Anantapur

News April 16, 2024

ధర్మవరంలో హత్య.. నిందితులు అరెస్ట్

image

ధర్మవరం పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తి హత్య కేసులో నిందితులను రెండో పట్టణ సీఐ అశోక్ కుమార్ గంటల వ్యవధిలోని అరెస్టు చేశారు. మంగళవారం తెల్లవారుజామున రైల్వే స్టేషన్ నుంచి వస్తున్న శ్రీనివాసరెడ్డిని ఆటో నడుపుతున్న లోకేంద్ర, విష్ణు అనే వ్యక్తులు కిరాయి విషయంలో గొడవపడి కట్టెలతో దారుణంగా కొట్టి హత్య చేసినట్లు వెల్లడించారు. సీఐ మంగళవారం సాయంత్రం నిందితులను అరెస్టు చేశారు.

News April 16, 2024

అనంత: యోగి వేమన యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య

image

కడప యోగివేమన యూనివర్సిటీలో విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది.
కదిరికి చెందిన సుల్తానా యోగి వేమన యూనివర్సిటీలో ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదువుతోంది. తోటి విద్యార్థినులు మెస్‌కు వెళ్లిన సమయంలో హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 16, 2024

ఈనెల 18 మడకశిరలో వైఎస్ షర్మిల పర్యటన

image

మడకశిర మండలంలో ఈనెల 18 పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు మడకశిరలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News April 16, 2024

ధర్మవరంలో వ్యక్తి దారుణ హత్య

image

ధర్మవరం పట్టణం కొత్తపేట రైల్వే స్టేషన్ ఎదురుగా శ్రీనివాస రెడ్డి(58) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి దారుణంగా హత్య చేశారు. ధర్మవరం రెండో పట్టణ పోలీసులు సంఘటనా ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. హత్యకు గల కారణాల గురించి దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

News April 16, 2024

తాడిపత్రిలో అత్యధికంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో సోమవారం అత్యధికంగా తాడిపత్రిలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు బీ.సముద్రం వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త సహదేవ రెడ్డి తెలిపారు. పెద్ద వడుగురు మండలంలో 41.8 డిగ్రీలు, బొమ్మణహల్‌లో 41.6, శెట్టూరులో 41.2, చెన్నేకొత్తపల్లి, శింగనమల, గుత్తి, విడపనకల్ మండలాల్లో 40.2, ధర్మవరంలో 40.8, యాడికిలో 40.6, గుంతకల్లులో 40.3, బీ.సముద్రం మండలంలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పారు.

News April 15, 2024

తాడిపత్రి: ఏడేళ్ల బాలికను కాపాడిన పోలీసులు

image

తాడిపత్రి రూరల్ యు.పి.ఎస్ పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సంయుక్తంగా ఏడేళ్ల చిన్నారిని కాపాడారు. వివరాల్లోకి వెళ్తే తిప్పాయిపల్లెకి చెందిన ఏడేళ్ల చిన్నారి అవంతిక ఆడుకుంటూ రెండు ఇళ్ల గోడల మధ్య ఉన్న చిన్న సందులో ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న సీఐ లక్ష్మికాంత్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి తాడిపత్రి అగ్నిమాపక సిబ్బందితో పాపను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.

News April 15, 2024

 470కి 465మార్కలు సాధించిన ధర్మవరం విద్యార్థిని

image

ధర్మవరం పట్టణం బ్రాహ్మణ వీధికి చెందిన కే.మహబూద 465/470 మార్కులతో సత్యసాయి జిల్లా రెండవ ర్యాంకు సాధించింది. పట్టణంలోని ఓ కళాశాలలో ఎంపీసీ మెుదటి సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించింది. విద్యార్థిని మహబూద మాట్లాడుతూ.. ఇంజినీర్ కావడమే లక్ష్యంగా తన చదువును కొనసాగిస్తానని తెలిపారు.

News April 15, 2024

హిందూపురం జిల్లాగా ప్రకటించాలని నిరాహార దీక్ష

image

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ పట్టణ వైసీపీ కన్వీనర్ నరేశ్ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన బీఎస్పీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించలేని పక్షంలో హిందూపురం నుంచి జగన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.

News April 15, 2024

సివిల్స్ పరీక్షలపై నారాయణ ఐఏఎస్ అకాడమీ ఉచిత వర్క్ షాప్

image

అనంతపురంలోని టీటీడీ కళ్యాణమండపంలో సివిల్స్ పరీక్షలపై నారాయణ ఐఏఎస్ అకాడమీ ఆదివారం ఒకరోజు ఉచిత వర్క్ షాప్ నిర్వహించింది. కార్యక్రమంలో తెలంగాణ రిటైర్డ్ డీజీ ఏకే ఖాన్ మాట్లాడుతూ.. సాధన కోసం వీలైనంత త్వరగా ప్రిపరేషన్ ప్రారంభించాలన్నారు. ఇందుకోసం ఇంటర్ డిగ్రీ నుంచే దృష్టి సారిస్తే లక్ష్యం సులభతరమవుతుందని తెలిపారు. నారాయణ IAS అకాడమీ DGM, R & D H.శివనాథ్, తదితరులు పాల్గొన్నారు.

News April 15, 2024

ధర్మవరం: ఆర్టీసీ మెకానిక్ కూతురికి.. జిల్లా రెండో ర్యాంకు

image

ధర్మవరం పట్టణం పోతుకుంటకు చెందిన ఏ.మాధురి సత్యసాయి జిల్లా రెండవ ర్యాంకును సాధించింది. ధర్మవరంలోని ఓ కళాశాలలో ఎంపీసీ విభాగంలో 987/1000 మార్కులు సాధించింది. తండ్రి ఆర్టీసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.