India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాలను కట్టడి చేసే బాధ్యత జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్కు అప్పగించామని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఇసుక కార్యకలాపాలు, అమలుపై లైన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఎస్పీ రత్నతో పాటు అడిషనల్ ఎస్పీ విష్ణు, ఇన్ఛార్జ్ డీఆర్ఓ భాగ్యరేఖ పాల్గొన్నారు.
మడకశిర మండలం గుండుమలకు ఇటీవల సీఎం చంద్రబాబు వచ్చిన విషయం తెలిసిందే. ఓబులమ్మకు సొంతిల్లు లేదని తెలిసి నూతన గృహాన్ని మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. హామీలో భాగంగా గురువారం ఎమ్మెల్యే రాజు ఓబులమ్మ గృహ నిర్మాణానికి భూమిపూజ చేశారు. సీఎం హామీలో భాగంగా రామన్నకు ప్రభుత్వ సహాయంతో గొర్రెలు మంజూరు చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
వచ్చే నెల 11వ తేదీ నుంచి ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇసుక బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఉచిత ఇసుక విధానంపై కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీశ్ గురువారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు చెక్ పెట్టే విధంగా ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి, పూర్తిగా గంజాయి నిర్మూలించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రత్న పేర్కొన్నారు. గురువారం ఎస్పీ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు రవాణా కాకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రణాళికతో ముందుకు వెళుతూ ప్రత్యేక టీములు ఏర్పాటు చేశామన్నారు.
దులీప్ ట్రోఫీకి అనంతపురం సిద్ధమవుతోంది. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు అనంతపురం క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మధుసూదన్ తెలిపారు. వచ్చే నెల 2న క్రికెటర్లు నగరానికి చేరుకుంటారని చెప్పారు. మాసినేని, అలెగ్జాండర్ హోటళ్లలో వారు బస చేస్తారని వివరించారు. అనంతపురంలో1962లో ఇరానీ ట్రోఫీ మ్యాచ్ జరగ్గా 62 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రతిష్ఠాత్మక మ్యాచ్లు జరుగుతున్నాయని చెప్పారు.
అనంతపురం జిల్లా పెద్దపప్పూరు వద్ద మత్య్సకారులకు భారీ చేప చిక్కింది. మండల పరిధిలోని పెండేకల్లు రిజర్వాయర్లో చేపలు పట్టగా దాదాపు 25 కేజీల చేప వలలో పడింది. దానిని విక్రయించేందుకు యాడికికి తీసుకువెళ్లారు. ఈ చేపను చూసేందుకు జనం ఎగబడ్డారు. మరికొందరు సెల్ఫీలు తీసుకున్నారు.
తాడిపత్రిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా 200 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 200 మంది పోలీసులు, 30 మంది స్ట్రైకింగ్ బలగాలతో పట్టణ శివారుల్లో పికెట్, చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. గ్రిడ్లుగా విభజించి ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
జిల్లాలోని అర్హులైన రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు, స్వయం సహాయక బృందాలకు రుణాల మంజూరు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో 2024-25 త్రైమాసిక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లక్ష్యసాధన ప్రగతిపై బ్యాంకర్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన వారికి రుణాల మంజూరు చేయాలని ఆదేశించారు.
అనంతపురం జిల్లా అదనపు ఎస్పీగా రమణమూర్తి బుధవారం బాద్యతలు చేపట్టారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఆయనకు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పని చేస్తామని తెలిపారు.
జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు కంప్యూటరైజేషన్ ప్రక్రియను 100% సెప్టెంబర్ మూడో తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సీఈఓలతో ఫాక్స్ కంప్యూటరైజేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. రైతుల సభ్యత్వానికి సంబంధించి 21 శాతం మాత్రమే ఆన్లైన్ చేశారనిని, 100% పూర్తి చేయాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.