Anantapur

News April 28, 2024

తాడిపత్రిలో 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు

image

తాడిపత్రిని పోలీసులు తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. నేడు సీఎం జగన్ పర్యటిస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ, ఇద్దరు ఏఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 26 మంది సీఐలు, 43 మంది ఎస్ఐలతో పాటు 2000 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు విధులకు కేటాయించారు. బందోబస్తును 6 సెక్టార్లుగా విభజించారు. ఒకరోజు ముందే తాడిపత్రికి చేరుకుని తమకు కేటాయించిన స్థానాలలో విధులు చేపట్టారు.

News April 28, 2024

నార్పల మండలం వాలంటీర్ సస్పెండ్

image

నార్పల మండలం గూగూడు గ్రామానికి చెందిన వాలంటీర్ ఓలయ్యను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్‌కు వ్యతిరేకంగా వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 81 మంది వాలంటీర్లు, 18 డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లు, 30 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 8 మంది రెగ్యులర్ ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొన్నారు.

News April 28, 2024

ALERT: అనంతపురం@ 43.7

image

భానుడి ప్రతాపానికి శనివారం రాయలసీమ ప్రజలు అల్లాడిపోయారు. దేశంలోనే నంద్యాలలో 44.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.. కర్నూలులో 44.5 అనంతపురం 43.7, కడప 43.4, తిరుపతి 42.9, నెల్లూరులో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలోనే హాటెస్ట్ సిటీగా నంద్యాల నిలవడం గమనార్హం. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

News April 27, 2024

తాడిపత్రిలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ఇదే..!

image

అనంతపురం జిల్లా తాడిపత్రిలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టులో బయలుదేరి 9:45 గంటలకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 10:30 గంటలకు తాడిపత్రి చేరుకుంటారు. 11 గంటల నుంచి 11:45 వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 12 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకుని తిరుపతి జిల్లా వెంకటగిరికి వెళ్లనున్నారు.

News April 27, 2024

అనంత: రైలు కిందపడి వెస్ట్ బెంగాల్ వాసి ఆత్మహత్య

image

గుంతకల్లు పట్టణ శివారులో వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన విశ్వజిత్ అనే వ్యక్తి శనివారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News April 27, 2024

అనంత: పరీక్ష రాయడానికి వెళుతూ.. విద్యార్థిని దుర్మరణం

image

నార్పల మండల పరిధిలోని నడి దొడ్డి గ్రామానికి చెందిన నాగార్జున కూతురు ఝాన్సీ(9) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. గురుకుల పాఠశాలలో పరీక్షలు రాయడానికి తండ్రి, కూతురు మరో విద్యార్థి బైక్ మీద బయలుదేరారు. ఈ క్రమంలో కేశేపల్లి వద్ద కుక్క దూరడంతో బైక్ అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో విద్యార్థి ఝాన్సీ తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన ఇద్దరికి గాయలయ్యాయి.

News April 27, 2024

అనంత: RDT సెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

అనంతపురం జిల్లాలో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు RDT సెట్‌ నిర్వహిస్తామని ఆ సంస్థ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్ జి.మోహన్‌ మురళి తెలిపారు. 10వ తరగతిలో 500 మార్కులుపైన సాధించిన విద్యార్థులను రాష్ట్రంలోని వివిధ కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలల్లో చేర్పించి ఫీజులన్నీ RDT భరిస్తుందన్నారు. మే 4 నుంచి 10వ తేదీలోపు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. వివరాల కోసం సంప్రదించాలని కోరారు.

News April 27, 2024

హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథికి తప్పిన ప్రమాదం

image

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథికి పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం నుంచి మడకశిరకు ఆయన కారులో వెళుతుండగా చెన్నేకొత్తపల్లి వద్ద ముందు వెళుతున్న ఐచర్ వాహనాన్ని కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో పార్థసారథి సురక్షితంగా బయటపడ్డారు. ఐచర్ డ్రైవర్ ఆకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగిందని కారులో ఉన్న వారు తెలిపారు.

News April 27, 2024

మడకశిర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై 47 కేసులు

image

మడకశిర టీడీపీ అభ్యర్థి ఎం. ఎస్ రాజుపై మెుత్తం 47 కేసులు నమోదైనట్లు తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. చరాస్తుల విలువ ఎం. ఎస్ రాజుపై రూ.1,29,218, అతని భార్యపై రూ.750549 ఉన్నట్లు పేర్కొన్నారు. స్థిరాస్తులు అతనిపై రూ.1.50 లక్షలు, భార్యపై రూ. 2.5 లక్షలు ఉన్నట్లు తెలిపారు. ఆయన పేరుపై రూ.2.5 లక్షల అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు.

News April 27, 2024

అనంతపురం జిల్లాలో భానుడి ఉగ్రరూపం

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో భానుడు రోజు రోజుకు ఉగ్రరూపం దాల్చాడు. శుక్రవారం అత్యధికంగా బొమ్మనహల్ మండలంలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు రేకులకుంట పరిశోధన స్థానం శాస్త్రవేత్త సహదేవరెడ్డి తెలిపారు అదేవిధంగా యల్లనూరు, తాడిపత్రి, 43.3, గుంతకల్, తాడిపత్రి,43.1, శింగనమల, చెన్నేకొత్త పల్లి,43.0, పరిగి 42.9, పుట్టపర్తి 42.9, ముదిగుబ్బ 42.8, యాడికి 42.5 నమోదైనట్లు తెలిపారు.