Anantapur

News April 10, 2024

రాప్తాడు: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

image

రాప్తాడు మండలం బుక్కచెర్ల గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పురుషోత్తం రెడ్డి అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం పురుషోత్తం రెడ్డి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 10, 2024

అనంత: టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్

image

మాజీ ఏపీఎస్ అధికారి, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ టీడీపీలో చేరారు. బుధవారం ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇక్బాల్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక్బాల్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. గత ఎన్నికలలో హిందూపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇక్బాల్.. బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు.

News April 10, 2024

అనంత: ఆశాజనకంగా చీనీ ధర

image

ఉగాది సందర్భంగా అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో చీనీ క్రయవిక్రయాలు తగ్గిపోయాయి. మార్కెట్‌కు మంగళవారం 355 టన్నులు మాత్రమే రైతులు తీసుకొచ్చారు. పంట తక్కువ వచ్చినా ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. పండగ కారణంగా సరకు రావడం తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్ యార్డు సంతలో టన్ను గరిష్ఠ ధర రూ.36 వేలు, మధ్యస్థ ధర రూ.21 వేలు, కనిష్ఠ ధర రూ.14 వేలుగా ఉంది.

News April 10, 2024

179 మంది సెక్టార్ అధికారులతో ఎన్నికల నిర్వహణ

image

శ్రీ సత్యసాయి జిల్లాలో 179 మంది సెక్టార్ అధికారులతో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సత్యసాయి జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని మడకశిర నియోజకవర్గానికి 25 మంది, హిందూపురానికి 32, పెనుకొండకు 29, పుట్టపర్తికి 26, ధర్మవరానికి 35, కదిరి నియోజకవర్గానికి 32 మంది సెక్టర్ అధికారులను నియమించామన్నారు.

News April 10, 2024

అనంత: పోలింగ్‌కు 24 వేల మంది సిబ్బంది

image

పోలింగ్‌కు అన్ని కేడర్ల అధికారులు, సిబ్బంది కలిపి దాదాపు 24 వేల మందిని నియమించారు. పీఓలు 2,552, ఏపీఓలు 2,715, ఓపీఓలు 9 వేలకు పైగా, పోలీసు సిబ్బంది 3,500, ఎన్నికల నిర్వహణ కమిటీల సిబ్బంది 570, నోడల్ అధికారులు 33 మంది, సెక్టార్ అధికారులు 481 మంది ఉన్నారు. వివిధ స్థాయిల్లో 33 శాఖలకు చెందిన వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించారు.

News April 10, 2024

అనంత: పెరిగిన టమాటా ధరలు.. రైతుల హర్షం వ్యక్తం

image

కూడేరు: పది రోజులుగా మార్కెట్‌లో టమాటా ధర పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం కిలో రూ.40 పలుకుతోంది. ఇన్ని రోజులూ కిలో రూ.10 లోపే ఉండేది. మండల వ్యాప్తంగా సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో రైతులు సాగు చేశారు. 15 కేజీల టమాట బాక్స్ ధర నాణ్యతను బట్టి రూ.300 నుంచి రూ.450 వరకు పలుకుతోంది. ధర పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News April 10, 2024

TTD JEOగా అనంత జిల్లా మాజీ కలెక్టర్ గౌతమి

image

టీటీడీ విద్య, వైద్య విభాగం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా గౌతమిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. చిత్తూరు జిల్లా వాసి అయిన ఈమె గతంలో అనంతపురం జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఎండోమెంట్ రెవెన్యూ విభాగంలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. బదిలీ నిమిత్తం తిరుపతి జేఈఓగా వెళ్లనున్నారు.

News April 10, 2024

ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలి: ఎస్పీ

image

అనంతపురం నగరంలో ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని STPO కార్యాలయంలో నగర పోలీస్ అధికారులతో సమావేశమై, ఎన్నికల వేళ తీసుకోవలసిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. నగరం, పోలీస్ స్టేషన్ల పరిధిలో, భౌగోళిక స్థితిగతులు, పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.

News April 9, 2024

అనంత: ‘ఎన్నికల మస్కెట్ రూపొందించండి’

image

సార్వత్రిక ఎన్నికల మస్కట్ రూపకల్పనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ మంగళవారం తెలిపారు. ఎన్నికల మస్కట్ రూపకల్పనలో జిల్లా ప్రజలు, డ్రాయింగ్, క్రాఫ్ట్ టీచర్లు, కేజీబీవీ పాఠశాల, కళాశాల విద్యార్థులు, ఇంజనీరింగ్ కళాశాలలు, జేఎన్టీయూ, ఎస్కేయు, పెయింటింగ్ సంస్థలు ఎన్నికల మస్కట్ రూపకల్పనలో పాలుపంచుకోవచ్చన్నారు.

News April 9, 2024

అనంత: పురుగు మందు తాగి వ్యక్తి మృతి

image

పెద్దవడుగూరు మండలం చిత్రచేడు గ్రామంలో మంగళవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్న పుల్లన్న పొరపాటున మద్యంలో పురుగు మందు కలుపుకొని తాగినట్లు సమాచారం. అయితే తాగిన గంటలోనే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పెద్దవడుగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.