Anantapur

News September 1, 2024

అనంతపురంలో 4న మట్టి గణపతి ప్రతిమల పంపిణీ

image

అనంతపురం శ్రీనివాస నగర్‌లోని రామాలయంలో ఈ నెల 4న బుధవారం ఉదయం 10.30 గంటలకు మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ఆలయ ధర్మకర్త ఆళ్లగడ్డ రాము తెలిపారు. ఆలయ 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మట్టి వినాయక ప్రతిమల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ఫ్రీగా ప్రతిమలను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News September 1, 2024

గుత్తిలో కరెంట్ షాక్‌తో టీడీపీ నేత భార్య మృతి

image

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో విషాదం నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, గుత్తి చెరువు ఆయకట్టు మాజీ ఛైర్మన్ కేశవ నాయుడు సతీమణి సుజాతమ్మకు ఆదివారం ఉదయం ఇంట్లో కరెంట్ షాక్ కొట్టింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. సుజాతమ్మ మృతదేహానికి టీడీపీ నాయకులు నివాళులర్పించారు.

News September 1, 2024

3 నుంచి ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం

image

అనంతపురం జిల్లాలో ఈనెల 3వ తేదీ నుంచి పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ జేడీ ఉమ మహేశ్వరమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. వారంలో మంగళ, బుధవారాల్లో అన్ని మండలాల్లో కార్యక్రమాన్ని నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. వ్యవసాయ అనుబంధ అధికారులతో పాటు సిబ్బంది, శాస్త్రవేత్తలతో కూడిన బృందాలు పొలాలను సందర్శించి గ్రామసభలు నిర్వహిస్తారని తెలిపారు.

News September 1, 2024

అనంత: రేషన్ పంపిణీకి సర్వం సిద్ధం

image

అనంతపురం జిల్లాలోని 12 ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి 1,645 చౌకధరల దుకాణాలకు సెప్టెంబరు నెల కోటా రేషన్ సరకులన్నీ సరఫరా చేశామని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రమేశ్ రెడ్డి తెలిపారు. జిల్లాలో 6,87,263 రేషన్ కార్డులు ఉండగా, బియ్యం 9,716 మెట్రిక్ టన్నులు, పంచదార 325 మెట్రిక్ టన్నులు, గోధుమపిండి 28 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామన్నారు.

News September 1, 2024

చవితి ఉత్సవాలు, నిమజ్జనం నిర్వహణపై సమావేశం

image

అనంతపురం: వినాయక చవితి ఉత్సవాల కోసం, నిమజ్జనం కార్యక్రమాల నిర్వహణపై పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కోరారు. అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో, గణేష్ ఉత్సవ కమిటీల సమన్వయంతో జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. శనివారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వినాయక చవితి ఉత్సావాల నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించారు.

News September 1, 2024

టోర్నమెంట్‌ నిర్వహణ గొప్ప అవకాశం: మాంఛో ఫెర్రర్‌

image

అనంతపురం జిల్లాలో దులీప్‌ ట్రోఫీ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించడం గొప్ప అవకాశం అని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) త్రీమెన్‌ కమిటీ సభ్యుడు మాంఛో ఫెర్రర్‌ అన్నారు. శనివారం ఆయన టికెట్ల పంపిణీతో పాటు స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాంఛో ఫెర్రర్‌ మీడియాతో మాట్లాడుతూ.. క్రికెట్ ప్రేమికులకు ఇదొక అరుదైన అనుభూతినిచ్చే వేడుకని, జాతీయ క్రీడాకారులకు అత్యంత కీలకమైనదని అన్నారు.

News August 31, 2024

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి: మంత్రి

image

ప్రజలు, అధికారులు ప్రస్తుత వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ధర్మవరంలో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున వైద్య సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతిరోజు శానిటేషన్ కార్యక్రమాలు చేస్తుండాలని, ఆస్పత్రులలో డాక్టర్లు అందుబాటులో ఉండాలని సూచించారు.

News August 31, 2024

సత్యసాయి: హెయిర్ కలర్ తాగి ఆత్మహత్యాయత్నం

image

ధర్మవరం మండలం వెంకట తిమ్మాపురం గ్రామానికి చెందిన అక్కమ్మ శనివారం తలకు వేసుకునే రంగును నీటిలో కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు గమనించి అక్కమ్మను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె భర్త వెంకటేశులు ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అక్కమ్మ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై ధర్మవరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 31, 2024

అనంతపురం జిల్లాలో TODAY TOP NEWS

image

☞ ఆత్మకూరులో పర్యటించిన కలెక్టర్ వినోద్ కుమార్ ☞ భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు ☞ దులీప్ క్రికెట్ ట్రోపీకి ఎంట్రీ పాసుల పంపిణీ ☞ అనంత జిల్లాలో వర్షంలోనూ పింఛన్ పంపిణీ ☞ గుత్తిలో గ్యాస్ సిలిండర్ లీక్.. పరుగులు తీసిన జనాలు ☞ అనంత జిల్లాలో 206.8 మిల్లీమీటర్ల వర్షపాతం ☞ ఉరవకొండలో విద్యుత్ షాక్ తో రైతు మృతి ☞ పెన్నాహోబిలంలో ఘనంగా శ్రీవారి పల్లకి ఉత్సవం ☞ భక్తులతో కిటకిటలాడిన కసాపురం క్షేత్రం.

News August 31, 2024

సత్యసాయి జిల్లాలో TODAY TOP NEWS

image

☞ చిలమత్తురులో పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి సవిత ☞ కొత్తచెరువులో పింఛన్ పంపిణీ చేసిన కలెక్టర్ చేతన్ ☞ ముదిగుబ్బలో విద్యుత్ సబ్ స్టేషన్‌కు తలలు వేసిన రైతులు ☞ మడకశిరలో పోలీస్ స్టేషన్ ముందు సైకో వీరంగం ☞ కొత్తచెరువులో ఉద్రిక్తత ☞ బత్తలపల్లిలో ఆర్టీసీ బస్సుపై పడిన విద్యుత్ స్తంభం ☞ 13 ఏళ్ల తర్వాత కోడికొండ చెక్ పోస్ట్ కేసు కొట్టివేత ☞ పుట్టపర్తిలో టీచర్ గా మారిన ఎమ్మెల్యే సింధూర రెడ్డి.