Anantapur

News April 27, 2024

ధర్మవరంలో చేనేత కార్మికుడి దారుణ హత్య

image

ధర్మవరంలో శుక్రవారం రాత్రి దారుణ హత్య జరిగింది. గీతానగర్‌‌లోని రమేశ్‌కు అతడి పిన్ని నారాయణమ్మ కుమారుడు మణి పట్టుచీర అమ్మాడు. అందుకు సంబంధించిన రూ.10వేలు ఇవ్వాలని రమేశ్‌ను అడగడంతో మాటమాట పెరిగి మణి ఛాతిలో కత్తితో పొడిచాడు. అడ్డువచ్చిన మణి అన్న మణికంఠపై, తల్లి సావిత్రిని రమేశ్ కత్తితో పొడిచి గాయపరిచాడు. మణిని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు.

News April 27, 2024

శ్రీ సత్యసాయి: అనుమానంతో భార్యను చంపిన భర్త

image

పుట్టపర్తి రూరల్ మండలం వెంగళమ్మ చెరువులో శుక్రవారం సాయంత్రం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ కృష్ణమూర్తి వివరాల ప్రకారం.. ఈడిగ పవన్ వాలంటీర్ ఉద్యోగం చేస్తూ ఇటీవల రాజీనామా చేశాడు. భార్య త్రివేణి(25) ఇంటి వద్ద ఉంటూ పిల్లలను చూసుకునేవారు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను నరికి చంపినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పుట్టపర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 27, 2024

ఆర్డీటీ సెట్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

ఆర్డీటీ సెట్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని పెనుకొండ ఆర్డీటీ కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
ప్రస్తుతం పదవ తరగతి ఉత్తీర్ణులైన పేద, గ్రామీణ, ప్రతిభావంతులైన విద్యార్థులు టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్, హాల్ టికెట్, ఆధార్ కార్డ్, స్టడీ సర్టిఫికెట్, రేషన్ కార్డ్, క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్లు, 4 ఫొటోలు తీసుకుని మండల పరిధిలోని ఆర్డీటీ ఆఫీసులో మే 4వ తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలని తెలిపారు.

News April 26, 2024

తాడిపత్రిలో 2 నామినేషన్లు రిజెక్ట్

image

తాడిపత్రిలో దాఖలైన ఎన్నికల నామినేషన్లలో 2 రిజెక్ట్ చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాంభూపాల్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారన్నారు. శుక్రవారం వాటిని పరిశీలించి ఇది వరకే ప్రధాన పార్టీ అభ్యర్థులు నామినేషన్లు అంగీకరించినందున కేతిరెడ్డి రమాదేవి, జేసీ ప్రభాకర్ రెడ్డి నామినేషన్లు తిరస్కరించినట్లు తెలిపారు.

News April 26, 2024

ఈనెల 27న పాలిసెట్ ప్రవేశ పరీక్ష

image

అనంతపురం జిల్లాలో శనివారం పాలిసెట్- 2024 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ జయచంద్ర రెడ్డి తెలిపారు. జిల్లాలో 24 పరీక్ష కేంద్రాల్లో 8880 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

News April 26, 2024

శ్రీ సత్యసాయి: ఓపెన్‌ పది, ఇంటర్‌ ఫలితాల విడుదల

image

శ్రీ సత్యసాయి జిల్లాలో ఓపెన్‌ పది, ఇంటర్‌ ఫలితాలు గురువారం విడుదల చేసినట్లు జిల్లా పరీక్షల విభాగం ఏడీ లాజర్‌ తెలిపారు. ఓపెన్‌ ఇంటర్మీడియట్‌లో 1,525మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 888మంది పాసై 58.23% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 15వ స్థానం సాధించినట్లు పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్షలు రాసిన 703మంది విద్యార్థుల్లో 249 మంది పాసై 35.42% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 19వస్థానం సాధించారని తెలిపారు.

News April 26, 2024

అనంత: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

బుక్కపట్నం మండలం లింగప్ప గారి పల్లి గ్రామ సమీపంలో గురువారం రాత్రి ఆటో, బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని స్థానికులు పుట్టపర్తి ఆసుపత్రికి తరలించారు. అందులో వెంకట నరసా నాయుడు, ప్రభాకర్ మృతి చెందినట్లు తెలిపారు. మరో వ్యక్తి శ్రీరాములు చికిత్స పొందుతున్నారు. ఒకే గ్రామంలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News April 26, 2024

28న తాడిపత్రికి సీఎం జగన్ రాక..

image

అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఖరారైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 28వ తేదీన ఉదయం 10 గంటలకు తాడిపత్రి పట్టణంలో పర్యటించనున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసీల రఘురాం ప్రకటన విడుదల చేశారు. తాడిపత్రిలో బహిరంగ సభ అనంతరం వెంకటగిరికి వెళ్లనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

News April 26, 2024

సత్యసాయి జిల్లాకు ఇద్దరు జనరల్ అబ్జర్వర్లు

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సత్యసాయి జిల్లాకు ఇద్దరు జనరల్ ఎన్నికల కమిషన్ నియమించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అన్బుకుమార్, మహారాష్ట్రకు చెందిన దీపక్ రామచంద్ర తివారి గురువారం సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుతో భేటీ అయ్యారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు చేయవచ్చునని సంబంధిత అబ్జర్వర్లు పేర్కొన్నారు.

News April 25, 2024

సత్య సాయి జిల్లా నుంచి ఎమ్మెల్యే స్థానాలకు 231 నామినేషన్లు

image

శ్రీ సత్య సాయి జిల్లాలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల నుంచి 231మంది నామినేషన్లు వేసినట్టు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా పరిధిలోని మడకశిర, హిందూపురం, పెనుకొండ, రాప్తాడు, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే స్థానాలకు 231 మంది నామినేషన్లు వేసినట్లు ఆయన పేర్కొన్నారు.