Anantapur

News April 5, 2024

అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా అమిత్ బర్దార్ బాధ్యతలు

image

సార్వత్రిక ఎన్నికలు- 2024 జిల్లాలో ఎలాంటి ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యమని నూతన ఎస్పీ పేర్కొన్నారు.
జిల్లా యంత్రాంగంతో కలసి పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కృషి చేస్తామన్నారు. ఎస్పీ ఎలాంటి సమస్యలు, సవాళ్లు ఉన్నా.. సమిష్ఠిగా ఎదుర్కొని పరిష్కరిస్తామన్నారు. 

News April 5, 2024

బుగ్గ రామలింగేశ్వరుడిని తాకిన సూర్యుని కిరణాలు

image

తాడిపత్రి పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మూల విరాట్‌ను సూర్యుడు గురువారం సాయంత్రం కిరణాలు తాకాయి.  ప్రతి సంవత్సరం పాల్గుణ వైశాఖ మాసంలో సూర్యహస్తమయ సమయంలో కిరణాలు మూల విరాట్‌పై పడతాయని అర్చకులు తెలిపారు. శుద్ధ ఏకాదశి కావడంతో సూర్యుడి కిరణాలు స్వామి వారి మూల విరాట్‌పై పడ్డాయని అర్చకులు తెలిపారు.

News April 5, 2024

శ్రీసత్యసాయి: ప్రొఫెసర్ అనిల్ కుమార్ పాడే మోసిన మాజీమంత్రి

image

సత్యసాయి బాబా అనువాదకుడు అనిల్ కుమార్ భౌతికకాయాన్ని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నివాళులర్పించారు. రెండు రోజులు క్రితం ప్రొఫెసర్ అనిల్ కుమార్ అనారోగ్యంతో మృతిచెందగా శుక్రవారం పుట్టపర్తిలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రొఫెసర్ అనిల్ కుమార్ పాడేను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మోశారు. సత్యసాయిబాబా అనువాదకుడిగా అనిల్ కుమార్ భక్తుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.

News April 5, 2024

ఎన్నికల అధికారిగా డా.వి.వినోద్ కుమార్ బాధ్యతలు

image

అనంతపురం కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో శుక్రవారం ఉదయం 08: 47గంటలకు నూతన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిగా డా.వి.వినోద్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. నూతన కలెక్టర్‌కి ఇన్‌ఛార్జ్ కలెక్టర్ పూల మొక్క అందించి ఘన స్వాగతం పలికారు.

News April 5, 2024

అనంతపురం కలెక్టర్‌గా వినోద్ కుమార్ పదవీ బాధ్యతలు

image

అనంతపురం జిల్లా కలెక్టర్‌గా నియమితులైన వినోద్ కుమార్ ఇవాళ పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన గౌతమిని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ చేశారు. కార్యాలయానికి వచ్చిన ఆయనకు రెవిన్యూ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉండి ఇబ్బంది లేకుండా సేవలు అందిస్తానని హమీ ఇచ్చారు.

News April 5, 2024

త్వరలోనే జిల్లాకు ఎన్నికల పరిశీలకులు: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

త్వరలోనే జిల్లాకు ఎన్నికల పరిశీలకులు వస్తున్నారని వారికి అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ కేతాన్ గార్గ్ పేర్కొన్నారు. ఆయన గురువారం ఎన్నికల అధికారులతో మాట్లాడుతూ.. సాధారణ, వ్యయ, శాంతిభద్రతల విభాగాలకు వేర్వేరుగా ముగ్గురు రాష్ట్ర పరిశీలకులు వస్తున్నారని ఆయన చెప్పారు. ఈ ముగ్గురు జిల్లాలోనే ఉంటారని అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల నివేదికలను సిద్దంగా ఉంచుకోవాలన్నారు.

News April 5, 2024

ఉరవకొండ: రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం.. భార్య పరిస్థితి విషమం

image

కూడేరు మండలం సమీపంలోని స్థానిక వ్యవసాయ చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను స్కార్పియో వాహనం ఢీకొట్టడంతో కళగళ్ల గ్రామానికి చెందిన జగన్ మోహన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా అతడి భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించి ఘటనపై కేసు నమోదు చేశారు.

News April 5, 2024

ఉమ్మడి అనంత జిల్లాలో పలువురు జడ్జిల బదిలీ

image

ఉమ్మడి అనంత జిల్లాలోని పలువురు జడ్జిలు బదిలీ అయ్యారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం కోర్టులో పనిచేస్తున్న ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి దీన ఒంగోలు సివిల్‌ జడ్జిగా అనంతపురం బదిలీ అయ్యారు. పెనుకొండ కోర్టులో పనిచేస్తున్న సివిల్‌ జడ్జి శంకర్రావును అనంతపురం సివిల్‌ జడ్జిగా బదిలీ చేశారు. అలాగే, బొబ్బిలిలో సివిల్‌ జడ్జిగా ఉన్న వాసుదేవన్‌ను పెనుకొండకు బదిలీ చేశారు.

News April 5, 2024

పెనుకొండ నుంచి 60వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన నాయకుడు

image

పెనుకొండ నియోజకవర్గంలో పరిటాల రవీంద్రది ఒక ప్రత్యేక స్థానంగా చెప్పవచ్చు. 1994 నుంచి 2004 వరకు వరుసగా నాలుగుసార్లు ఎన్నికల బరిలో నిలిచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గ చరిత్రలోని 1996లో 60010 ఓట్ల అత్యధిక మెజార్టీ, 1999లో 57877 రెండవ అత్యధిక మెజార్టీతో గెలిచిన రికార్డు ఉంది. ఈ ఎన్నికలలో ఈ అత్యధిక మెజార్టీని బ్రేక్ చేసే అవకాశం ఉందా.. కామెంట్ చేయండి.

News April 5, 2024

ఎన్నికల విధులలో ఎవరికి మినహాయింపులు లేవు: సత్యసాయి కలెక్టర్

image

ఎన్నికల ప్రక్రియలో విధులకు సంబంధించి ఎవరికి ఎలాంటి మినహాయింపులు లేవని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. గురువారం పెనుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నియోజకవర్గ పరిధిలో ఎన్నికల విధులు నిర్వహించనున్న ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతో జరిగిన సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధులు నిర్వహణలో ఎలాంటి సందేహాలు ఉన్నా, వాటిని శిక్షణ తరగతులలో నివృత్తి చేసుకోవాలన్నారు.