Anantapur

News August 24, 2024

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ

image

ఫెడ్ ఎక్స్ కొరియర్ సర్వీస్ పేరిట జరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనంతపురం ఎస్పీ పీ.జగదీశ్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల అక్కడక్కడ జరుగుతున్న ఫెడ్ ఎక్స్ కొరియర్ సర్వీస్ నేరాల పట్ల అవగాహన చేస్తూ ఎస్పీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సైబర్ నేరాల బారిన పడిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930 కు లేదా ww.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

News August 23, 2024

బొమ్మనహాల్ మండలంలో విషాదం

image

బొమ్మనహాల్ మండలం దేవగిరిలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వడ్డే నాగేంద్ర(26) అనే యువ రైతు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. పొలంలో విద్యుత్ మోటార్ వద్ద ఉన్న సర్వీస్ వైరు తగలడంతో  షాక్‌కు గురై మృత్యువాత పడ్డాడు. పలీసుల పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ఆసుపత్రికి తరలించారు.

News August 23, 2024

‘అనంత ప్రభుత్వాసుపత్రి వద్ద మృతదేహం లభ్యం.. తెలిస్తే చెప్పండి’

image

అనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు టూ సీఐ దేవేంద్ర తెలిపారు. మృతుడి వయసు సుమారు 50 ఏళ్లు ఉండొచ్చని, ఆ వ్యక్తి పింక్ కలర్ షర్ట్, లోపల ఎరుపు రంగు టీషర్ట్ ధరించాడని, నీలం రంగు ప్యాంటు వేసుకున్నాడని పేర్కొన్నారు. మృతుని వివరాలు తెలిస్తే తన 9346917119 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

News August 23, 2024

దేశ ప్రజల కోసం టంగుటూరి ఎంతో శ్రమించారు: ఎస్పీ

image

దేశ ప్రజల కోసం టంగుటూరి ప్రకాశం పంతులు ఎంతో శ్రమించారని ఎస్పీ రత్న పేర్కొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకొని ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబంలో జన్మించి, ఎన్నో సవాళ్లను అధిగమించి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారన్నారు.

News August 23, 2024

అనంతపురంలో దులీప్ ట్రోఫీ.. తొలి మ్యాచ్ ఈ జట్ల మధ్యే

image

అనంతపురంలో దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ SEP 5-8 వరకు జరగనుంది. టీమ్-సీ, టీమ్-డీ జట్లు తలపడతాయి. మ్యాచ్ ఉ.9.30కు ప్రారంభమవుతుంది.
టీమ్-సీ: రుతురాజ్ (C), సుదర్శన్, రజత్, పోరెల్, SKY, ఇంద్రజిత్, హృతిక్, సుతార్, ఉమ్రాన్, విజయ్‌కుమార్, అన్షుల్, హిమాన్షు, మయాంక్, సందీప్
టీమ్-డీ: అయ్యర్ (C), అథర్వ తైడే, దూబే, పడిక్కల్, ఇషాన్, రికీ భుయ్, సరాంశ్, అక్షర్, అర్ష్‌దీప్, ఠాకరే, హర్షిత్, తుషార్, ఆకాశ్, భరత్, సౌరభ్

News August 23, 2024

తాడిపత్రిలో ఎయిర్ స్ట్రిప్ నిర్మాణమయ్యేనా?

image

కొత్తగా ఏడు ఎయిర్ పోర్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో అనంతపురం జిల్లా కూడా ఉంది. ఆయా జిల్లాలలో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఉన్న అనుకూలతలపై అధ్యయనానికి కేంద్ర పౌరవిమానయానశాఖ అంగీకరించింది. కాగా ఇటీవల తాడిపత్రిలో ఎయిర్ పోర్ట్ లేదా ఎయిర్‌ స్ట్రిప్‌ నిర్మించే అంశంపై పరిశీలిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. దీంతో అనుకూలతలపై త్వరలో కేంద్రం అధ్యయనం చేయనుంది.

News August 23, 2024

అనంత: 3 నెలల క్రితమే వివాహం.. గుండెపోటుతో మృతి

image

బొమ్మనహాల్ మండలంలోని సింగనహళ్లిలో గుండెపోటుతో గురువారం ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన నవీన్(22) బుధవారం రాత్రి గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు బళ్లారి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడు నవీన్‌కు 3 నెలల క్రితమే కణేకల్లు మండలం బెణేకల్లకు చెందిన నందినితో వివాహం జరిగింది.

News August 23, 2024

పల్లె ప్రగతికి రూ.37.96 కోట్లు

image

నిధులు లేక నీరసించిపోయిన గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. అనంతపురం జిల్లాకు రూ.20 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాకు రూ.17.96 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వారం రోజుల్లో పంచాయతీల ఖాతాలకు జమ అవుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నిధుల ద్వారా పంచాయతీల్లో కనీస వసతులు మెరుగుపర్చుకునేందుకు అవకాశం ఉంటుంది.

News August 23, 2024

మెగాస్టార్ చిరంజీవితో జేసీ పవన్ కుమార్ రెడ్డి

image

సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిని టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ జన్మదిన వేడుక సందర్భంగా చిరంజీవితో కేక్‌ను కట్ చేయించారు. అనంతరం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి ఫ్యామిలీతో తమ జేసీ ఫ్యామిలీకి ఎంతో అనుబంధం ఉందని పవన్ కుమార్ రెడ్డి తెలిపారు.

News August 23, 2024

కందిగోపుల మురళికి వైఎస్ జగన్ భరోసా

image

‘ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటా’ అంటూ తాడిపత్రి వైసీపీ నేత కందిగోపుల మురళికి మాజీ సీఎం జగన్ భరోసా ఇచ్చారు. మూడు రోజుల క్రితం ఆయన ఇంటిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో నిన్న విజయవాడలో జగన్‌ను మురళి కలిశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. త్వరలో మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. ధైర్యం కోల్పోరాదని సూచించారు. వైసీపీ అండగా ఉంటుందని తెలిపారు.