిక్షకుడిగా K.నరేశ్ను నియమించారు.
గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్కు రాష్ట్రస్థాయి పదవి దక్కింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు జితేంద్ర గౌడ్కు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడిగా నియమించింది. గుంతకల్లు టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న ఆయనను తప్పించి గుమ్మనూరు జయరాంకు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జితేంద్రగౌడ్కు రాష్ట్రస్థాయి పదవి దక్కడంతో నియోజకవర్గ టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని విధాల సన్నద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఆయా రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. నోడల్ టీమ్లు సమన్వయ సహకారాలతో అప్రమత్తంగా ఉంటూ పనులను పూర్తి చేయాలన్నారు.
డీ.హీరేహల్ మండలం మురడి గ్రామానికి చెందిన కవితమ్మ(35) పాము కాటుకు గురై మృతిచెందినట్లు ఎస్ఐ గురు ప్రసాద్ రెడ్డి బుధవారం తెలిపారు. 29న భర్త, కుమారుడితో పాటు ఆరుబయట పడుకున్న సమయంలో పాము కాటుకు గురైంది. వెంటనే ఆమెను బళ్లారి విమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నేడు మృతి చెందారని ఎస్ఐ తెలిపారు. భర్త దాసప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఈమెకు ముగ్గురు కుమారులు.
ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా రాజకీయ పార్టీల వ్యవహరించాలని పార్లమెంటరీ ఎన్నికల వ్యయ పరిశీలకులు అమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఖర్చులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈనెల 6, 10వ తేదీలలో అభ్యర్థులు ఖర్చు చేసిన వివరాలకు సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేస్తామన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈనెల 4న రోడ్ షో కార్యక్రమం ఉంటుందని హిందూపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దీపిక తెలిపారు. పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల అభ్యర్థులను హిందూపురం సభ ద్వార పరిచయం చేయనున్నారు. జగన్ రాకకోసం భారీ ఏర్పాట్లు చేయనున్నట్లు ఆమె తెలిపారు.
రొద్దం మండలం పెద్దగువ్వలపల్లిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ముళ్లపొదలో అప్పుడే పుట్టిన మగ బిడ్డను వదిలి వెళ్లారు. ఈ ఘటన స్థానికులను కలిచివేస్తుంది. గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఐసీడీఎస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అనంతపురంలో ఆన్లైన్ జూదానికి అలవాటు పడిన ఓ వ్యక్తి చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురంలోనని సోమనాథనగర్కు చెందిన నరేశ్(30) మిల్క్ డెయిరీ నిర్వహిస్తున్నాడు. అతడు ఆన్లైన్లో జూదానికి అలవాటుపడి ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేశాడు. దానికి తోడు మిల్క్ డెయిరీ సంబంధించిన డబ్బులు వాడుకోవడంతో ఒత్తిడి చేశారు. మనస్తాపానికి గురై గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న మూడు రోజుల్లో తీవ్రమైన వడ గాలులు వీస్తాయని రేకలకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. మే 1, 2, 3వ తేదీల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. పంట పొలాల్లో పనిచేసే రైతులు ఉదయం 10 గంటల తర్వాత విశ్రాంతి తీసుకోవాలన్నారు. ఎండలో పనిచేస్తే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.
అనంతపురం జిల్లాలో బుధవారం నుంచి రేషన్ బియ్యం పంపిణీ చేస్తారని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ తెలిపారు. పంపిణీ ప్రక్రియ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలని తహశీల్దార్లను ఆదేశించారు. కార్డులోని ప్రతి సభ్యునికి 5 కిలోలు, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల ఫోర్టిఫైడ్ బియ్యం ఉచితంగా ఇస్తారన్నారు. చక్కెర ఏఏవై కార్డు లకు కిలో రూ.13.50, మిగతా కార్డుదారులకు అర కిలో రూ.17 ప్రకారం అందిస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.