India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంత జిల్లా యువకుడిపై HYD పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన లోకేశ్కు అదే గ్రామానికి చెందిన యువతితో పరిచయం ఉంది. చనువు పెరగడంతో యువతి తన ఫొటోలను అతడికి పంపింది. ఇదే అదునుగా యువకుడు నగ్నవీడియోలు పంపాలంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. అతడి వేధింపులతో ట్యాంక్ బండ్ వద్ద సూసైడ్ వరకు వెళ్లిన యువతి విషయాన్ని సోదరుడికి చెప్పింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

అనంత జిల్లా యువకుడిపై HYD పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన లోకేశ్కు అదే గ్రామానికి చెందిన యువతితో పరిచయం ఉంది. చనువు పెరగడంతో యువతి తన ఫొటోలను అతడికి పంపింది. ఇదే అదునుగా యువకుడు నగ్నవీడియోలు పంపాలంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. అతడి వేధింపులతో ట్యాంక్ బండ్ వద్ద సూసైడ్ వరకు వెళ్లిన యువతి విషయాన్ని సోదరుడికి చెప్పింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

స్వర్ణాంద్ర 2047 జిల్లా విజన్ ప్లాన్ తయారీపై అనంతపురం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ భవన్లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, నగర మేయర్ మహమ్మద్ వసీం పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ.. జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగం అభివృద్ధి చెందడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

మడకశిర నియోజకవర్గంలోని ప్రసిద్ధి చెందిన ముఖ్య దేవాలయాలను సినీ దర్శకుడు ధనరాజ్ శుక్రవారం సందర్శించారు. హేమావతిలోని ఎంజీఆర్ సిద్దేశ్వరస్వామి టెంపుల్, రోళ్ళలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, రత్నగిరి కొల్లాపూర్ మహాలక్ష్మి ఆలయం, చెందకచర్ల ఆంజనేయస్వామి టెంపుల్, మడకశిరలోని పూజమ్మ, శివాలయం, తదితర ఆలయాలను సందర్శించి ధూప, దీప నైవేద్యాలను కానుకగా సమర్పించారు. ప్రజలందరూ సంతోషంగా జీవించాలని కోరారు.

రాజకీయాలు అంటే ఇప్పటికే ప్రజల్లో ఒక చులకన భావంతో చూస్తున్నారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఒక ఉన్నత పదవిలో ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించాలి కానీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజకీయాల కోసం ఒక వ్యక్తి యొక్క కుటుంబ విషయాలను, వ్యక్తిగత విచారణ వాడుకోవడం ఒక నీచమైన చర్య అంటూ Xలో పోస్ట్ చేశారు.

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని మార్కెట్ యార్డు వద్ద ఉరివేసుకుని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి రఫీక్(67) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గోరంట్ల మండలంలో ఓ భూ వివాదామే తమ తండ్రి మృతికి కారణమని మృతుడి కుమారులు రియాఫత్, హిదయాత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పెనుకొండ పోలీసులు తెలిపారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో మండలాల వారిగా లోటు వర్షపాతం నమోదైన కారణంగా పూర్తిగా పంటలు వేసుకోలేకపోయిన మండలాల నుంచి ప్రతిపాదనలు సమర్పించాలని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, వ్యవసాయ అధికారి సుబ్బారావుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష చేశారు.

శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్నను పుట్టపర్తి రూరల్ ఎస్సై లింగన్న మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం పుట్టపర్తి రూరల్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన లింగన్న జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రత్నను కలిసి పూల మొక్కను అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. విధులలో అంకితభావంతో పనిచేసే పోలీసు ప్రతిష్టను పెంచే విధంగా చూడాలన్నారు.

హిందూపురం మం. రాచపల్లికి చెందిన వేమారెడ్డి మ్యారేజ్ బ్యూరో చేతిలో మోసపోయాడు. 44 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోవడంతో ఆయన మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించి రూ.3 లక్షలు చెల్లించారు. వారు చూపించిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన 15 రోజులకు ఆమె సొంతూరు భీమవరం వెళ్లిపోయి తిరిగిరాలేదు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బ్రోకర్లు కొన్నిరోజులు ఉండి వచ్చేయమన్నారని యువతి చెప్పడం గమనార్హం.

అనంత జిల్లా కణేకల్లు మండల కేంద్రంలో విషాదకర ఘటన జరిగింది. కురుబ జశ్వంత్ (6) అనే బాలుడు ఎద్దుల బండిపై నుంచి పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సెలవులు కావడంతో తండ్రితోపాటు శుక్రవారం ఉదయం ఎద్దుల బండిపై పొలానికి వెళుతుండగా అకస్మాత్తుగా కిందపడి బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కణేకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడి మృతితో ఆ కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది.
Sorry, no posts matched your criteria.