Anantapur

News October 14, 2024

ATP: నేడే లాటరీ.. కిక్కు ఎవరికో

image

మద్యం షాపులను నేడు లాటరీ ద్వారా కేటాయించనున్నారు. అనంతపురం జిల్లాలోని 136 దుకాణాలకు 3,265, శ్రీ సత్యసాయి జిల్లాలోని 87 షాపులకు 1,518 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కేంద్రంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియను ప్రారంభిస్తారు. ప్రతి దుకాణదారుడికి ఒక నంబర్ కేటాయించి, మాన్యువల్‌గా లాటరీ తీస్తారు. నంబర్ వచ్చిన దరఖాస్తుదారుకు లైసెన్సు కేటాయిస్తారు. వారు ఈ నెల 16 నుంచి వైన్ షాపులు ప్రారంభించుకోవచ్చు.

News October 14, 2024

ATP: తగ్గిన టమాటా దిగుబడి.. కిలో రూ.55

image

జిల్లాలో టమాటా దిగుబడి తగ్గింది. అనంతపురం గ్రామీణ పరిధి కక్కలపల్లి మార్కెట్‌లోని అన్ని మండీలకు కలిపి ఆదివారం 225 టన్నుల టమాటాలు మాత్రమే వచ్చాయి. దసరా పండుగ నేపథ్యంలో రైతులు మార్కెట్‌కు తీసుకురానట్లు తెలుస్తోంది. కాగా మార్కెట్లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.55తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ తెలిపారు. కిలో సరాసరి ధర రూ.44, కనిష్ఠ ధర రూ.36 పలికినట్లు తెలిపారు.

News October 14, 2024

విద్యాశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి: డీఈఓ

image

అనంతపురం జిల్లాలో మండల విద్యాశాఖ అధికారులు రానున్న మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మి తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన భవనాల్లో పాఠశాల నిర్వహించకుండా చూడాలన్నారు .అదేవిధంగా పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే రహదారుల్లో వంకలు, వాగులు ఉండే పాఠశాలలను ముందుగా గుర్తించి ఇబ్బంది పడకుండా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు.

News October 13, 2024

‘మద్యం దుకాణాల లాటరీ సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు’

image

పుట్టపర్తిలో సోమవారం జరిగే మద్యం దుకాణాల లాటరీ సందర్భంగా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. ఆదివారం రాత్రి పోలీస్, ఎక్సైజ్ అధికారులతో ఎస్పీ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. టెండర్ల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమ నిబంధనల గురించి తెలిపారు. మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.

News October 13, 2024

గొల్లపల్లి రిజర్వాయర్‌లో పడి వ్యక్తి మృతి

image

పెనుకొండ మండల పరిధిలోని గొల్లపల్లి రిజర్వాయర్‌లో పడి హిందూపురం మండలం లింకంపల్లి గ్రామానికి చెందిన హానిస్ ఖాన్(42) ఆదివారం మృతిచెందారు. ఎస్ఐ రాజేశ్ వివరాల మేరకు.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి గొల్లపల్లి రిజర్వాయర్‌కు వెళ్లి ప్రమాదవశాత్తూ కాలు జారి అందులో పడిపోయాడు. స్నేహితులు, కుటుంబ సభ్యులు కాపాడే లోపే మరణించినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News October 13, 2024

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్టు కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. రేపటి నుంచి 16వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక అధికారులు ఆయా మండలాల్లో ఉండాలని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ వారం రద్దు చేసినట్లు తెలిపారు.

News October 13, 2024

అనంత జిల్లాలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతి వేడుకలు: మంత్రి లోకేశ్

image

అనంతపురం జిల్లాలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతిని నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. టీడీపీ బీసీల పుట్టినిల్లు అన్నారు. వారి ఆత్మ గౌరవాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని చంద్రబాబు నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ఈనెల 17న అధికారికంగా అన్ని జిల్లా కేంద్రాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

News October 13, 2024

చిలమత్తూరు: గ్యాంగ్ రేప్ చేసింది వాళ్లేనా..?

image

శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో అత్త, కోడలిపై గ్యాంగ్ రేప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. హిందూపూర్‌కు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారని తెలుస్తోంది. నిందితులంతా చిల్లర దొంగలని సమాచారం.

News October 13, 2024

గ్యాంగ్ రేప్‌ బాధాకరం: పయ్యావుల

image

బళ్లారి నుంచి ఉపాధి కోసం వచ్చి చిలమత్తూరు మండలం నల్లబొమ్మినిపల్లిలో అత్తా కోడలిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు. పొట్టకూటి కోసం వచ్చిన అత్తా కోడలిపై గ్యాంగ్ రేప్ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇది అత్యంత బాధాకరమని చెప్పారు.

News October 13, 2024

మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ జేఎన్టీయూకు మార్పు

image

అనంతపురం జిల్లా మద్యం షాపులకు ఎంపిక ప్రక్రియ కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ భవన్ నుంచి జేఎన్టీయూకు మార్చామని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. జేఎన్టీయూలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో సోమవారం ఉదయం 7 గంటలకు లాటరీ ద్వారా మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నమని తెలిపారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందన్నారు.