Anantapur

News September 11, 2024

రేపటి నుంచి దులీప్‌ ట్రోఫీలో 2 మ్యాచులు

image

దులీప్‌ ట్రోఫీలో భాగంగా గురువారం నుంచి RDT స్టేడియంలోని రెండు మైదానాల్లో మ్యాచులు జరగనున్నాయి. నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇండియా టీం-ఏ, ఇండియా టీం-డీ మ్యాచ్‌ ఆర్డీటీ ప్రధాన స్టేడియంలో జరగనుంది. ఇండియా టీం-బీ, ఇండియా టీం-సీ మధ్య మరో మ్యాచ్‌ క్రీడాగ్రామంలోని రెండో గ్రౌండ్‌లో జరగనుంది. ప్రధాన స్టేడియంలో జరిగే మ్యాచ్‌ వీక్షించేందుకు ప్రేక్షకులకు అవకాశం ఉంటుంది.

News September 11, 2024

అనంత: రానున్న 5 రోజుల్లో తేలికపాటి వర్షాలు

image

రానున్న 5 రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిరు జల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయశంకర్ బాబు, నారాయణ స్వామి తెలిపారు. వచ్చే 5 రోజులు పగటి ఉష్ణోగ్రతలు 33.9 నుంచి 35.2 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 23.5 నుంచి 24.0 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఉదయం పూట గాలిలో తేమ 76 శాతం, మధ్యాహ్నం పూట 45 శాతం నమోదవుతుందన్నారు.

News September 11, 2024

అనంత: విద్యార్థి హత్య కేసు ఛేదించిన పోలీసులు

image

ఆత్మకూరు మండలానికి చెందిన విద్యార్థి సరిత హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఇటుకలపల్లి సీఐ హేమంత్ కుమార్ తెలిపారు. మంగళవారం గుమ్మగట్ట మండలం వెంకటంపల్లికి చెందిన తిప్పేస్వామిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు, వేటకొడవలి స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రేమించాలని యువతిని ఫోన్లో వేధించేవాడని, ఆమె అంగీకరించకపోవడంతో వెంటపడి హత్య చేసినట్లు విచారణలో తేలిందని వెల్లడించారు.

News September 11, 2024

వైద్య సేవలపై రోగులకు ఆరా తీసిన కలెక్టర్

image

అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంగళవారం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని సిటీ స్కాన్, రక్త నిధి కేంద్రం, ఐసీయూ తదితర విభాగాలను ఆయన కలియ తిరుగుతూ సమగ్రంగా పరిశీలించారు. ఆసుపత్రిలోని సమస్యల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు బాగా అందిస్తున్నారని రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు.

News September 11, 2024

ఈ నెల 14 నుంచి స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు: కలెక్టర్

image

ఈ నెల 14 నుంచి సత్యసాయి జిల్లాలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. స్వభావ స్వచ్ఛత-సంస్కార్ స్వచ్ఛత పేరుతో హి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు 14 నుంచి 17 వరకు సన్నద్ధత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

News September 10, 2024

13వ తేదీ లోపు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి చేయండి: కలెక్టర్

image

ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఆయా శాఖల పరిధిలో ఈ నెల 13వ తేదీ లోపు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్లో మంగళవారం జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆల్‌ ఇండియా రేడియోలో ప్రతి గురువారం ఉదయం 7:45 గంటల నుంచి 8:15 గంటల వరకు ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేసే ఏర్పాటు చేయాలన్నారు.

News September 10, 2024

శ్రీ సత్యసాయి జిల్లాను మాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ జిల్లాగా ఎంపిక

image

శ్రీ సత్యసాయి జిల్లాను మాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ జిల్లాగా ప్రకటించారని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్లు, ఇన్-సానిటరీ లెట్రిన్లు లేవని జిల్లా పంచాయతీ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల నుంచి నివేదికలు అందాయన్నారు. దీంతో సత్య సాయి జిల్లాను మ్యాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ జిల్లాగా ప్రకటించారన్నారు.

News September 10, 2024

వరద బాధితులకు అనంతపురం ఎమ్మెల్యే రూ.10లక్షల విరాళం

image

విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సాయం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితులకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అండగా నిలిచారు. తన వంతు రూ.10 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు చెక్కును సీఎం చంద్రబాబు నాయుడికి అందజేశారు. సీఎం ఎమ్మెల్యే దగ్గుపాటిని అభినందించారు.

News September 10, 2024

అనంతపురం చేరుకున్న భారత్-ఏ, బీ జట్ల ప్లేయర్లు

image

అనంతపురంలో దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ క్రికెట్ పోటీలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. బెంగళూరులో తొలి మ్యాచ్ ఆడిన భారత్-ఏ, బీ జట్లు నిన్న రాత్రి అనంతపురానికి చేరుకున్నాయి. కేఎల్ రాహుల్, దూబే, పంత్, మయాంక్, రియాన్ పరాగ్ తదితర క్రికెటర్లకు హోటళ్లలో ఘన స్వాగతం పలికారు. క్రికెట్లరను చూడటానికి అభిమానులు హోటల్ వద్ద పడిగాపులు కాశారు. క్రికెటర్లు బస చేసే హోటళ్ల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

News September 10, 2024

తాడిపత్రిలో అగ్నిప్రమాదం

image

తాడిపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఓ షాపింగ్ మాల్‌లో మంటలు ఎగసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.