India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్ఠపర్చాలని ఈనెల 6న అనంతపురం కలెక్టరేట్ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పిలుపునిచ్చారు. అనంతపురంలోని పాతఊరులో మంగళవారం కరపత్రాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించడంలో విఫలమైందన్నారు. ప్రజలు భారీగా వచ్చి ధర్నాను విజయవంతం చెయ్యాలని కోరారు.
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ఉద్యాన పంటలను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ధర్మవరం మండలంలోని నాగులూరు సమీపంలో ఉన్న చీని పంటను పరిశీలించి వ్యవసాయ అధికారులను ఉద్యాన పంటల గురించి అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు కారణంగా రైతులు తగు సూచనలు పాటించి, జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు.
★ భారత-సీ జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (C), సుదర్శన్, పాటిదార్, పోరెల్, ఇంద్రజిత్, హృతిక్, సుథార్, గౌరవ్ యాదవ్, విజయ్ కుమార్, అన్సుల్, హిమాంషు చౌహాన్, మార్కండే, ఆర్యన్ జూయల్, వారియర్
★ భారత-డీ జట్టు: శ్రేయస్ అయ్యర్ (C), అతర్వ టైడే, యాష్ దూబే, పడిక్కల్, ఇషాన్ కిషన్, రికీబుయ్, శరాన్ష్ జైన్, అక్షర్ పటేల్, అర్షదీప్, ఆదిత్య, హర్షిత్ రాణా, దేశ్పాండే, ఆకాశ్ సెంగుప్తా, భరత్, సౌరభ్ కుమార్
రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా జాబ్ మేళా జరుగుతుందని సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. అందుకు సంబంధించి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జాబ్ మేళా క్యాలెండర్ ఆవిష్కరించారు. మంగళవారం ధర్మవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, పెనుకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా జరుగుతుందన్నారు. యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలయం అయింది. ఆహారం, విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సాయం చేసేందుకు అనంతపురం విద్యుత్ శాఖ సిబ్బంది విజయవాడకు వెళ్లారు. విద్యుత్ శాఖ ఎస్ఈ సంపత్ కుమార్ మాట్లాడుతూ.. విజయవాడలో విద్యుత్ మరమ్మతులు చేసేందుకు అనంతపురం నుంచి బృందం తరలి వెళ్లిందని చెప్పారు. వెళ్లిన వారిలో విద్యుత్ శాఖ ఈఈ రమేశ్, డీఈలు, ఏఈలు ఉన్నారని తెలిపారు.
పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జిల్లా ఎస్పీ వీ.రత్నతో పాటు పలువురు అధికారులు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఎస్పీ కార్యాలయానికి 63 వినతులు వచ్చాయి. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా సమస్యల పరిష్కారానికి అధికారులకు కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సమస్య పరిష్కరిస్తే పదేపదే కార్యాలయం చుట్టూ రారని పేర్కొన్నారు.
అనంతపురం జిల్లాలో 5వ తేదీ నుంచి జరగనున్న దులీప్ క్రికెట్ టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా స్టార్ ఆటగాళ్లు అనంతపురం చేరుకున్నారు. బెంగళూరు నుంచి నగరానికి చేరుకున్న వారికి హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతపురం వచ్చిన వారిలో శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, అక్షర్ పటేల్, హర్హదీప్ సింగ్, పడిక్కల్, తుషార్ దేశ్ పాండే, తదితర ఆటగాళ్లు ఉన్నారు. అలెగ్జాండర్, మాసినేని స్టార్ హోటళ్లలో బస చేయనున్నారు.
నరసరావుపేటలో అండర్-14, 19 బాలబాలికల విభాగాలలో జరిగిన 18వ ఫ్లోర్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలలో ఉమ్మడి అనంతపురం జిల్లా రెండో స్థాయిలో నిలిచిందని జిల్లా కార్యదర్శి మనోహర్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా జట్టు గుంటూరు జట్టుతో తలపడగా అనంతపురం జట్టు 4-0 గోల్స్తో గెలిచిందన్నారు. ఫైనల్ మ్యాచ్లో చిత్తూరు జిల్లా జట్టుతో ఒక గోల్ తేడాతో ఓడిపోయిందన్నారు.
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం రామదాసు పేట వద్ద బైక్ కింద పడి యువకుడు దుర్మరణం చెందాడు. నార్పలకు చెందిన రాజశేఖర్ బైక్లో గుత్తి నుంచి అనంతపురం వస్తుండగా కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో రాజశేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు అనంతపురం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివిధ జాతీయ రహదారులు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్, AP ట్రాన్స్కో, రైల్వే, APIIC, తదితర ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ చిత్తశుద్ధితో చేపట్టాలని కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్లో మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవసరమైన చోట గ్రామసభలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు.
Sorry, no posts matched your criteria.