Anantapur

News April 21, 2024

జిల్లాలో స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు

image

అనంతపురం జిల్లాలో శనివారం పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గినట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. యాడికిలో అత్యధికంగా 40.4 డిగ్రీలు, శింగనమలలో 39.5, నంబులపూలకుంట 39.4, ధర్మ వరం 38.7, కదిరి 38.5, తాడిపత్రి 38.4, అనంతపురం 38, యల్ల నూరు 37.9, తనకల్లు 37.7, కనగానపల్లి, గాండ్లపెంట 37.5, రాప్తాడు 37. 4, పుట్లూరు 37. 3 డిగ్రీలుగా నమోదైందన్నారు.

News April 21, 2024

అనంత: పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి

image

పుట్టపర్తి మండలం దిగువ చెర్లోపల్లికి చెందిన ఆకుల వీరప్ప పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. శనివారం సాయంత్రం మేకలను మేపుకొని ఇంటికి వస్తుండగా వర్షం రావడంతో వీరప్ప మర్రిచెట్టు కిందకి వెళ్ళాడు. ఆ సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో వీరప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News April 21, 2024

అనంత: పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి

image

పుట్టపర్తి మండలంలోని దిగువ చెర్లోపల్లికి చెందిన ఆకుల వీరప్ప పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. శనివారం సాయంత్రం మేకలను మేపుకొని ఇంటికి వస్తుండగా వర్షం రావడంతో వీరప్ప మర్రిచెట్టు కిందకి వెళ్ళాడు. ఆ సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో ఆకుల వీరప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News April 21, 2024

రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ఆస్తుల వివరాలు

image

➤ అసెంబ్లీ: రాప్తాడు
➤ భర్త: పరిటాల రవీంద్ర
➤ విద్యార్హతలు: 8వ తరగతి పాస్
➤ చరాస్తి విలువ: రూ. 2.50 లక్షలు
➤ స్థిరాస్తులు రూ.28.53 కోట్లు
➤ కేసులు: 8
➤ అప్పులు: రూ.31.68
➤ బంగారం: 750 గ్రాముల
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.

News April 21, 2024

సరిహద్దు చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఎస్పీ

image

గుమ్మఘట్ట మండలం కొత్తపల్లికుంట దొడ్డి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టును అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెహికల్ మూవ్మెంట్ రిజిస్టర్‌ను పరిశీలించారు. కర్నాటక నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చెక్ పోస్టు గుండా వెళ్లొచ్చే రహదారికి ప్రత్యామ్నాయంగా ఉన్న దారులపై ప్రత్యేక నిఘా వేసి అక్రమాలకు కళ్లెం వేయాలన్నారు.

News April 20, 2024

మూడో రోజు 14 నామినేషన్లు దాఖలు: కలెక్టర్

image

రాప్తాడు, హిందూపురం, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, మడకశిర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు 14 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 3వ రోజు హిందూపురం పార్లమెంటుకు సంబంధించి 4 సెట్లు నామినేషన్ దాఖలు అయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మూడో రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగిందన్నారు.

News April 20, 2024

శ్రీ సత్యసాయి: రైలు కిందపడి వ్యక్తి మృతి

image

ధర్మవరం పట్టణం డీఎల్ఆర్ కాలనీ సమీపంలో శనివారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సంఘటనా ప్రదేశానికి వెళ్లి పరిశీలించి గుర్తు తెలియని వ్యక్తిగా గుర్తించి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుని బంధువులు ఎవరైనా ధర్మవరం రైల్వే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

News April 20, 2024

రాప్తాడు అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోతుల నాగరాజు

image

రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ఈ నెల 24వ తేదీన నామినేషన్ వేస్తానని రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు డా.పోతుల నాగరాజు తెలిపారు. శనివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, రాజ్యాంగ ఫలాలు ప్రజలకు దక్కాలనే ఉద్దేశంతో నామినేషన్ వేస్తున్నానని తెలిపారు.

News April 20, 2024

అనంత: పిల్లల మధ్య చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు

image

టీడీపీ అధినేత చంద్రబాబు పిల్లల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. రాయదుర్గం నియోజక వర్గం కనేకల్ క్యాంపు సైట్‌లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులుతో కలిసి జరుపుకొన్నారు. కేకులు కత్తిరించి పిల్లలకి పంపిణీ చేశారు. పిల్లలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

News April 20, 2024

సీఎం జగన్ అనంత జిల్లాకు ఏం చేశారు: చంద్రబాబు

image

టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం రాత్రి కనేకల్లులో ప్రజాగళం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ బిడ్డను అని చెప్పుకొనే జగన్.. ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలన్నారు. టీడీపీ హాయంలో రూ.4,500కోట్లతో హంద్రీనీవా ప్రారంభించామన్నారు. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి తుంగభద్ర నుంచి హెచ్‌ఎల్సీ నీరు తెచ్చామన్నారు. బైరవానితిప్ప, ఉంతకల్లు ప్రాజెక్టులపై జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.