Anantapur

News September 26, 2024

జిల్లాస్థాయికి ఎంపికైన బత్తలపల్లి అండర్-14 కబడ్డీ జట్టు

image

బత్తలపల్లి అండర్-14 బాలుర కబడ్డీ జట్టు జిల్లా స్థాయికి ఎంపికైనట్లు రామాపురం పాఠశాల పీడీ లక్ష్మీనారాయణ, మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రధానోపాధ్యాయురాలు మాధవి తెలిపారు. వారు మాట్లాడుతూ.. గురువారం ధర్మవరంలో జరిగిన నియోజకవర్గ స్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు బత్తలపల్లి మండలం అండర్-14 బాలల విభాగంలో కబడ్డీ విన్నర్స్‌గా నిలిచి జిల్లాస్థాయికి ఎంపికైనట్లు వారు తెలిపారు.

News September 26, 2024

నేడు ధర్మవరానికి మంత్రి సత్యకుమార్ యాదవ్

image

మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం ధర్మవరంలో పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 10 గంటలకు తాడిమర్రికి మంత్రి చేరుకుని ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. 27న ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. 28న పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ, 29న పీటీ కాలనీలో మంత్రి పర్యటిస్తారని తెలిపారు.

News September 25, 2024

గ్రూపు తగాదాలను పార్టీలకు ఆపాదిస్తారా?: మాజీ ఎమ్మెల్యే అనంత

image

‘గ్రామాలలోని గ్రూపు తగాదాలను పార్టీలకు ఆపాదిస్తారా’ అని అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. రాముల వారి రథం దగ్ధం ఘటన బాధాకరమని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనను వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని, అధికార పార్టీకి జిల్లా ఎస్పీ ఊడిగం చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు.

News September 25, 2024

అనంతలో ‘లేపాక్షి’ పేరు అలా.. వచ్చిందట!

image

అబ్బురపరిచే శిల్ప సంపదకు నిలయం అనంతలోని లేపాక్షి ఆలయం. నందీశ్వరుడి విగ్రహాన్ని చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. ఉట్టిపడే రాజసం ఈ విగ్రహం సొంతం. ఈ ఆలయంలో వేలాడే స్తంభం ముఖ్య ఆకర్షణ. పర్యాటకులు ఈ అద్భుతాన్ని చూసి పరీక్షిస్తుంటారు. 7 పడగల భారీ నాగేంద్రుడు వంటి ఎన్నో ఆశ్చర్యపరచే వింతలు ఇక్కడున్నాయి. రాముడు జటాయు పక్షిని ‘లే పక్షీ’ అని పిలవడంతో ఈ ఊరికి ‘లేపాక్షి’ అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది.

News September 25, 2024

పుట్టపర్తి: ‘భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి’

image

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సీఐటీయు నాయకులు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ ఎస్ వెంకటేశ్, పాలసముద్రం గ్రామంలో నాసన్, బెల్ కంపెనీలకు భూములు కోల్పోయిన నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ రైతులు పాల్గొన్నారు.

News September 24, 2024

అనంతపురం: M.SC 2వ సెమిస్టర్ ఫలితాల విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని జులై నెలలో నిర్వహించిన M.SC 2వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ (R21).. అలాగే 1వ సెమిస్టర్ సప్లిమెంటరీ (R21) ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.

News September 24, 2024

సిమెంట్ రోడ్ల నిర్మాణానికి MLA సునీత పూజ

image

ఆత్మకూరు మండలం ముట్టాల గ్రామంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సిమెంట్ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల ముందు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సిమెంట్ రోడ్లు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

News September 24, 2024

ATP: క్రికెట్ బెట్టింగ్.. 19 మంది అరెస్ట్

image

అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసులు ఉక్కు పాదం మోపారు. బెట్టింగ్‌కు పాల్పడిన 19 మందిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పారు. వీరిలో ఏడుగురు హరియాణాకు చెందిన వారని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.8,60,000ల నగదు, 19 సెల్ ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇటుకులపల్లి సీఐ హేమంత్ కుమార్, రాప్తాడు సీఐ వెంకట శ్రీ హర్ష, ఎస్ఐ విజయ్ కుమార్‌లను అభినందించారు.

News September 24, 2024

SEEDAP ఛైర్మన్‌గా దీపక్ రెడ్డి

image

అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన గూనపాటి దీపక్ రెడ్డిని ప్రభుత్వం SEEDAP ఛైర్మన్‌గా నియమించింది. ఆయన 2021లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో అనంతపురం స్థానిక సంస్థల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీపక్ రెడ్డి 2020లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏర్పాటు చేసిన సెలక్ట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. జేసీ బ్రదర్స్‌కి అల్లుడు. టీడీపీలో కీలకంగా ఉన్నారు.

News September 24, 2024

ధర్మవరం ఘటనపై కేసు నమోదు

image

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో సోమవారం జరిగిన ఘటనపై కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితో పాటు జడ్పీ వైస్ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, డ్రైవర్ రామాంజనేయులు, అంజి, రఫీ, విజయ్, రంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి చిగిచెర్ల తమపై దాడికి పాల్పడ్డారంటూ బీజేపీ కార్యకర్త ప్రతాప్ రెడ్డి ధర్మవరం వన్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.