Anantapur

News October 3, 2024

ప్రతి గ్రామాన్ని స్వచ్ఛత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రతి గ్రామాన్ని స్వచ్ఛత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం పుట్టపర్తి రూరల్ మండల పరిధిలోని కప్పల బండలో జరిగిన స్వచ్ఛత హి సేవ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో గ్రామస్తుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమన్నారు.

News October 2, 2024

హెచ్‌ఎల్‌సీ కెనాల్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

బీ.సముద్రం మండల పరిధిలో ఉన్న హెచ్ఎల్‌సీ కెనాల్‌లో గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెడీమేడ్ ఫుల్ షర్ట్‌పైన నలుపు, తెలుపు రంగు చుక్కలు, డార్క్ బ్లూ కలర్ జీన్స్ దుస్తులు ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. కీప్యాడ్ ఫోన్, ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉందన్నారు. గుర్తించి వారు సీఐ 9440796816 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.

News October 2, 2024

కాస్త ఓపిక పట్టు కేతిరెడ్డీ.. నీ గుట్టు విప్పుతా: మంత్రి సత్యకుమార్ యాదవ్

image

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన విమర్శలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ‘పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్న సామెత మీకు సరిగ్గా వర్తిస్తుంది కేటురెడ్డీ.. కబ్జా కమీషన్, కలెక్షన్ కరప్షన్లకు కేరాఫ్ అడ్రస్ నువ్వు. కమీషన్లు లేక మైండ్ బ్లాక్ అయినట్లు ఉంది. కాస్త ఓపిక పట్టు నీ దారుణాలు గుట్టు విప్పుతా’ అంటూ ఘాటుగా స్పందించారు.

News October 2, 2024

రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

రాప్తాడు నియోజకవర్గం కక్కలపల్లి కాలనీలో ఉన్న నడిమి వంకను కలెక్టర్ వినోద్ కుమార్, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే పరిటాల సునీత.. అధికారులతో కలిసి పరిశీలించారు. వంకకు రెండువైపులా ఉన్న ఆదర్శ నగర్‌తో పాటు సుమారు 8 కాలనీల ప్రజలు వరదల సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే వివరించారు. రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

News October 2, 2024

సత్య.. నీ వాటాలు నీకు అందాయా?: కేతిరెడ్డి

image

మంత్రి సత్యకుమార్ యాదవ్‌పై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘సత్య.. ధర్మవరం ప్రజలు నిన్ను నమ్మి ఓటు వేసి గెలిపించిన పాపానికి నువ్వు, నీ కూటమి పార్టీ నేతలైన జనసేన, టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు దిగుతున్నారు. వాటాలు వేసుకుంటూ ప్రజల్ని భయపెట్టి ఇప్పటికే ఎంతో మంది దగ్గర వసూళ్లు చేశారు. నీ వాటాలు నీకూ అందాయి కదా?’ అంటూ కేతిరెడ్డి ట్వీట్ చేశారు.

News October 2, 2024

సెలవుల్లో విహారయాత్ర ప్లాన్ చేసుకుంటున్నారా!

image

నేటి నుంచి స్కూళ్లకు సెలవులు మొదలయ్యాయి. దీంతో పిల్లలను విహారయాత్రలకు తీసుకెళ్లేందుకు పేరెంట్స్ ప్లాన్ చేస్తుంటారు. రొటీన్ లైఫ్ నుంచి వెరైటీ కోరుకునే వారికి మన జిల్లాలోనే ఆహ్లాదాన్ని పంచే పర్యాటక ప్రాంతాలున్నాయి. అవి.. పెన్నహోబిలం, లేపాక్షి, పెనుకొండ కోట, తిమ్మమ్మ మర్రిమాను, గుత్తికోట, పుట్టపర్తి, ఆలూరుకోన, కసాపురం, జంబు ద్విపా, యోగివేమన సమాధి, కదిరి నరసింహస్వామి, తాడిపత్రి చింతల వెంకటరమణ దేవాలయం.

News October 2, 2024

అనంతపురం జిల్లాకు వర్ష సూచన

image

ఉమ్మడి అనంతపురం జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు రానన్న ఐదు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిరుజల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు.

News October 2, 2024

రాష్ట్రస్థాయి పోటీలకు గౌడనహళ్లి విద్యార్థి ఎంపిక

image

అనంతపురంలో జరిగిన జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో మడకశిర మండలం గౌడనహళ్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కృష్ణవేణి ప్రతిభ కనబరిచిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేంద్ర మంగళవారం తెలిపారు. తన పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న కృష్ణవేణి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఆమెను వ్యాయామ ఉపాధ్యాయురాలు అరుణ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

News October 2, 2024

ఇంటింటా ఓటర్ల సర్వే ప్రక్రియ 99% పూర్తి: కలెక్టర్

image

శ్రీ సత్య సాయి జిల్లాలో ఇంటింటా ఓటర్ల సర్వే ప్రక్రియ 99.32% పూర్తయిందని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. జాబితాలో సవరణల కోసం 14,08,524 దరఖాస్తులు రాగా.. ఇప్పటివరకు 13,98,947 పరిశీలించామని, మిగిలిన వాటిని వారంలోగా పరిష్కరిస్తామని ఎన్నికల కమిషన్ దృష్టికి కలెక్టర్ తెచ్చారు. కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి ఉద్దేశించిన గడువులోగా కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తామన్నారు.

News October 2, 2024

ఖాళీ పోస్టులకు దరఖాస్తులు చేసుకోండి: డీఈఓ

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టులను ఒప్పందం ప్రాతిపదికన, బోధ నేతర సిబ్బందిని పొరుగు సేవల ప్రాతిపదికన నిర్వహించుటకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల మహిళ అభ్యర్థులు పదవ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.