India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లా సెట్టూరు మండలం అయ్యగార్లపల్లి గ్రామంలో సోమవారం విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన బాబు (24) అనే వ్యక్తి గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అనంతపురంలోని ఇస్కాన్ ఆలయం ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రపంచంలోనే అతి అందమైన ఇస్కాన్ ఆలయాలలో ఒకటి. ఇక్కడ శ్రీకృష్ణుడు రాధా సమేతంగా కొలువై ఉన్నారు. ఆలయం గుర్రం లాగిన రథం లాగా కనిపిస్తుంది. ప్రవేశద్వారం వద్ద నాలుగు భారీ గుర్రాల విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని 2008లో ప్రారంభించగా ఎంతో వైభవంగా విరాజిల్లుతోంది. రాత్రి వేళ విద్యుత్ కాంతుల్లో ఈ ఆలయం మరింత అందంగా కనిపిస్తుంది.
‘మన టీడీపీ’ యాప్లో టాప్లో నిలిచిన టీడీపీ కార్యకర్తలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. యాప్ ద్వారా తెలుగుదేశంపార్టీ కంటెంట్ను ప్రజల్లోకి తీసుకెళ్లి టాప్ స్కోర్లో సాధించిన వారికి వారు ప్రశంస పత్రాలను పంపించారు. ఈ సందర్భంగా శింగనమల నియోజకవర్గంలో ఉత్తమ ప్రతిభ చూపిన కార్యకర్తలకు ఆ ప్రశంస పత్రాలను ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అందజేసి అభినందించారు.
శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని శ్రీకృష్ణుని ఆలయంలో మంత్రి సవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో పంటలు సుభిక్షంగా పండాలని ప్రజలు సంతోషంగా జీవించాలని కోరుకున్నారు. అనంతరం శ్రీకృష్ణ ఉత్సవ ఊరేగింపులో పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిపై ఆ శ్రీకృష్ణ భగవానుడి కరుణాకటాక్షం ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
అనంతపురం స్థానిక ఐటీఐ కళాశాలలో ఈనెల 27న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రామమూర్తి ఆదివారం తెలిపారు. చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం సమీపంలోని అమర్ రాజా ఎనర్జీ మొబిలిటీ లిమిటెడ్ కంపెనీలో టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీఐ పూర్తి చేసిన వారితో పాటు చివరి సంవత్సరం పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు భోజన వసతితో పాటు నెలకు రూ.14 వేలు వేతనం చెల్లిస్తారు.
ఉరవకొండ మండలంలోని ఓ గ్రామంలో కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ట్రాక్టర్ డ్రైవరుగా పనిచేసే నిందితుడికి మేనరికం వివాహం కావడం వల్ల ముగ్గురు పిల్లలు మతిస్థిమితలేమితో పుట్టారు. చిన్న కుమార్తె ఓ స్వచ్ఛంద సంస్థలో చదువుతూ.. పింఛను కోసం ఇంటికొస్తుంది. ఈ క్రమంలో తండ్రి ఈ నెల తొలివారంలో దారుణానికి ఒడిగట్టాడు. దీంతో కుమార్తెతో కలిసి తల్లి శనివారం అనంతపురం దిశ PSలో ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టారు.
ప్రతి సోమవారం అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా రద్దు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. సెప్టెంబరు 2వ తేదీన నిర్వహించే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బొమ్మనహాల్ మండలంలోని నేమకల్లు గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా ఆదివారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రధాన అర్చకులు అనిల్ కుమార్ చార్యులు, సంతోష్ కుమార్ చార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి విశేష పూజలు జరిపించి వెన్నతో అలంకరణ చేసి అష్టోత్తర సహస్రనామాలు నైవేద్యం సమర్పించి మహా మంగళహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పుట్టపర్తిలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాటు చేపట్టినట్టు ఎస్పీ రత్న పేర్కొన్నారు. ప్రశాంతి నిలయంలో జరిగే వేడుకలకు దిశ డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు వైజాగ్ నుంచి 2,500 మంది భక్తులు వచ్చారని, పలు రాష్ట్రాలకు చెందిన భక్తులు వేడుకలలో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం సమీపంలోని 47వ జాతీయ రహదారి పక్కన నిలిపి ఉన్న కారు నీటి ప్రవాహంలో మునిగిపోయింది. ఆ ప్రాంతంలో కురిసిన అధిక వర్షానికి హోండా వెర్నా కారు మునిగిపోయింది. గమనించిన గ్రామస్థులు అక్కడకు వెళ్లి చూడగా విడపనకల్లు మండలం పెద్ద కొట్టాలపల్లికి చెందిన వ్యక్తి కారుగా గుర్తించారు.
Sorry, no posts matched your criteria.