Anantapur

News October 20, 2024

‘అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీల్లో ఒకటిగా బీజేపీ’

image

ధర్మవరంలోని బీజేపీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్య, మంత్రి సత్యకుమార్, తదితరులు హాజరయ్యారు. లాల్ సింగ్ ఆర్య మాట్లాడుతూ.. 45 రోజుల్లోనే 9 కోట్లకు పైగా సభ్యత్వాలతో ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీల్లో ఒకటిగా బీజేపీ నిలిచిందన్నారు.

News October 19, 2024

మీ ఊర్లో ‘పల్లె పండుగ’ జరిగిందా!

image

గ్రామాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన ‘పల్లె పండుగ’ కార్యక్రమం రేపటితో పూర్తవనుంది. ఈ నెల 14 నుంచి గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు అధికారులు, నేతలు శంకుస్థాపన చేశారు. ఆగస్టు 23న గ్రామ సభలో ప్రతిపాదించిన పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ₹4500కోట్లు కేటాయించగా పలుచోట్ల పనులు ప్రారంభమయ్యాయి. మరి మీ ఊర్లో పల్లె పండుగ కార్యక్రమం జరిగిందా? అభివృద్ధి పనులు మొదలయ్యాయా.. కామెంట్ చేయండి..

News October 19, 2024

జాక్‌పాట్ కొట్టిన గుత్తి యువతి

image

గుత్తి యువతి జాక్‌పాట్ కొట్టారు. భారీ ప్యాకేజీతో జాబ్ దక్కించుకున్నారు. గుత్తిలోని ప్రభుత్వ న్యాయవాది తిమ్మారెడ్డి, పార్వతి దంపతుల కుమార్తె జ్యోత్స్న అమెరికాలోని బ్రిడ్జ్ ఫోర్ట్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశారు. క్యాంపస్ ప్లెస్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొనగా విన్నే బాగో అనే కంపెనీ ఏడాదికి రూ.1.20కోట్ల ప్యాకేజీ ఆఫర్ చేసింది. ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రులు చెప్పారు. దీంతో నెటిజన్లు విషెస్ చెబుతున్నారు.

News October 19, 2024

మీ ఊర్లో ‘పల్లె పండుగ’ జరిగిందా!

image

గ్రామాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన ‘పల్లె పండుగ’ కార్యక్రమం రేపటితో పూర్తవనుంది. ఈ నెల 14 నుంచి గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు అధికారులు, నేతలు శంకుస్థాపన చేశారు. ఆగస్టు 23న గ్రామ సభలో ప్రతిపాదించిన పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ₹4500కోట్లు కేటాయించగా పలుచోట్ల పనులు ప్రారంభమయ్యాయి. మరి మీ ఊర్లో పల్లె పండుగ కార్యక్రమం జరిగిందా? అభివృద్ధి పనులు మొదలయ్యాయా.. కామెంట్ చేయండి..

News October 19, 2024

అనంతపురం జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్‌గా మిథున్ రెడ్డి

image

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఇటీవల అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు అధ్యక్షులుగా అనంత వెంకటరామిరెడ్డి, ఉషశ్రీ చరణ్‌ను నియమించగా తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్‌గా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే మిథున్ రెడ్డి జిల్లా నేతలతో సమావేశమయ్యే అవకాశముంది.

News October 19, 2024

నేడు అనంతపురం జెడ్పీ సర్వసభ్య సమావేశం

image

అనంతపురం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఇవాళ ఉ. 10.30 గంటలకు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జడ్పీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రులు పయ్యావుల కేశవ్‌, సవిత, సత్యకుమార్‌ యాదవ్‌ సహా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులతో పాటు జిల్లా స్థాయి అధికారులు హాజరుకానున్నారని చెప్పారు. వ్యవసాయం, రహదారులపై చర్చ జరిగే అవకాశం ఉంది.

News October 19, 2024

సత్యసాయి: నవంబర్ 10 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

image

నవంబర్ 10 నుంచి 15 వరకు అగ్ని వీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గుంటూరు, కడప జిల్లా కేంద్రాల్లో 10వ తేదీ నుంచి అగ్ని వీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, ఆఫీస్ అసిస్టెంట్, ట్రేడ్ మాన్ తదితర వాటికి రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన అభ్యర్థులు ర్యాలీలో పాల్గొనవచ్చునన్నారు.

News October 18, 2024

బ్రహ్మసముద్రం: అంగన్వాడీలో చిన్నారులపై కుల వివక్ష

image

అంగన్వాడీలో చిన్నారుల పట్ల కులవివక్ష చూపించిన ఘటన బ్రహ్మసముద్రం మండలంలో జరిగింది. పడమటి కోడిపల్లి అంగన్వాడీకి సొంత భవనం లేకపోవడంతో ఓ అద్దె ఇంటిలో కేంద్రం ఏర్పాటు చేశారు. కాగా ఇంట్లోకి ఎస్సీ, ఎస్టీ పిల్లలు రావద్దని ఇంటి యజమాని సిబ్బందికి చెప్పారు. దీంతో సిబ్బంది పిల్లలను బయట కూర్చొబెట్టారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా CDPO లక్ష్మీ ప్రసన్న, పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

News October 18, 2024

పుట్టపర్తి: కేంద్ర మంత్రికి స్వాగతం పలికిన జేసీ

image

కేంద్ర మంత్రి మురుగన్ శుక్రవారం పుట్టపర్తిలోని సత్యసాయి బాబా సమాధి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలోని శాంతిభవన్ అతిథి గృహం వద్ద జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం బాబా సమాధిని దర్శించుకున్నారు. వారితో పాటు పలువురు అధికారులు ఉన్నారు.

News October 18, 2024

శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం: ATP కలెక్టర్

image

షికారీలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి తగిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం నగరంలోని ఆర్డీటి సమ్మిళిత ఉన్నత పాఠశాలలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పరివర్తన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల వారికి మేలు చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేసినప్పటికీ కొన్ని కారణాలవల్ల కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి నోచుకోలేదన్నారు.