Anantapur

News August 16, 2024

వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత

image

రామగిరి మండలం ముత్యాలంపల్లి సమీపంలోని పరిటాల సునీత సొంత వ్యవసాయ పొలంలో కూలీలతో కలిసి వరి నాట్లు వేశారు. ఇందులో భాగంగా పొలం దగ్గర ఏర్పాటు చేసిన గంగ పూజలో పాల్గొన్నారు. ఆమె వెంట కుటుంబ సభ్యులు, కూలీలు ఉన్నారు.

News August 16, 2024

అనంతకు రానున్న భారత క్రికెటర్లు

image

అనంతపురం జిల్లా దేశవాళీలో ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్ అమిత్ సిద్దేసర్ ఇటీవల అనంత క్రీడా మైదానాన్ని సందర్శించారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి 22 వరకు 4మ్యాచ్‌లు జరగనున్నాయి. సూర్యకుమార్ యాదవ్, రుతు రాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, అక్షర పటేల్, కేఎల్ రాహుల్, కుల్ దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా రానున్నారు.

News August 16, 2024

ఉమ్మడి అనంత జిల్లాలో నేడు వర్షాలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ అనంతపురంతో పాటు శ్రీసత్యసాయి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇంతకీ మీ ఊరిలో ఇప్పుడు వాతావరణం మారిందా? లేదా? కామెంట్ చేయండి.

News August 16, 2024

ఆ కార్యాలయంలో ఎరగని జాతీయ జెండా

image

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా కంబదూరు మండలంలో భిన్నమైన ఘటన చోటుచేసుకుంది. స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కంబదూరు మండలం అండేపల్లి గ్రామ సచివాలయానికి సంబంధించిన అధికారులు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ జెండాను ఆవిష్కరించలేదు. అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News August 15, 2024

అనంత: ఈతకు వెళ్లి యువకుడి మృతి

image

అనంతపురం జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవం నాడు విషాద ఘటన చోటు చేసుకుంది. కనేకల్ మండలం మాళ్యం గ్రామానికి చెందిన రాజేశ్ ఈతకు వెళ్లొస్తానని చెప్పి వెళ్లి మృత్యువాత పడ్డాడు. చెరువులో మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు రోధించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

News August 15, 2024

అనంత: విద్యుత్ షాక్‌తో నిండు గర్భిణి మృతి

image

గుమ్మగట్ట మండలం బీటీపీ గ్రామంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కావేరి(27) అనే నిండు గర్భిణి విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందింది. కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి వాటర్ క్యూరింగ్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నిస్తుండగా మృతిచెందింది. పడింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News August 15, 2024

జాతీయ అవార్డులను అందుకున్న కానిస్టేబుల్ విష్ణు

image

యాడికి మండలంలో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న విష్ణు భగవాన్‌కు భారత సేవా పురస్కార్, దేశ రత్న పురస్కార్ జాతీయ అవార్డులను కర్ణాటకలోని బెంగళూరులో అందుకున్నారు. బెంగళూరు ఎన్జీవో సంస్థ వెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలలో నాణేల సేకరణ, ప్రదర్శనలు నిర్వహించి కళలకు విశేషమైన సేవలు అందించినందుకు అందించారు. కానిస్టేబుల్ విష్ణును పోలీసు ఉన్నతాధికారులు, మండల అధికారులు అభినందించారు.

News August 15, 2024

శ్రీ సత్యసాయి: బైక్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. వ్యక్తి మృతి

image

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అమడగూరు వద్ద బైకును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 15, 2024

అనంతపురం JNTUలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇన్‌ఛార్జ్ వీసీ సుదర్శనరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో వీసీతో పాటు రిజిస్ట్రార్ కృష్ణయ్య, ప్రిన్సిపల్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

News August 15, 2024

అనంతపురం JCగా నియామకం రద్దు.. ఆ ట్వీటే కారణమా?

image

అనంతపురం జాయింట్ కలెక్టర్‌గా హరిత నియామకం రద్దుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఇటీవల టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ‘నేను చూసిన అత్యంత అవినీతిపరులైన అధికారులలో హరిత ఒకరు. తిరుపతి కార్పొరేషన్‌లో జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో సూత్రధారి’ అంటూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె పోస్టింగ్‌ను ప్రభుత్వం రద్దు చేసిందా అన్న ప్రచారం జోరందుకుంది.