Anantapur

News April 18, 2024

ఉరవకొండ: పయ్యావుల కేశవ్ తరఫున సతీమణి నామినేషన్

image

ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ తరఫున ఆయన సతీమణి పయ్యావుల హేమలత నామినేషన్ వేశారు. గురువారం ఉదయం తనయుడు పయ్యావుల విజయ్ సింహ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆమె రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నామినేషన్ పత్రాలను నియోజకవర్గ ఎన్నికల అధికారి కేతన్ గార్గ్‌కు అందజేశారు.

News April 18, 2024

మడకశిరకు చేరుకున్న షర్మిల

image

మడకశిరలో వైఎస్ షర్మిలకు రాష్ట్ర ఉపాధ్యక్షులు కేటి శ్రీధర్, మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి కే. సుధాకర్, కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం స్వాగతం పలికారు. మడకశిర పట్టణంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలో షర్మిల పాల్గొంటున్నారు. ఈ సభలో పాల్గొనడానికి జిల్లావ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివస్తున్నారని అన్నారు.

News April 18, 2024

గుమ్మగట్ట: పాముకాటుతో బాలిక మృతి

image

గుమ్మగట్ట మండలం వీరాపురం గ్రామంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అవంతి(13) అనే బాలిక పాముకాటుతో మృత్యువాత పడింది. ఆసుపత్రికి తరలించేలోపు బాలిక మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News April 18, 2024

అనంత: ఇద్దరు ఉద్యోగులపై వేటు

image

అనంతపురం జిల్లాలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వి. వినోద్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్  అయిన వారిలో యల్లనూరు గ్రామ జెడ్పీ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఇ.విజయకుమారి, కూడేరు మండలం గొటుకూరు గ్రామ సీనియర్ మేట్ ఎన్. జయప్ప ఉన్నారు. అలాగే పలు చోట్ల ఎస్ఎస్ఈ బృందాలు రూ.2.80 కోట్ల నగదును సీజ్ చేశారన్నారు.

News April 18, 2024

అనంత: వందేభారత్‌పై రాళ్ల దాడి

image

కాచిగూడ- యశ్వంతపుర మధ్య నడిచే వందేభారత్ పై దాడి జరిగింది. పామిడి-కల్లూరు మధ్య బుధవారం ఉదయం వందేభారత్ రాగానే కొందరు ఆకతాయిలు సీ4 బోగీపై రాళ్లు రువ్వారు. దీంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. గతంలో ధర్మవరం- బత్తలపల్లి సమీపంలో దుండగులు రాళ్ల దాడికి పాల్పడగా, ఆ తర్వాత అనంతపురం సమీపంలో మరోసారి అదే రైలుపై రాళ్ల దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.

News April 18, 2024

నామినేషన్ల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలి: అనంత ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల వద్ద పటిష్ఠ బందోబస్తు చేపట్టాలని పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ అమిత్ బర్గర్ సూచించారు. బుధవారం శింగనమల మండల కేంద్రంలోని నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికల నియమ నిబంధనలు అమలు చేసి నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నామినేషన్ల వద్ద నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే లోపలికి అనుమతించనున్నట్లు తెలిపారు.

News April 18, 2024

సత్యసాయి జిల్లాకు చేరుకున్న ఎన్నికల పరిశీలకులు

image

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి పర్యవేక్షణ నిమిత్తం వ్యయ పరిశీలకులు జిల్లాకు చేరుకున్నట్టు కలెక్టర్ అరుణ్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. హిందూపురం పార్లమెంటు నియోజవర్గానికి అమిత కుమార్, మడకశిర, హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాలకు వినాయక్, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాలకు రిదయం బహుదజలు జిల్లాకు వచ్చారని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

News April 17, 2024

శింగనమల: ఇసుక తవ్వకాలు ఆపండి.. రైతుల ఆవేదన

image

గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామ పరిధిలో ఇసుక రవాణా చేస్తున్న వారిని గ్రామస్థులు అడ్డుకొని అక్కడ నుంచి టిప్పర్లు, హిటాచీలను తరలించారు. దయచేసి రైతులకు అన్యాయం చేయకండి.. ఇసుక లేకుంటే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు  రైతుల గురించి అలోచించి ఇసుక రీచ్‌లకు అనుమతులివ్వకండి అని అధికారులు కోరుతున్నారు. ఇసుక తవ్వకాలు జరిగే చోటే తాగునీటి బోర్లు ఉన్నాయని తెలిపారు.

News April 17, 2024

అనంత: Way2 News శ్రీరామనవమి స్పెషల్

image

లేపాక్షి ఆలయాన్నికి రామాయణంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. రావణాసురుడు సీతమ్మవారిని అపహరించుకుని తీసుకెళుతుండగా కూర్మ పర్వతంపైన జటాయువు అడ్డగిస్తాడు. రావణుడు అడ్డొచ్చిన ఆ పక్షి రెక్కలు నరికివేయగా ఈ స్థలంలో పడిపోయింది. సీతాన్వేషణలో ఈ స్థలానికి వచ్చిన శ్రీరాముడు విషయం తెలుసుకుని ఆ పక్షికి మోక్షమిచ్చి లే పక్షీ అని పలికాడు. ఆ పదమే కాలక్రమేణా లేపాక్షిగా మారిందని స్థలపురాణం.

News April 17, 2024

సివిల్స్‌లో అనంత జిల్లా వాసికి జాతీయ స్థాయి ర్యాంక్

image

మంగళవారం విడుదల చేసిన సివిల్స్ ఫలితాలలో గుంతకల్లు పట్టణానికి చెందిన ధనుశ్‌కు జాతీయస్థాయిలో 480వ ర్యాంకు వచ్చింది. గుంతకల్లు పట్టణంలో పుట్టి పెరిగిన ధనుశ్ బీటెక్ పూర్తి చేశారు. సివిల్స్ పరీక్షలకు తాను ఎటువంటి కోచింగ్ తీసుకోలేదని పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను, ఆంగ్ల దినపత్రికలను చదువుతూ ముఖ్యమైన విషయాలను నోట్స్ లో రాసుకుంటూ పరీక్షలకు సిద్ధమైనట్లు ఆయన చెప్పారు.