Anantapur

News April 30, 2024

ధర్మవరం: వడదెబ్బతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

image

ముదిగుబ్బ పట్టణం పాత ఊరికి చెందిన మోపూరి ప్రణీత్ కుమార్ (24) వడదెబ్బతో సోమవారం‌ మృతి చెందినట్లు అతడి కుటుంబీకులు తెలిపారు. ప్రణీత్ కుమార్‌కు ఆదివారం వడదెబ్బ తగలడంతో పరిస్థితి విషమించింది. చికిత్స నిమిత్తం బెంగళూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రణీత్ మృతి చెందాడు. ప్రస్తుతం ప్రణీత్ కుటుంబ సభ్యులు అనంతపురంలో నివాసం ఉంటున్నారు.

News April 30, 2024

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అప్రమత్తంగా ఉండాలి: సత్యసాయి ఎస్పీ

image

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అప్రమత్తంగా ఉండాలని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం హిందూపురం సమీపంలోని బిట్స్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాలు నిరంతరం బందోబస్తు చేపట్టే గార్డ్, సీసీ కెమెరాలు తదితర ఏర్పాట్లు పరిశీలించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు నిరంతరం పహారా కాస్తు ఉండాలన్నారు.

News April 29, 2024

హిందూపురం ఎంపీ అభ్యర్థులుగా 13మంది బరిలో

image

హిందూపురం ఎంపీ అభ్యర్థులుగా 13మంది బరిలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి పి.అరుణ్ బాబు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఉపసంహరణ అనంతరం పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. మొత్తం 15మంది అభ్యర్థులు బరిలో ఉండగా సోమవారం ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరణ చేసుకున్నారని తెలిపారు.

News April 29, 2024

నామినేషన్‌లు ఉపసంహరించుకున్న మడకశిర టీడీపీ రెబల్ అభ్యర్థులు

image

మడకశిర నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఈరన్న, తనయుడు సునీల్ కుమార్ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు. సోమవారం మడకశిర తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఈరన్నతో పాటు సునీల్ కుమార్‌ నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. టీడీపీ అభ్యర్థి ఎమ్మెస్ రాజుకు మద్దతు పలికారు. టీడీపీ అభ్యర్థిని గెలిపించుకుంటామని పేర్కొన్నారు.

News April 29, 2024

అనంత: ఒకే ఊరి ప్రజలు ఇద్దరి MLAలను ఎన్నుకుంటారు

image

అనంతపురం జిల్లాలోని కొండేపల్లిలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒక్కటే గ్రామం అయినప్పటి శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో ఉండటం విశేషం. దీంతో ఆ ఊరి ఓటర్లు ఇద్దరు ఎమ్మెల్యేలను ఎన్నుకొంటారు. 2009కి ముందు గ్రామస్థులు ఇద్దరు ఎంపీలను ఎన్నుకునేవారు. పుట్లూరు మండల పరిధిలోని ఓటర్లు హిందూపురం లోక్ సభ, ధర్మవరం అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉండేవారు. పునర్విభజన అనంతరం వీరిని శింగనమల నియోజకవర్గంలోకి తెచ్చారు.

News April 29, 2024

అనంతలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు

image

ఉమ్మడి అనంత జిల్లాలో ఆదివారం అనంత నగరంలో రికార్డు స్థాయిలో 44.1 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవ రెడ్డి, నారాయణస్వామి తెలిపారు. బుక్కరాయసముద్రంలో 43.2, తాడిపత్రి, నంబులపూటకుంట, పుట్టపర్తి 40.5, తనకల్లు, గోరంట్లలో 40.4 డిగ్రీలు చొప్పున  ఉష్ణోగ్రతలు నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

News April 29, 2024

శ్రీ సత్యసాయి: ‘ఫిర్యాదుల విషయంలో హేతుబద్ధత కలిగి ఉండాలి ’

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదుల విషయంలో హేతు భద్రత కలిగి ఉండాలని ఎన్నికల పరిశీలకులు అన్బు కుమార్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సాధారణ, వ్యయ, పోలీసు పరిశీలకులు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పారదర్శకంగా, ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చూడాలన్నారు.

News April 28, 2024

 వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే నాగరాజు 

image

పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే నాగరాజు రెడ్డి ఆదివారం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. నేడు తాడిపత్రిలో జరిగిన సీఎం సభలో జగన్ ఆయనకు వైసీపీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని నాగరాజు తెలిపారు. 

News April 28, 2024

గుంతకల్ రైల్వే స్టేషన్‌లో భారీగా నగదు సీజ్

image

గుంతకల్ రైల్వే స్టేషన్ వద్ద ఎన్నికల నేపథ్యంలో ఆదివారం రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ మహిళ బ్యాగులో ఎలాంటి రశీదులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ.50 లక్షల నగదును సీజ్ చేసినట్లు రైల్వే సీఐ నగేశ్ బాబు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం, గంజాయి, డబ్బును అక్రమంగా తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పట్టణ ప్రజలను సీఐ హెచ్చరించారు.

News April 28, 2024

బీసీ గురుకుల ప్రవేశ పరీక్షకు 494 మంది గైర్హాజరు

image

అనంతపురం జిల్లాలో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షలకు 494 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికారత అధికారి ఖుష్బు కొఠారి తెలిపారు. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించారు. జిల్లాలో 11 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. పరీక్షలకు 2537 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 2043 మంది హాజరయ్యారని తెలిపారు.