Anantapur

News April 25, 2024

అనంత: దైవ దర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

image

డీ.హీరేహాళ్ మండలం కర్ణాటక సరిహద్దులోని జజిరికల్ టోల్ ప్లాజా సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన ఐదుగురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు దైవదర్శనం నిమిత్తం మంత్రాలయానికి కారులో ప్రయాణిస్తూ ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. ఇద్దరికి తీవ్ర, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ నందీశ్ అనే వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై గురుప్రసాద్ రెడ్డి తెలిపారు.

News April 25, 2024

వైసీపీ కర్నూలు పార్లమెంట్ పరిశీలకుడిగా గోరంట్ల మాధవ్

image

వైసీపీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల పరిశీలకుడిగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలలో మరోసారి వైసీపీని గెలిపించేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు.

News April 25, 2024

అనంత: వైసీపీ ఎమ్యెల్యే అభ్యర్థి ఆస్తి రూ.లక్షే

image

శింగనమల వైసీపీ ఎమ్యెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు తన నామినేషన్ అఫిడవిట్‌కు సంబంధించి చరాస్తుల విలువ రూ.1,06,195గా పేర్కొన్నారు. అలాగే తనపై ఎటువంటి స్థిరాస్తులు, అప్పులు లేనట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. 2014లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు.

News April 25, 2024

హిందూపురం పార్లమెంటు నుంచి 6 నామినేషన్లు: కలెక్టర్

image

హిందూపురం పార్లమెంటు నుంచి బుధవారం ఆరుగురు నామినేషన్లు వేసినట్టు సత్యసాయి జిల్లా రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. ఆర్ఎస్పీ పార్టీ నుంచి ఏ.శ్రీనివాసులు, నేషనల్ నవ క్రాంతి నుంచి ధనుంజయ బూదిలి, స్వతంత్ర అభ్యర్థిగా కుల్లాయప్ప, కాంగ్రెస్ పార్టీ నుంచి షాహిన్, వైసీపీ నుంచి శాంత, బీఎస్పీ నుంచి భాగ్య నామినేషన్లు వేసినట్టు ఆయన పేర్కొన్నారు.

News April 25, 2024

ఇండియన్ రైల్వేస్‌లో సెకండ్ బెస్ట్ లోకో షెడ్‌గా గుత్తి

image

ఇండియన్ రైల్వేస్‌లోని డీజిల్ లోకో షెడ్ నందు త్రీ ఫేజ్ జీ-9 ఎలక్ట్రికల్ ఇంజిన్ల నిర్వహణలో గుత్తి లోకో డీజిల్ షెడ్ సెకండ్ బెస్ట్ డీజిల్ షెడ్‌గా ఎంపికైంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జై షీల్డ్ బహుకరించారు. గుత్తి డీజిల్ షెడ్ సీనియర్ డీఎంఈ రమేష్ షీల్డ్ అందుకున్నారు.

News April 25, 2024

ఉద్యోగులు 26వ తేదీలోగా ఫామ్-12ను సమర్పించండి: విద్యాశాఖ అధికారి

image

ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు ఈనెల 26వ తేదీ లోపు ఫామ్-12ను సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి తెలిపారు. ఎన్నికలలో విధులు నిర్వర్తించడానికి ఉత్తర్వులు పొందిన ఉద్యోగులు ఫామ్-12ను సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్‌కు అందించి పోస్టల్ బ్యాలెట్ పొందాలన్నారు. 26వ తేదీ లోపల అందించని పక్షంలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను కోల్పోతారన్నారు.

News April 25, 2024

గుండెపోటుకు గురై ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి

image

గుండెపోటుకు గురై ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి చెందాడు. అనంతపురం నార్పల మండలంలోని నాయనపల్లి సమీపంలో తాడిపత్రి -అనంతపురం ప్రధాన రహదారిపై బస్సు ఆపి డ్రైవర్ ఓబుల్ రెడ్డి కుప్పకూలిపోయాడు. వెంటనే అంబులెన్స్‌లో అనంతపురానికి తరలించగా అక్కడ మృతిచెందాడు. విధుల్లో భాగంగా తాడిపత్రి తాడిపత్రి నుంచి ధర్మవరం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

News April 25, 2024

సత్యసాయి జిల్లాలో 43 మంది నామినేషన్ల దాఖలు

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి 43 మంది నామినేషన్లు వేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. రాప్తాడు నియోజకవర్గం నుంచి ఆరుగురు, మడకశిర నుంచి 10 మంది, హిందూపురం నుంచి నలుగురు, పెనుకొండ నుంచి ఐదుగురు, పుట్టపర్తి నుంచి ఏడుగురు, ధర్మవరం నుంచి 8 మంది, కదిరి నుంచి ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్లు వేశారని పేర్కొన్నారు.

News April 25, 2024

హిందూపురం ఎంపీ అభ్యర్థిగా షాహీన్ నామినేషన్ దాఖలు

image

హిందూపురం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున షాహీన్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలోని రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబుకు తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. సాదాసీదాగా ఆయన నామినేషన్ కార్యక్రమం కొనసాగింది. సినీయర్ నాయకుడు బాలాజీ మనోహర్ ఆయన వెంట వచ్చారు.

News April 25, 2024

అనంత: ఇంటర్ ఫలితాలలో..470కి 464 మార్కులు

image

అనంతపురం నగరానికి చెందిన మసప్పగారి సంజనరెడ్డి బుధవారం విడుదల చేసిన తెలంగాణ ఇంటర్ ఫలితాలలో మంచి ప్రతిభ కనబరిచింది. సంజనరెడ్డి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలలో 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించింది. ఆమె తల్లిదండ్రులు ఎం.మధుసూదన్ రెడ్డి, పి.ప్రార్థన రెడ్డిలు నగరంలోని నీరుగంటి వీధిలో నివాసం ఉంటూ వృత్తిరీత్యా ప్రైవేట్ విద్యారంగంలో పనిచేస్తున్నారు.