Anantapur

News October 21, 2024

క్రమ శిక్షణకు మారు పేరు పోలీసులు: కలెక్టర్

image

క్రమశిక్షణకు మారు పేరు పోలీసులు అని అనంతపురం కలెక్టర్ వినోదకుమార్ పేర్కొన్నారు. అనంతపురంలో జరిగిన పోలీసు అమరవీరుల దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తున్నారని తెలిపారు. పోలీసుల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేమని తెలిపారు. ప్రజలను కాపాడుతున్న పోలీసులకు ఆయన సెల్యూట్ చేశారు.

News October 21, 2024

ATP: హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

image

హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అనంతపురం జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. విజయలక్ష్మి అనే ప్రైవేటు ఉపాధ్యాయురాలిని రుద్రేశ్ అనే వ్యక్తి 2018 సెప్టెంబర్ 5న కూడేరు మండలం ఉదిరిపి కొండ వద్ద హత్య చేశాడు. పలు దఫాల విచారణల అనంతరం నేరం రుజువు కావవడంతో నిందితుడు రుద్రేశ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ తీర్పు చెప్పారు.

News October 21, 2024

రేపు అనంతపురానికి సినీ నటుడు నాగార్జున

image

సినీ నటుడు అక్కినేని నాగార్జున రేపు అనంతపురానికి వస్తున్నారు. నగరంలో రేపు జరగనున్న ఓ జువెలర్స్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ‘నేను అనంతపురం వస్తున్నా. రేపు అందరం కలుసుకుందాం’ అంటూ నాగార్జున ఓ వీడియో విడుదల చేశారు. సూర్య నగర్‌లో రేపు ఉదయం 11:30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. 

News October 21, 2024

రేపు అనంతపురానికి సినీ నటుడు నాగార్జున

image

సినీ నటుడు అక్కినేని నాగార్జున రేపు అనంతపురానికి వస్తున్నారు. నగరంలో రేపు జరగనున్న ఓ జువెలర్స్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ‘నేను అనంతపురం వస్తున్నా. రేపు అందరం కలుసుకుందాం’ అంటూ నాగార్జున ఓ వీడియో విడుదల చేశారు. సూర్య నగర్‌లో రేపు ఉదయం 11:30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. 

News October 21, 2024

అనంతపురంలో కిలో టమాటా రూ.45

image

అనంతపురంలో టమాటా ధరలు నిలకడగా ఉన్నాయి. నగర శివారులోని కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న కిలో గరిష్ఠంగా రూ.45 పలికింది. కనిష్ఠంగా రూ.25, సరాసరి రూ.36తో క్రయవిక్రయాలు జరిగాయి. మరోవైపు ఇటీవల వర్షాలకు జిల్లాలోని పలు మండలాల్లో పంట దెబ్బతినింది.

News October 21, 2024

కుందుర్పి మండలంలో పిడుగు

image

అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో పిడుగు పడింది. కరిగానిపల్లి గ్రామ శివారులోని రామచంద్రప్ప అనే రైతు వ్యవసాయ తోటలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడగా చెట్టు దెబ్బతినింది. భారీ శబ్దానికి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయంతో పరుగులు తీశారు. భయాందోళన చెందారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అలాగే హిందూపురం మండలం పోచనపల్లిలో పిడుగుపాటుకు గురై లక్ష్మయ్య అనే రైతు మృతి చెందిన విషయం తెలిసిందే.

News October 20, 2024

Photo Of The Day: శ్రీబుగ్గ క్షేత్రం

image

అనంతపురం జిల్లాలో దక్షిణ కాశీగా పిలవబడుతూ తాడిపత్రి సమీపంలో పెన్నానది ఒడ్డున వెలసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రం శిల్పకళా సంపదకు నిలయంగా బాసిల్లుతోంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన క్షేత్రంలో శివలింగం నుంచి నీరు ఎల్లప్పుడూ ఉబికి రావడం, అమ్మవారి మండపానికి ఏర్పాటుచేసిన రాతి స్తంభాలు సప్తస్వరాలు పలకడం ఇక్కడ ప్రత్యేకత. సాయంత్రం వేళలో క్షేత్రం ఎలా ఉందో మీరే చూడండి..!

News October 20, 2024

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

image

అనంతపురం జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. తాడిపత్రి మండల పరిధిలోని చుక్కలూరు గ్రామ సమీపంలో తాడిపత్రి-గుత్తి ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 20, 2024

శ్రీసత్యసాయి జిల్లాలో కాల్పుల కలకలం

image

శ్రీసత్యసాయి జిల్లాలో ఆదివారం ఉదయం కాల్పులు కలకలం రేపాయి. నలుగురు వ్యక్తులు రెండు బైకులపై బత్తలపల్లి మండలం రామాపురంలోకి ప్రవేశించారు. ఈక్రమంలో వారి వెనుకే రెండు కార్లలో వచ్చిన వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. వాళ్లు పక్కకు తప్పుకోవడంతో ఎలాంటి గాయాలు కాలేదు. కాల్పులు చేసింది పోలీసులని.. ఆ నలుగురు దొంగలని సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 20, 2024

ఉరవకొండ: అత్త, కోడలి వాంగ్మూలం నమోదు

image

శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో ఈనెల 12న అత్త, కోడలిపై గ్యాంగ్ రేప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై సీరియస్ కావడంతో కేసు విచారణ చురుగ్గా జరుగుతోంది. ఇందులో భాగంగా బాధితులైన అత్త, కోడలిని ఉరవకొండకు శనివారం తీసుకు వచ్చారు. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి దుర్గాకళ్యాణి వారి వాంగ్మూలం నమోదు చేశారు. ఈప్రక్రియను వీడియో రికార్డ్ చేశారు.