India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం జిల్లాలో మహిళా నిరుద్యోగులకు రూడ్ సెట్ శుభవార్త చెప్పింది. మహిళలకు జర్దోసి, మగ్గం, బ్యూటీషియన్ కోర్సుల్లో నవంబర్ 15 నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ లక్ష్మీదేవి పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. శిక్షణ కాలం 30 రోజులు ఉంటుందని, ఉచిత భోజనం, వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు అనంతపురంలోని కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

అనంతపురం జిల్లాలో మహిళా నిరుద్యోగులకు రూడ్ సెట్ శుభవార్త చెప్పింది. మహిళలకు జర్దోసి, మగ్గం, బ్యూటీషియన్ కోర్సుల్లో నవంబర్ 15 నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ లక్ష్మీదేవి పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. శిక్షణ కాలం 30 రోజులు ఉంటుందని, ఉచిత భోజనం, వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు అనంతపురంలోని కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

గుంతకల్లులో రైల్వే <<14386362>>ఉద్యోగి<<>> మధుసూదన్ బలవన్మరణానికి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలే కారణమని తెలుస్తోంది. పోలీసుల వివరాల మేరకు.. ప్రొద్దుటూరుకు చెందిన మధుసూదన్ మొదటి భార్య చనిపోగా హేమవతిని రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన గుంతకల్లులో సీనియర్ క్లర్క్గా పనిచేస్తున్నారు. దసరాకు ఊరికి వెళ్దామని భార్యను పిలవగా ఆమె రాలేదు. కొద్దిరోజులుగా వీరి మధ్య మాటల్లేవు. ఈ క్రమంలో ఉరేసుకుని మృతి చెందారు.

అనంతపురం జిల్లాలో మహిళా నిరుద్యోగులకు రూడ్ సెట్ శుభవార్త చెప్పింది. మహిళలకు జర్దోసి, మగ్గం, బ్యూటీషియన్ కోర్సుల్లో నవంబర్ 15 నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ లక్ష్మీదేవి పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. శిక్షణ కాలం 30 రోజులు ఉంటుందని, ఉచిత భోజనం, వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు అనంతపురంలోని కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతిచెందారు. కదిరి మండలంలో నిన్న సాయంత్రం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో కాళసుముద్రం గ్రామానికి చెందిన జయరాం (49) గేదెలను తోలుకొని ఇంటికి వచ్చే సమయంలో పిడుగుపాటుకు గురయ్యారు. గాయపడిన ఆయన్ని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తరలిస్తుండగా అప్పటికే మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది.

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్ఛార్జులతో నేడు సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉ.11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. మద్యం, ఇసుక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు సీఎం స్పష్టం చేయనున్నారు. అలాగే జిల్లాలో పార్టీ బలోపేతంపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశం కోసం ఇప్పటికే నేతలు విజయవాడ చేరుకున్నారు.

కర్ణాటక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షానికి చిత్రావతి నదిలో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని పరగోడు డ్యాం దాదాపు 80 శాతం నిండినట్లు తెలిసిందని అన్నారు. ఎగువ నుంచి వచ్చే వరదకు చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహించే అవకాశం ఉందని, ప్రజలెవరూ ఇసుక కోసం నదీ పరివాహక ప్రాంతానికి వెళ్లొద్దని సూచించారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో మూడ్రోజుల నుంచి జోరు వానలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు లేపాక్షి మండలం మామిడిమాకుల పల్లి గ్రామంలో హరిజన నారాయణప్పకు చెందిన ఇల్లు కూలింది. ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుండటంతో పాత ఇంటి పైకప్పు నాని కుప్ప కూలిందని బాధితుడు తెలిపారు. అలాగే గుత్తి చెర్లోపల్లి కాలనీలో రహమత్ బీ అనే మహిళ ఇల్లు పైకప్పు నేలకూలింది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా బీసీ రక్షణ చట్టం రూపొందిస్తున్నట్లు మంత్రి సవిత స్పష్టం చేశారు. బుధవారం అమరావతిలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ చట్టం రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు రక్షణ కవచంలాంటిదన్నారు. సీఎం చంద్రబాబు గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి బీసీ డిక్లరేషన్లో పేర్కొన్న అంశాలను అమలు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు.

అనంతపురంలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతోత్సవాలలో భాగంగా గుత్తి రోడ్ లో ఉన్న బల్లా కన్వెన్షన్ హాల్లో గురువారం జరగబోయే రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతోత్సవం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. అనంతరం పాతవూరు పవర్ ఆఫీస్ వద్ద ఉన్న వాల్మీకి విగ్రహం వద్ద ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.
Sorry, no posts matched your criteria.