Anantapur

News September 18, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో రేపటి నుంచి ఉచిత ఇసుక సరఫరా

image

ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లాలో గురువారం నుంచి ఉచిత ఇసుక ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులతో ఇసుక తరలింపుపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తాడిమర్రి మండలం సీసీ రేవు, ముదిగుబ్బ మండలం పీసీ రేవు వద్ద ఇసుక సరఫరాకు అనుమతి ఉందన్నారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లోడింగ్ ఉంటుందన్నారు.

News September 18, 2024

ఇసుక రీచ్‌ల వద్ద రాత్రి సమయంలో ఎవరూ బస చేయకూడదు: కలెక్టర్

image

ఇసుక రీచ్‌ల వద్ద రాత్రి సమయాలలో ఎవరూ బస చేయరాదని సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం నుంచి జిల్లాలోని సీసీ రేవు, పీసీ రేవు వద్ద ఇసుక సరఫరాకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లోడింగ్ జరుగుతుందన్నారు. కొత్త మార్గదర్శకాల మేరకు ఉచిత ఇసుక సరఫరా చేస్తామన్నారు.

News September 18, 2024

నేడు అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం

image

అమరావతిలో ఇవాళ మధ్యాహ్నం ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, సవిత, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. 100 రోజుల పాలన, ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు.

News September 18, 2024

ఈ పండుగ అనంతపురం జిల్లాకే పరిమితం!

image

అనంతపురం జిల్లాలో నేడు మాల పున్నం జరుపుకుంటున్నారు. మహాలయ పౌర్ణమి పండుగను పల్లె ప్రజలు ‘మాల పున్నం’ అంటారు. ఈ పండుగ వచ్చే నాటికి పొలంలో విత్తనాలు వేసి ఉంటారు. ఏటా ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబరులో జరుపుకుంటారు. ఇది మాంసాహార పండుగ. ఈరోజున సాయంత్రం పూట కోలాట వేషాలు, కోళ్ల పందేలు కాలక్షేపం కోసం సరదాగా ఆడతారు. ప్రత్యేకంగా హరిజనులు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. రాష్ట్రంలో మరెక్కడా మాల పున్నమిని జరుపుకోరు.

News September 18, 2024

బెంగళూరు-ధర్మవరం ప్యాసింజర్ రైలు అనంతపురం వరకు పొడిగింపు

image

బెంగళూరు నుంచి ధర్మవరం వరకు నడుస్తున్న 06515/06516 ప్యాసింజర్ రైలును అనంతపురం వరకు పొడిగిస్తూ సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారి బీఎస్ క్రిస్టోఫర్ ఆదేశాలు జారీచేశారు. సత్యసాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం మీదుగా అనంతపురం వెళ్తుందని తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ వినతి మేరకు పొడిగించినట్లు తెలిపారు.

News September 18, 2024

జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండటానికి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

అనంతపురం జిల్లాను దేశంలో ప్రథమ స్థానంలో ఉండటానికి కావలిసిన అని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏపీఎంఐపీ పథకం పైన సమీక్షసమావేశం నిర్వహించార. రాష్ట్ర స్థాయి డ్రిప్ కంపెనీ ప్రతినిధులు, జిల్లా వ్యవసాయ, మైక్రో ఇరిగేషన్, ఉద్యానవన, పట్టు పరిశ్రమ తదితరులతో నిర్వహించారు.

News September 18, 2024

అనంత: మామిడి చెట్టుకు ఉరివేసుకుని రైతు ఆత్మహత్య

image

అనంతపురం జిల్లాలో రైతు మామిడి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. తాడిపత్రి మండల పరిధిలోని అయ్యవారిపల్లిలో రైతు అమరేశ్ రెండెకరాలలో మొక్కజొన్న పంటను సాగు చేశాడు. అయితే పెట్టిన పెట్టుబడులు సరిగా రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై తాడిపత్రి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News September 17, 2024

అనంతలో క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌కు ఘన స్వాగతం

image

అనంతపురానికి టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ మంగళవారం చేరుకున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన అనంతపురం చేరుకున్న ఆయనకు జిల్లా వాసులు ఘన స్వాగతం పలికారు. ఆయన నేరుగా పట్టణంలోని మాసినేని గ్రాండ్ హోటల్‌కు వెళ్లారు. సూర్యకుమార్ యాదవ్‌ను చూసేందుకు క్రికెట్ అభిమానులు బారులు తీరారు.

News September 17, 2024

బద్రీనాథ్‌లో చిక్కుకున్న 40 మంది తాడిపత్రి వాసులు

image

తాడిపత్రికి చెందిన 40 మంది యాత్రికులు బద్రీనాథ్‌లో చిక్కుకున్నారు. నిన్న సాయంత్రం గోచార రుద్ర ప్రయాగ దగ్గర కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ రహదారిని మూసివేశారు. దీంతో నిన్నటి నుంచి రోడ్డుపైనే ఉంటున్న యాత్రికులు ఆహారం, నీళ్లు లభించక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని వారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి ఫోన్ ద్వారా తెలియజేశారు.

News September 17, 2024

తెగిపడిన గుంతకల్లు యువకుడి చెయ్యి

image

కడప జిల్లా నందలూరు రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి యువకుడి చెయ్యి తెగిపడిపోయిన ఘటన సోమవారం జరిగింది. గుంతకల్లుకు చెందిన కురుబ ధనుశ్ పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. రైలులో పుత్తూరుకు వెళ్తూ నందలూరుకు రాగానే ప్రమాదవశాత్తు రైలు కింద పడి చెయ్యి విరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. క్షతగాత్రుడిని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.