Anantapur

News April 1, 2024

అనంత: ఐదుగురు ఉద్యోగుల సస్పెండ్

image

అనంత జిల్లాలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ముగ్గురు వాలంటీర్లు, ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులను కలెక్టర్ ఎం.గౌతమి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో విడపనకల్లు మండలం హవళిగి గ్రామ వాలంటీర్ కొల్లారప్ప , ఫీల్డ్ అసిస్టెంట్ కె.మల్లికార్జున, అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామ వాలంటీర్లు ప్రవీణ్, ప్రకాష్, తాడిపత్రి మండలం ఆటోనగర్ విద్యుత్ సబ్ స్టేషన్ షిప్ట్ ఆపరేటర్ పావురాల శీనయ్య ఉన్నారు.

News April 1, 2024

అంతరాష్ట్ర బోర్డర్ చెక్ పోస్టులలో ముమ్మరంగా తనిఖీలు

image

శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని అంతరాష్ట్ర సరిహద్దులలో జిల్లా పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆదివారం రాత్రి ఎస్పీ మాధవ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోకి, పట్టణాలలో ప్రవేశించి బస్సులు, లారీలు, కార్లు, తదితర వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు చూపించకుండా తరలించే నగదు నగలను స్వాధీనం చేసుకుంటున్నారు.

News March 31, 2024

వివాదాస్పద పోస్టులు పెడితే చర్యలు తప్పవు: ఎస్పీ

image

ఎన్నికల వేళ సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంచామని, వివాదాస్పద పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని అనంత ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా మాధ్యమాలలో పాటించాల్సిన నియమ నిబంధనలు, సూచనలపై ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లలో తప్పుదారి పట్టించే సమాచారాన్ని పెడితే చర్యలు తప్పవన్నారు.

News March 31, 2024

టీడీపీకి కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా రాజీనామా

image

కదిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాజీనామా చేసినట్లు తెలిపారు. టీడీపీలో పార్టీ కోసం కష్టపడిన నేతలకు విలువ లేకుండా పోయిందని అన్నారు. రాజీనామా లేఖను అధిష్ఠానానికి పంపనున్నట్లు పేర్కొన్నారు.

News March 31, 2024

ధర్మవరంలో విద్యార్థిని సూసైడ్

image

ధర్మవరంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన చింత చిదంబరయ్య కుమార్తె చింత రాజేశ్వరి(21) ఆదివారం ఉరివేసుకుని మృతిచెందింది. రాజేశ్వరి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ ఉండేదని, ఆదివారం కూడా నొప్పి రావడంతో భరించలేక ఇంట్లో చీరతో ఉరివేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

News March 31, 2024

టీడీపీని వీడే ప్రసక్తే లేదు: మాజీ MLA

image

అనంతపురం అసెంబ్లీ టికెట్ రాలేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పార్టీ మారుతున్నారని వస్తున్న ఆరోపణలు ఆయన ఖండించారు. అనంతపురంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి పరిస్థితుల్లో కూడా టీడీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. సమస్యను అధినేత చంద్రబాబు నాయుడుకు వివరిస్తామని తెలిపారు.

News March 31, 2024

ధర్మవరంలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

image

ధర్మవరం టౌన్ కేతిరెడ్డి కాలనీకి చెందిన రాజేశ్వరి (21) అను యువతి తన ఇంటిలో ఉరి వేసుకుని చనిపోయింది. రాజేశ్వరి పుట్టపర్తిలో సంస్కృతి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. రాజేశ్వరి తండ్రి చిదంబరయ్య కూలి మగ్గం నేస్తారు. రాజేశ్వరి ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 31, 2024

వజ్రకరూర్ మండలంలో రేషన్ డీలర్ సస్పెన్షన్

image

అనంతపురం జిల్లా ఎన్నికల ప్రవర్తన నియామవళి ఉల్లంఘించిన వారిపై కలెక్టర్ గౌతమి చర్యలు తీసుకున్నారు. వజ్రకరూరు మండలం గడేహోతూరు గ్రామానికి చెందిన చౌక దుకాణపు డీలర్ ఎస్.నాగరాజును శనివారం సస్పెండ్ చేశారు. ఇప్పటి వరకూ 40 మంది వాలంటీర్లు, ఏడుగురు డీలర్లు, ఒక ఎండీయూ ఆపరేటర్, 11 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, ఒక పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌కు గురైనట్లు తెలిపారు.

News March 31, 2024

అనంతలో డాక్టర్ సూసైడ్

image

అనంత నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనస్తీషియా వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడ్డారు. రెండో పట్టణ సీఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల మేరకు అమరాపురం మండలానికి చెందిన శ్రీజ (22) సాయినగర్ లోని వసతి గృహంలో ఉంటూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తోంది.యువతి వసతి గృహంలోని తన గదిలో అపస్మారక స్థితిలోపడి ఉండటం చూసిన నిర్వాహకులు ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News March 31, 2024

సీఎస్ఆర్ కార్యకలాపాలు విస్తృతంగా కొనసాగించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ రంగ సంస్థలు, కంపెనీలు ఇచ్చే సీఎస్ఆర్ విరాళాలతో కొంత భాగాన్ని ఆయా కంపెనీలు కొలువై ఉన్నచోట కొంతమేర ఖర్చు చేయాలని కలెక్టర్ పీ.అరుణ్ బాబు పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని ఆయన చాంబర్ నందు కియా కంపెనీ అనుబంధ సంస్థ Hyundai Mobis కంపెనీ ప్రతినిధులు జిల్లాలోని వివిధ అంగన్వాడీ కేంద్రాలలో రూ.44,13,436 విలువ గల పరికరాలు కలెక్టర్ పి.అరుణ్ బాబుకు అందజేశారు.