Anantapur

News October 23, 2024

యాడికిలో వ్యక్తి దారుణ హత్య

image

అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని కుంటలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి బుధవారం దారుణ హత్యకు గురయ్యాడు. వీరన్న పల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ అలియాస్ గుర్రం యాడికిలోని కుంట వద్ద ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 23, 2024

ATP: వరద గాయం రూ.5కోట్ల పైనే!

image

★ అనంతపురం నగరంలో నిరాశ్రయులైన 200 కుటుంబాలు
★ పదుల సంఖ్యలో నీట మునిగిన ఆటోలు, బైక్‌లు
★ ఇళ్లల్లోని సరకులు, ఎలక్ట్రానిక్ వస్తువులు జలమయం
★ 370 హెక్టార్లల్లో దెబ్బతిన్న పంటలు
★ 55 హెక్టార్లల్లో ఉద్యాన రైతులకు తీవ్ర నష్టం
★ అనంత, సత్యసాయి జిల్లాల్లో 100కుపైగా మృతిచెందిన జీవాలు
★ వర్ష బీభత్సానికి నేలకూలిన ఇళ్లు.. దెబ్బతిన్న రహదారులు
★ రెండు జిల్లాల్లో రూ.5కోట్లకుపైగా నష్టం జరిగినట్లు అంచనా!

News October 23, 2024

ATP: వరద గాయం రూ.5కోట్ల పైనే!

image

★ అనంతపురం నగరంలో నిరాశ్రయులైన 200 కుటుంబాలు
★ పదుల సంఖ్యలో నీట మునిగిన ఆటోలు, బైక్‌లు
★ ఇళ్లల్లోని సరకులు, ఎలక్ట్రానిక్ వస్తువులు జలమయం
★ 370 హెక్టార్లల్లో దెబ్బతిన్న పంటలు
★ 55 హెక్టార్లల్లో ఉద్యాన రైతులకు తీవ్ర నష్టం
★ అనంత, సత్యసాయి జిల్లాల్లో 100కుపైగా మృతిచెందిన జీవాలు
★ వర్ష బీభత్సానికి నేలకూలిన ఇళ్లు.. దెబ్బతిన్న రహదారులు
★ రెండు జిల్లాల్లో రూ.5కోట్లకుపైగా నష్టం జరిగినట్లు అంచనా!

News October 23, 2024

గుంతకల్-కదిరిదేవర పల్లి రైలు రద్దు

image

కదిరిదేవర పల్లి నుంచి గుంతకల్ మీదుగా తిరుపతికి వెళ్లే రైలును నవంబర్ 1 నుంచి రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రాయదుర్గం-కదిరిదేవర పల్లి మధ్య ఆధునికీకరణ పనులు చేస్తున్నందున నవంబర్ 30 వరకు రాకపోకలు నిలిపివేసినట్లు తెలిపారు. ఈ రైలు గుంతకల్, తిరుపతి మధ్య మాత్రమే నడుస్తుందని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News October 23, 2024

నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలి: కలెక్టర్

image

నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో డ్వామా, డీఆర్డీఏ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, స్కిల్ డెవలప్మెంట్, గ్రామీణ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో వికసిత్ ఆంధ్ర-2047లో భాగంగా వంద రోజుల్లో చేపట్టే పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులను పూర్తి చేయాలన్నారు.

News October 22, 2024

774 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా

image

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 774 హెక్టార్లలో వివిధ పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. 27 హెక్టా ర్లు పత్తి 16 హెక్టార్లు వేరుశనగ 346 హెక్టార్లు కొర్ర 7 హెక్టార్లు వీటితో పాటు ఇతర ఇతర పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించామన్నారు.

News October 22, 2024

రాబోవు నాలుగు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

శ్రీ సత్యసాయి జిల్లాలో రానున్న నాలుగు రోజులలో కురువనున్న వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు నిండుగా ప్రవహించే అవకాశం ఉందని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రత్న పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో జాగ్రత్తలు చేపట్టాలని, కర్ణాటకలోని పరగోడు నిండి పొర్లుతున్నందున చిలమత్తూరు, గోరంట్ల, పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News October 22, 2024

బుడమేరులా అనంతపురాన్ని ముంచెత్తిన ‘పండమేరు’

image

బుడమేరు విజయవాడను ముంచెత్తితే.. పండమేరు అనంతపురంపై విరుచుకుపడింది. నగర శివారులోని ఈ వాగు అర్ధరాత్రి కుండపోత వర్షానికి ఉద్ధృతంగా ప్రవహించి సుమారు ఐదు కాలనీలను ముంచెత్తింది. ప్రజలు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. వాహనాలు కొట్టుకుపోయాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. కనగానపల్లి చెరువు కట్ట తెగడంతోనే పండమేరుకు భారీ వరద వచ్చినట్లు తెలుస్తోంది. అధికారుల ముందస్తు హెచ్చరికలతో ప్రాణ నష్టం జరగలేదు.

News October 22, 2024

అనంతసాగర చెరువు మరువని పరిశీలించిన కలెక్టర్

image

భారీ వర్షాల నేపథ్యంలో అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం వద్ద అనంత సాగర చెరువు మరువను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. భారీ వర్షాలు నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యల్లో ఉండాలని సూచించారు. చెరువు మరువ పారే పరిసరాల ప్రాంతాలలో ప్రజలు రాకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.

News October 22, 2024

ఎం.బండమీద పల్లిలో 70 గొర్రెలు, మేకల మృత్యువాత

image

రాప్తాడు మండలం ఎం.బండమీదపల్లిలో అర్ధరాత్రి గ్రామ చెరువు తెగిపోవడంతో లావణ్య అనే మహిళకు చెందిన 70 గొర్రెలు, మేకలు కొట్టుకుపోయాయి. తన ఆరేళ్ల కొడుకు, నాలుగేళ్ల కూతురితో కలిసి వాటిని కాపాడుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేదని బాధితురాలు వాపోయారు. 80లో పదింటిని మాత్రమే కాపాడుకోగలిగామని చెప్పారు. కాగా ఈమె భర్త మాధవయ్య 5 రోజుల క్రితం మృతిచెందగా, పెద్దకొడుకు పాముకాటుతో ఇటీవల చనిపోయాడు.