Anantapur

News August 17, 2024

జిల్లా మార్పుపై బాలకృష్ణ తన ఆలోచన మార్చుకోవాలి: మారుతి రెడ్డి

image

శ్రీ సత్యసాయి జిల్లాను హిందూపురానికి మార్చితే పోరాటాలకు సిద్ధమని టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి మారుతీ రెడ్డి శనివారం అన్నారు. పుట్టపర్తిలో అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఏర్పాటైన తర్వాత ఇలా బాలకృష్ణ కామెంట్స్ చేయడం చాలా దారుణమన్నారు. అసలు జిల్లాను మార్చాలనే అలోచన ఎందుకు వచ్చిందో బాలకృష్ణ చెప్పాలన్నారు. ఇక్కడ లేనివి, హిందూపురంలో ఉన్నవి ఏమిటో కూడా చెప్పాలన్నారు. బాలకృష్ణ ఆలోచన మార్చుకోవాలన్నారు.

News August 17, 2024

ఏడాదికి 15% వృద్ధి సాధించే దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్

image

రానున్న ఏడాదికి 15శాతం వృద్ధి సాధించే దిశగా జిల్లా ప్రణాళిక సిద్ధం చేయాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఈవో పీఆర్డీలతో ఆంధ్ర-2047 జిల్లా యాక్షన్ ప్లాన్‌పై సమావేశం నిర్వహించారు.

News August 17, 2024

పుట్టపర్తి – ధర్మవరం మధ్య రాకపోకలు ప్రారంభం

image

పుట్టపర్తి-ధర్మవరం మధ్య రాకపోకలు ప్రారంభమైనట్లు పుట్టపర్తి ఆర్డీఓ భాగ్యరేఖ తెలిపారు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొత్తచెరువు మండల పరిధిలోని కేశవరం వద్ద వంకపేరు వరద నీటి ప్రవాహానికి రాకపోకలు స్తంభించాయి. మరమ్మతుల అనంతరం జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశాల మేరకు రాకపోకలు ప్రారంభించినట్లు ఆర్డీవో పేర్కొన్నారు. కొన్నిచోట్ల వాగుల్లో వరద ఉద్ధృతి తగ్గడంతో రాకపోకలు ప్రారంభమైయ్యాయి.

News August 17, 2024

అనంతపురం వెళ్లే బస్సుల రాకపోకలు మళ్లింపు

image

సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి నుంచి అనంతపురం వెళ్లే బస్సుల రాకపోకలు మళ్లించినట్లు పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ తెలిపారు. భారీ వర్షం కారణంగా కొత్తచెరువు మండలంలోని కేసాపురం సమీపంలో వంక పేరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న దృష్ట్యా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొత్తచెరువు నుంచి పెనుకొండ మీదుగా ధర్మవరం, అనంతపురానికి బస్సులు తిప్పుతున్నట్లు పేర్కొన్నారు.

News August 17, 2024

అనంత: నేడు వైద్య సేవలు నిలిపివేత

image

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా నేడు జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మద్దతు పలికింది. అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ మనోరంజన్ రెడ్డి, అభిషేక్ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు నగరం లోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓపీడీ సేవలు, అత్యవసరం కాని శస్త్రచికిత్స పూర్తిస్థాయిలో నిలిపివేస్తామన్నారు.

News August 17, 2024

హిందూపురం మున్సిపల్ ఛైర్ పర్సన్, 12 మంది వైసీపీ కౌన్సిలర్ల సస్పెండ్

image

హిందూపురంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంద్రజతో పాటు 12 మంది వైసీపీ కౌన్సిలర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వైసీపీ జిల్లా సమన్వయకర్త నవీన్ నిశ్చల్ ఓ ప్రకటనలో తెలిపారు. వారు టీడీపీలో చేరడంతో పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.

News August 17, 2024

డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

అనంతపురం జిల్లాను డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్సీఓఆర్డీ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని ఎస్పీ కేవీ మురళీకృష్ణతో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు ఉపయోగించకుండా గట్టి నిఘా చర్యలు తీసుకోవాలని, ఎన్ఫోర్స్మెంట్ పక్కాగా చేపట్టాలన్నారు.

News August 16, 2024

BREAKING: అనంతపురం జిల్లా ఎస్పీ మురళీకృష్ణ బదిలీ

image

అనంతపురం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న మురళీకృష్ణ బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ ఆయనను ఏపీఎస్పీ విశాఖపట్నం 16వ బెటాలియన్‌కు బదిలీ చేసింది. అయితే అనంతపురం జిల్లాలో అతి తక్కువ కాలం పని చేసిన ఎస్పీ జాబితాలో మురళీకృష్ణ, అమిత్ బర్దర్, గౌతమి శాలీ ఉన్నారు.

News August 16, 2024

విజన్ 2047పై ప్రభుత్వం కసరత్తు: కలెక్టర్

image

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖలకు సంబంధించి శుక్రవారం జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. విజన్ 2047పై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టిందని, అందుకు సంబంధించి జిల్లాలో వివిధ శాఖల 100 డాక్యుమెంట్ కు నివేదికలు సిద్ధం చేయాలన్నారు. అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చే విధంగా విజన్ తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News August 16, 2024

ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీల పట్ల చిన్నచూపు తగదు: మధు

image

అనంత: ఎస్సీ, ఎస్టీలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, అందుకే బీసీలకు మాత్రమే డీఎస్సీ కోచింగ్ ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులను పక్కన పెట్టిందని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇవ్వాలని కోరుతూ జిల్లా సాంఘిక సంక్షేమ అధికారికి వినతిపత్రం అందజేశారు.