Anantapur

News October 10, 2024

SKU పరిధిలో డిగ్రీ 2వ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

image

SKU పరిధిలో డిగ్రీ రెండో సెమిస్టర్‌ ఫలితాలను యూనివర్సిటీ ఇన్‌‌ఛార్జ్‌ వీసీ ప్రొఫెసర్‌ బి.అనిత విడుదల చేశారు. మొత్తం 8,551 మంది పరీక్ష రాయగా 3,392 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో BAలో 461 మందికి గానూ 108 మంది, BBAలో 818 మందికి గానూ 353 మంది, BCAలో 174 మందికి గానూ 62 మంది, BCMలో 4,512 మందికి గానూ 1,635 మంది, BSCలో 2,586 మందికి గానూ 1,234 మంది ఉత్తీర్ణత చెందారు.

News October 10, 2024

ఈ-పంట నమోదు ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి చేయాలి: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలోని ఈ-పంట నమోదు ప్రక్రియ సూపర్ చెక్‌ను రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మతో కలిసి వ్యవసాయ అనుబంధ రంగ, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక, ఉద్యానవన శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

News October 9, 2024

ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించండి: బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి

image

మాజీ సీఎం జగన్ X వేదికగా చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ‘2011లో ప్రారంభమైన YCP నుంచి ఇప్పటివరకు 35 మంది MPలు, 232 మంది MLAలు గెలిచారు. ఇప్పుడు మీరు నిందిస్తున్న EVMల వల్లే గెలిచి మీరు CM అయ్యారు. మీ పాలనలో చేసిన తప్పులను దాచడానికి ప్రయత్నించడం మానేయండి. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి, వాస్తవాలను గ్రహించి, ఆరోపణలు మానుకోండి’ అని పేర్కొన్నారు.

News October 9, 2024

డీసీఆర్సీ విభాగం సిబ్బందితో సమీక్ష నిర్వహించిన ఎస్పీ

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని ఎస్పీ కార్యాలయంలో డీసీఆర్సీ విభాగం సిబ్బందితో జిల్లా ఎస్పీ రత్న సమీక్ష నిర్వహించారు. ఎస్పీ కార్యాలయంలో డిసిఆర్బి శాఖ ఎంతో కీలకమైనదని అన్ని కేసులపై అవగాహన పెంచుకొని పనిచేయాలని ఎస్పీ సూచించారు. క్రైమ్ కేసులతోపాటు ఎస్సీ ఎస్టీ, లోకాయుక్త, రౌడీషీటర్స్, చోరీలు, బోర్డర్ పోలీస్ స్టేషన్, క్రిమినల్స్, ఫ్యాక్షన్ గ్రామాలపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు.

News October 9, 2024

ఎస్‌కే యూనివర్సిటీ పరీక్ష ఫలితాల విడుదల

image

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో సెకండ్ సెమిస్టర్ UG రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రొఫెసర్ శోభలత కమిటీ సభ్యులు ఎస్కే ఛాంబర్‌లో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో ఉంచామన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ వెంకటనాయుడు, రిజిస్టార్ రమేశ్ బాబు, పరీక్షల నియంత్రణ అధికారి లోకేశ్వర్, అసిస్టెంట్ రిజిస్టర్ శంకర్ పాల్గొన్నారు.

News October 9, 2024

‘ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోండి’

image

శ్రీ సత్య సాయి జిల్లాలో అర్హత కలిగిన బీసీ, ఈబీసీ, సంచార కులాలకు చెందిన విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి నిర్మల జ్యోతి పేర్కొన్నారు. 9, 10, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు పీఎం యశస్వి ఉపకార వేతనాలు పొందేందుకు ఈనెల 15వ తేదీ లోపు 9, 10 తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇంటర్ చదువుతున్న వారు 30 లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News October 9, 2024

ప్రజాస్వామ్యం బతకాలంటే ఒక పేపర్ బ్యాలెట్ ఓటింగ్ ద్వారానే సాధ్యం: కేతిరెడ్డి

image

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి X వేదికగా మాజీ సీఎం జగన్ చేసిన పోస్టుకు స్పందించారు. మొదటగా మనం పోరాటం చేయాల్సింది ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపైనే అన్నారు. ఎందుకంటే ఏ ఎలక్ట్రానిక్ మిషన్లు నైనా ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటుందన్నారు. మన భారత దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే అది ఒక పేపర్ బ్యాలెట్ ఓటింగ్ ద్వారానే సాధ్యమన్నారు.

News October 9, 2024

పల్లెకు మంచి రోజులు

image

గ్రామాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘పల్లె పండుగ’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఈ నెల 14 నుంచి 20 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధికి సంబంధించి ఆగస్టు 23న నిర్వహించిన గ్రామ సభలో ప్రతిపాదించిన పనులకు శ్రీకారం చుడతారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.4500 కోట్లు కేటాయిస్తోంది. కాగా అనంతపురం జిల్లాలో 577, శ్రీ సత్యసాయి జిల్లాలో 427 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

News October 9, 2024

అనంతపురం జిల్లాకు వర్ష సూచన

image

అనంతపురం జిల్లాలో రానున్న 5 రోజుల్లో తేలిక పాటి నుంచి చిరు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంటలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 32.5-34.8, రాత్రి ఉష్ణోగ్రతలు 23.5-24.6 డిగ్రీలు నమోదు అవుతుంనది పేర్కొన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం 80-83 శాతం నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు.

News October 9, 2024

అనంతపురంలో పోక్సో కేసు.. నిందితుడి అరెస్ట్

image

బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. అనంతపురం నగరంలోని జాకీర్ కొట్టాలకు చెందిన రవీంద్ర బాలిక(7)ను తన ఇంటి వద్దకు పిలిపించుకని అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై నిందితుడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లు రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు.