Anantapur

News April 20, 2024

ఉషశ్రీ చరణ్ ఆస్తుల వివరాలు

image

ఉషశ్రీ చరణ్‌కు రూ.4.16 కోట్ల చరాస్తులు, రూ.1.54 కోట్ల స్థిరాస్తులున్నాయి. 5.27 కేజీల బంగారం, 78 కిలోల వెండి ఉంది. 2 క్రిమినల్ కేసులున్నాయి. భర్త శ్రీచరణ్ స్థిర,చరాస్తులు రూ.44.93, 1.607 కేజీల బంగారం, 48 కిలోల వెండి, ఓ బస్సు, ఇతర వాహనాలు ఉన్నాయి. 2019 అఫిడవిట్ ప్రకారం ఉష స్థిర,చరాస్తులు రూ.1.52కోట్లు, 4.150 కేజీల బంగారం ఉంది. ఆమె భర్త స్థిర, చరాస్తులు రూ.7.61కోట్లు. 1.5కేజీల బంగారం ఉంది.

News April 20, 2024

జేసీ అస్మిత్ రెడ్డి ఆస్తుల వివరాలు ఇలా..!

image

తాడిపత్రిలో నామినేషన్ మొదలైన తొలిరోజు పలు పార్టీల అభ్యర్థులు వారి ఆస్తి, విద్యార్హత, కేసుల వివరాల ఆఫిడవిట్ దాఖలు చేశారు. ఆ వివరాలు సంక్షిప్తంగా ఇలా..
అభ్యర్థి : జెసి అస్మిత్ రెడ్డి 
 పార్టీ : టీడీపీ
నియోజకవర్గం: తాడిపత్రి 
విద్యార్హత: ఎంబీఏ, స్కాట్లాండ్ 
కేసులు: 30 
చరాస్తులు : రూ. 27.75కోట్లు
 స్థిరాస్తులు:రూ.147 కోట్లు 
అప్పులు: 26.87 కోట్లు 
బంగారం: 604 గ్రాములు, వజ్రాలు

News April 20, 2024

అనంత: 21న నీట్, ఐఐటీ అకాడమీల్లో ప్రవేశ పరీక్ష

image

సాంఘిక సంక్షేమ అంబేడ్కర్
గురుకులాల ప్రవేశ పరీక్షలో ప్రతిభను కనబరిచిన విద్యార్థులు రెండో విడతలో నీట్, ఐఐటీ అకాడమీల్లో ప్రవేశానికి ఈనెల 21న నిర్వహించనున్న పరీక్షకు హాజరు కావాలని ఉమ్మడి జిల్లా గురుకుల విద్యాలయాల సమన్వయకర్త ఎ.మురళీకృష్ణ తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రానికి గుర్తింపు కార్డు లేదా ఆధార్‌తో హాజరు కావాలన్నారు. ఉదయం 10 నుంచి పరీక్ష కురుగుంట గురుకులంలో జరుగుతుందన్నారు.

News April 20, 2024

అనంత: నాడు ప్రత్యర్థులు.. నేడు సన్నిహితులు

image

హిందూపురం నియోజకవర్గంలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్న ఇక్బాల్, నందమూరి బాలకృష్ణ 2024 ఎన్నికల్లో స్నేహితులయ్యారు. గత ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వైసీపీని వీడి టీడీపీలో చేరి ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు ప్రచారాల్లో పాల్గొననున్నారు.

News April 19, 2024

సత్యసాయి జిల్లాలో 16 మంది నామినేషన్ల దాఖలు

image

శ్రీ సత్య సాయి జిల్లాలోని రాప్తాడు, మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాల నుంచి 16మంది నామినేషన్లు వేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. రాప్తాడు నుంచి ముగ్గురు, మడకశిర నుంచి ఒకరు, హిందూపురం నుంచి ఇద్దరు, పెనుకొండ నుంచి ఇద్దరు, పుట్టపర్తి నుంచి నలుగురు, ధర్మవరం నుంచి ఒకరు, కదిరి నుంచి ముగ్గురు నామినేషన్లు వేసినట్టు కలెక్టర్ పేర్కొన్నారు.

News April 19, 2024

అనంతపురం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌‌గా వినూత్న

image

అనంతపురం జిల్లా నూతన అసిస్టెంట్ కలెక్టర్‌గా బొల్లిపల్లి వినూత్న శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ కార్యాలయంలోని అసిస్టెంట్ కలెక్టర్ ఛాంబర్‌లో వినూత్న బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం వినూత్న కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ అసిస్టెంట్ కలెక్టర్ వినూత్నకు శుభాకాంక్షలు తెలిపారు.

News April 19, 2024

పెనుకొండ టీడీపీ అభ్యర్థిగా సవిత నామినేషన్

image

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పెనుకొండ టీడీపీ అభ్యర్థిగా సవిత నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె నామినేషన్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News April 19, 2024

హిందూపురం టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ నామినేషన్

image

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరదేవితో కలిసి శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ వేశారు. హిందూపురం కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ అభిషేక్ కుమార్‌కు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన మాట్లాడుతూ..
హిందూపురంలో కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.. కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నామినేషన్ కేంద్రం వరకు ఊరేగింపుగా వచ్చారు.

News April 19, 2024

అనంత: 78 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న JNTU

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల 1946వ సంవత్సరంలో స్థాపించబడింది. అనంతరం 2008 సంవత్సరంలో యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. కాగా ఈ యూనివర్శిటీ నేటితో 78 సంవత్సరాలు పూర్తి చేసుకోనుండడంతో శుక్రవారం సాయంత్రం వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎస్వీ సత్యనారాయణ తెలిపారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, DRDO మాజీ ఛైర్మన్ సతీశ్ రెడ్డి వంటి వారు ఇక్కడే చదువుకున్నారు.

News April 19, 2024

అనంతపురం: ఈనెల 23 నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభం

image

అనంతపురం జిల్లాలో శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలలో ఈనెల 23 నుంచి డిగ్రీ పరీక్షలు జరగనున్నట్లు పరీక్షల విభాగ అధిపతి ఆచార్య జీవి రమణ తెలిపారు. 2,4,6 సెమిస్టర్లు జరగనున్నట్లు తెలిపారు. కళాశాలల్లో పరీక్షలు సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థులు అందరు పరీక్షలు ప్రశాంతంగా రాసుకోవచ్చని తెలిపారు.