India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పదో తరగతి పరీక్షల ఫలితాలలో కొత్తచెరువు మండలంలో వనం గాయత్రి అనే విద్యార్థిని 589 మార్కులు సాధించింది. బాలిక బుక్కపట్నం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన రామంజి కుమార్తె. గాయత్రి మండల కేంద్రమైన కొత్తచెరువులో చదువుతోంది.
వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో శ్రీసత్యసాయి జిల్లాలో 2012 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. జిల్లాలో మొత్తం 9187మంది వాలంటీర్లు ఉండగా ఇప్పటివరకు 2012 మంది రాజీనామా చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. వారిలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన 69మందిని తొలగించినట్లు పేర్కొన్నారు. దీంతో మెుత్తం 2072 మంది అయ్యారు.
తాడిపత్రిలో జేసీ పవన్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మురళి కృష్ణ తెలిపారు. పట్టణంలో 19న టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి నామినేషన్ సందర్భంగా యువకులు రెండు దొంగ ఓట్లు వేసి అయినా టీడీపీని గెలిపించాలని చేసిన వ్యాఖ్యలపై ఎంసీసీ టీం ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ రాంమోహన్ ఫిర్యాదు మేరకు జేసీ పవన్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న నాగరాజు గుండెపోటుతో అదివారం మృతిచెందారు. చిలమత్తూరులో గుండెపోటుకు గురి కావడంతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు సన్నిహితులు తెలిపారు. విషయం తెలుసుకున్న సన్నిహితులు సంతాపం వ్యక్తం చేశారు.
పుట్టపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని వడ్డెర సంఘం నాయకులు దళవాయి సిమెంట్ పోలన్న పేర్కొన్నారు. ఆదివారం ఆయన పుట్టపర్తిలో మాట్లాడుతూ.. ఎన్నికలలో వడ్డెరలకు సముచిత స్థానం కల్పిస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాయమాటలు చెప్పి చివరిలో మోసం చేశారని అన్నారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వడ్డెర్ల సత్తా చూపిస్తామన్నారు.
రొళ్ల మండల రంగాపురం క్రాస్ అలుపునపల్లి సమీపంలో బైక్లో ఇద్దరు యువకులు వెళ్తుండగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక ప్రాంతం మధుగిరి తాలూకాకు చెందిన వారికిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనంతపురం జిల్లాలో టీడీపీ తరుఫున ఎన్నికల బరిలో నిలలిచిన అభ్యర్థులకు చంద్రబాబు బీఫామ్స్ అందించారు. వారిలో బండారు శ్రావణి (శింగనమల), దగ్గుపాటి ప్రసాద్ (అనంతపురం), గుమ్మనురు జయరాం (గుంతకల్), అమిలినేని సురేంద్ర బాబు (కల్యాణ దుర్గం), అంబికా లక్మి నారాయణ (అనంతపురం ఎంపీ అభ్యర్థి) చంద్రబాబు చేతుల మీదగా బీఫాం అందుకున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి దిశ నిర్దేశం చేశారు.
సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఎమ్మెస్ రాజుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అవకాశం కల్పించారు. ఈ మేరకు బీఫామ్ ఆయన చేతికి ఆదివారం అందించినట్లు మడకశిర టీడీపీ నాయకులు తెలిపారు. ఇంతకు ముందు డాక్టర్ సునీల్ కుమార్కు పార్టీ టికెట్ కేటాయించింది. మార్పులు చేర్పుల్లో భాగంగా మడకశిర టికెట్ను ఎమ్మెస్ రాజుకు కేటాయించారు.
అనంతపురం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లోని జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఫోన్ ద్వారా ఫిర్యాదులు తెలియజేయవచ్చని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్ కుమార్ తెలిపారు. సెక్టోరియల్ అధికారుల పర్యవేక్షణ కోసం 08554-232922, 6300907233, పోలింగ్ సిబ్బంది పర్యవేక్షణ కోసం 08554 – 231922, 6300923894 నెంబర్లు ఏర్పాటు చేశామన్నారు.
ఉరవకొండ-గుంతకల్లు ప్రధాన రహదారిలోని గూళ్యపాళ్యం శివారులో శనివారం ట్రాక్టరు నుంచి కిందపడి కొనకొండ్లకు చెందిన విశ్వాసరావు(19) మృతి చెందాడు. అతడు శుక్రవారం తరిమెల గ్రామంలో మిత్రుడి వివాహానికి హాజరయ్యాడు. శనివారం గ్రామానికి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ నుంచి జారి కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై నరేశ్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.