India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వెనిజులా వైస్ ప్రెసిడెంట్ రోడ్రిగ్జ్ డెల్సీ పుట్టపర్తికి వచ్చారు. శ్రీ సత్యసాయి మహా సమాధి దర్శనార్థం శనివారం వైస్ ప్రెసిడెంట్ బృందం ప్రత్యేక విమానం ద్వారా శ్రీ సత్య సాయి విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి సత్య సాయి ట్రస్టు సభ్యుడు రత్నాకర్, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ విజయకుమార్ స్వాగతం పలికారు.

అనంతపురం జిల్లా సింగనమల మండల నాయనపల్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డుప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. కారు టైరు పేలి లారీని ఢీకొనడంతో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మృతులు అనంతపురం ఇస్కాన్కి చెందిన వారని, తాడిపత్రిలోని ఇస్కాన్ నగర సంకీర్తనకి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృతులు సంతోష్, షణ్ముక్, వెంకన్న, శ్రీధర్, ప్రసన్న, వెంకీగా గుర్తించారు.

తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలంలోని వేములపాడు-తాడిపత్రి మధ్య శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మంది వ్యవసాయ కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. 108 అంబులెన్స్లో క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై యాడికి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అనంతపురం, హిందూపురం ఎంపీలు అంబికా లక్ష్మినారాయణ, బీకే పార్థసారథిలకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. కేంద్ర మంత్రిత్వ శాఖల సంప్రదింపులు(కన్సల్టేటివ్) కమిటీల్లో సభ్యులుగా వీరికి అవకాశం కల్పించింది. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథికి రహదారులు, రవాణాశాఖ కమిటీలో చోటు కల్పించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అనంతపురం జిల్లాలో వచ్చే మూడు రోజులు వర్షాలు పడతాయని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త విజయశంకర్ బాబు తెలిపారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో చిరుజల్లులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 32.6 నుంచి 33.3 డిగ్రీలు నమోదవుతాయని అన్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు 21.0 నుంచి 22.4 డిగ్రీలుగా ఉంటాయన్నారు.

అనంతపురం జిల్లాలో వచ్చే మూడు రోజులు వర్షాలు పడతాయని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త విజయశంకర్ బాబు తెలిపారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో చిరుజల్లులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 32.6 నుంచి 33.3 డిగ్రీలు నమోదవుతాయని అన్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు 21.0 నుంచి 22.4 డిగ్రీలుగా ఉంటాయన్నారు.

అనంతపురం స్థానిక కక్కలపల్లి మార్కెట్లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.32తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ తెలిపారు. మార్కెట్కు శుక్రవారం మొత్తంగా 1,275 టన్నుల టమాటా దిగుబడులు వచ్చినట్లు తెలిపారు. రెండ్రోజులుగా ధరలు పడిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యువతి తన ప్రేమను నిరాకరించిందని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యల వివరాల మేరకు.. రొద్దం మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన బాలాజీ (28) పావగడకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆమె ప్రేమకు నిరాకరించడంతో మనస్తాపం చెందిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ కుమారుడి మృతిపై తల్లిదండ్రులు బోరున విలపించారు.

కార్తీక్ మాసంలో శివ భక్తులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా ప్రజా రవాణా అధికారి మధుసూదన్ పేర్కొన్నారు. శుక్రవారం పుట్టపర్తిలోని కార్యాలయంలో ట్రాఫిక్, గ్యారేజ్ సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. మూడు శైవ క్షేత్రాలైన బుగ్గ రామేశ్వరం, యాగంటి, మహానంది ప్రాంతాలను దర్శించుకోవడానికి 52 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

బత్తలపల్లి మండలం రామాపురం బస్టాప్ వద్ద ఈనెల 20న పట్టపగలే తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. ధర్మవరంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. హైదరాబాద్కు చెందిన 8 మందిని అరెస్టు చేశామన్నారు. 2 కార్లు, 2 నకిలీ (Toy) తుపాకులు, 19 నకిలీ ప్లాస్టిక్ బుల్లెట్లు, 2 కేజీల నకిలీ బంగారు పూసల ఛైన్, ఒక వాకి-టాకీ, మైకు స్వాధీనం చేసుకున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.