Anantapur

News April 19, 2024

శింగనమల: బండారు శ్రావణికి ఎంత అప్పు ఉందో తెలుసా..?

image

శింగనమలలో నామినేషన్ వేసిన బండారు శ్రావణి శ్రీ ఆస్తిపాస్తులు, విద్యార్హత, కేసుల వివరాలను అఫిడవిట్ లో పేర్కొన్నారు. శ్రావణి ఎంఎస్ చదివారు. కాగా ఆమె పేరిట చరాస్తులు- రూ. 89.67 లక్షలు, బంగారం- 612.5 గ్రాములు, అప్పులు- రూ.22.59 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు.

News April 19, 2024

కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఆస్తుల కన్నా అప్పులే ఎక్కువ..!

image

తాడిపత్రి MLA కేతిరెడ్డి పెద్దారెడ్డిపై 2020లో జేసీ ప్రభాకర్ ఇంట్లోకి చొరబడిన ఘటనలో పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు కాగా ఒక ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు 5 కేసులు ఉన్నాయి. కాగా ఇతని పేరిట రూ.76 లక్షల చరాస్తులు, రూ.35 లక్షల స్థిరాస్తులు, రూ. 2.46 కోట్ల అప్పులు ఉన్నాయని సమాచారం. అయితే పెద్దారెడ్డి భార్య పేరిట రూ. 1.49 కోట్ల చరాస్తులు, రూ.13 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.

News April 19, 2024

కణేకల్లు మండలంలో చంద్రబాబు సభ

image

అనంతపురం జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. సాయంత్రం 4.50 గంటలకు ఆలూరు అగ్రహారం కొండవద్ద హెలికాఫ్టర్లో బయలుదేరి 5.10 గంటలకు కణేకల్లు క్రాస్ హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 5.15 గంటలకు హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 5.25 గంటలకు కణేకల్లు బస్టాండ్ సెంటర్ కు చేరుకుంటారు. 6.00-7.30 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.

News April 19, 2024

అనంత: చీనీకాయలు టన్ను గరిష్ఠ ధర రూ.37 వేలు

image

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం చీనీకాయలు టన్ను గరిష్ఠ ధర రూ.37 వేలు పలికింది. కనిష్ఠ ధర రూ.19 వేలు, సరాసరి ధర రూ.26 వేలతో అమ్ముడుపోయినట్లు మార్కెట్‌ ఎంపిక శ్రేణి కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. మార్కెట్ కు మొత్తం 991 టన్నుల చీనీకాయలు వచ్చాయని జయలక్ష్మి వెల్లడించారు. .

News April 18, 2024

ధర్మవరం వైసీపీ అభ్యర్థిగా వెంకటరామిరెడ్డి నామినేషన్

image

ధర్మవరం వైసీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం వైసీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన అనుచరులతో కలిసి సాదాసీదాగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ధర్మవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు.

News April 18, 2024

అనంత: పిడుగుపాటుకు యువకుడి మృతి

image

వజ్రకరూర్ మండలం చాబాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలో పిడుగుపాటుకు గురై వినోద్ (27) అనే యువకుడు మృతి చెందాడు. పొలంలో మిర్చిని సంచులలో నింపి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, గ్రామస్థులు గమనించి వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

News April 18, 2024

అనంత: రాష్ట్రంలోనే మొట్ట మొదటి నామినేషన్ పయ్యావుల కేశవ్‌దే

image

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్‌లకు మెుదటి రోజు కావడంతో పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్ట మొదటి నామినేషన్ వేసిన అభ్యర్థిగా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ నిలిచారు.

News April 18, 2024

బండారు శ్రావణి నామినేషన్ దాఖలు

image

సింగనమల మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో గురువారం సింగనమల నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. కార్యక్రమంలో బండారు కిన్నెర శ్రీ, ద్విసభ్య కమిటీ సభ్యుడు అలం నరసానాయుడు పాల్గొన్నారు.

News April 18, 2024

అనంత: హాల్ టికెట్లు వచ్చేశాయ్..!

image

గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు ఈనెల 25వ తేదీన నిర్వహించే రాత పరీక్షలకు హాల్ టికెట్లు వచ్చాయని APRS, APRJC, DC – 2024 జిల్లా కోఆర్డినేటర్ విజయలత తెలిపారు. 5, 6, 7, 8 తరగతుల ప్రవేశాలకు APRS క్యాట్- 2024 పరీక్ష ఉదయం 10 – 12 గంటలకు, జూనియర్, డిగ్రీ కళాశాల ప్రవేశాలకు APRJC DC సెట్ మధ్యాహ్నం 2:30 – 5 గంటలకు ఉంటుందన్నారు. వివరాలకు https://aprs.apcfss.in సైట్ చూడాలన్నారు.

News April 18, 2024

అనంత: 108లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

అనంతపురం జిల్లాలో 108 వాహనాల్లో ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ (ఈఎంటీ), డ్రైవర్‌, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు 108 జిల్లా మేనేజర్‌ సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కల్గిన వారు ఈ నెల19వ తేదీ లోపు అనంతపురం సర్వజనాస్పత్రిలో 108 కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.