Anantapur

News August 25, 2024

అనంత: ‘ఆ ఆలయంలో అంతుబట్టని రహస్యాలెన్నో..’

image

అనంతపురం జిల్లా కుందుర్పిలోని ఓ పురాతన ఆలయంలో అంతుబట్టని రహస్యాలు దాగి ఉన్నాయి. ఇటీవల ఆలయ తలుపులు తెరిచి లోపలికి వెళ్లిన పురావస్తు శాఖ అధికారులు కొన్ని విలువైన రాతి విగ్రహాలను గుర్తించారు. అయితే లోపల వాతావరణం అనుకూలించకపోవడం, చీకటిగా ఉండటంతో బయటికి వచ్చి ఆలయానికి తాళం వేశారు. ఇప్పుడు ఆ ఆలయ చరిత్రపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. మరోసారి అధికారులు ఆలయం లోపలికి వెళ్లి పరిశీలించనున్నట్లు సమాచారం.

News August 25, 2024

శ్రీకృష్ణదేవరాయ, బత్రేపల్లి వాటర్ ఫాల్స్ ఎకోపార్క్‌‌ల అభివృద్ధికి నిధులు

image

నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగర వనాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.15.4 కోట్ల నిధులు విడుదల చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని శ్రీకృష్ణదేవరాయ ఎకోపార్క్, కదిరిలోని బత్రేపల్లి వాటర్ ఫాల్స్ ఎకోపార్క్‌లను అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రంలో పచ్చదనం సుమారు 50 శాతం ఉండాలని, నగర వనాలపై దృష్టి సారించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు.

News August 25, 2024

కదిరిలో వ్యభిచారం.. ఇద్దరు మహిళల అరెస్టు

image

కదిరిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కదిరి అర్బన్ సీఐ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఇద్దరు మహిళలు న్యూఅమీన్ నగర్‌లో ఇంటిని అద్దెకు తీసుకుని, ఇతర ప్రాంతం నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో ప్రణాళిక ప్రకారం దాడి చేసి అరెస్టు చేశామన్నారు.

News August 25, 2024

ప్రజా ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ప్రజల నుంచి వచ్చిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పలు సమస్యలపై జిల్లా అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలలో వచ్చే వినతులకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని సూచించారు.

News August 24, 2024

అనంత: పరీక్షల భయంతో విద్యార్థి బలవన్మరణం

image

డీ.హీరేహల్ మండలంలోని దొడగట్టకు చెందిన రాజు(18) అనే విద్యార్థి ఉరివేసుకుని మృతి చెందినట్లు ఎస్సై గురుప్రసాద్ రెడ్డి శనివారం తెలిపారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షల సందర్భంగా నిన్నటి రోజు ఊరికి వచ్చాడు. ఉదయం ఎవరూ లేని సమయంలో ఇంట్లో చీరతో ఉరివేసుకొని మృతిచెందాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

News August 24, 2024

ఉద్యాన రంగానికి సరైన సహకారం అందిద్దాం: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలో ఉద్యానవన రంగానికి సరైన సహకారం అందిద్దామని సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ, ఉద్యానవన,, మార్కెటింగ్ శాఖలతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో కొన్ని ముఖ్యమైన పంటలను అభివృద్ధి చోదక వాహనాలుగా ఎంపిక చేసి, వాటి సమ్మిళిత అభివృద్ధి ప్రణాళికను తయారుచేసి అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

News August 24, 2024

అనంతలో హరియాణా దొంగల ముఠా అరెస్ట్

image

అనంతపురం జిల్లాలో ఏటీఎంలలో చోరీ చేసిన ఐదుమంది హరియాణా దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ జగదీశ్ శనివారం వెల్లడించారు. ఘటనల్లో 11 మంది పాల్గొన్నట్లు విచారణలో తేలిందన్నారు. అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి ఒక లారీ, గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

News August 24, 2024

అనంతపురంలో టన్ను చీనీ రూ.23వేలు, కిలో టమాటా రూ.20

image

అనంతపురం జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.23వేలు, కనిష్ఠంగా రూ.8వేలు, సరాసరి రూ.15,500లతో అమ్ముడుపోయినట్లు మార్కెట్‌ ఎంపిక శ్రేణి కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. అనంతపురం వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం మొత్తంగా 263 టన్నుల చీనీకాయలు వచ్చాయని వెల్లడించారు. ఇక కిలో టమాటా గరిష్ఠంగా రూ.20 పలికింది. మధ్యస్థం రూ.11, కనిష్ఠం రూ.6 చొప్పున పలికాయి.

News August 24, 2024

చెరువులకు జలకళ

image

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతన్నలకు ఊరట నిస్తున్నాయి. జోరు వానలకు చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. అనంతపురం జిల్లాలో 301, సత్యసాయి జిల్లాలో 1,186 చెరువులు ఉండగా వాటి కింద 1.23 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. వీటి సామర్థ్యం 22.978 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5 టీఎంసీలకుపైగా నీరు నిల్వ ఉంది. దీంతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు.

News August 24, 2024

సత్యసాయి జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్

image

సత్యసాయి జిల్లా అగలి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులను <<13916620>>సస్పెండ్<<>> చేస్తూ జిల్లా ఎస్పీ వి.రత్న ఉత్తర్వులు జారీ చేశారు. జప్తు చేసిన ద్విచక్ర వాహనాన్ని ఓ మెకానిక్ షాప్ షెడ్డు వద్దకు తీసుకెళ్లి విడిభాగాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓ మీడియా వైరల్ అయిన విషయం విదితమే. దీనిని తీవ్రంగా పరిగణించిన ఎస్పీ ప్రాథమిక విచారణ జరిపించి కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.