Anantapur

News September 15, 2024

అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమం: అనంత కలెక్టర్

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ రెండో తేదీన మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ దివస్‌ను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అనంతపురం కలెక్టరేట్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు ‘స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని’ నిర్వహిస్తామన్నారు. అన్ని శాఖల అధికారులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.

News September 15, 2024

అనంత: 195 బాల్స్‌కు 113 రన్స్ చేసిన రికీ భుయ్

image

అనంతపురం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా జరుగుతోంది. కాగా ఇండియా A & D టీమ్‌లు D టీమ్ బ్యాట్స్ మెన్ రికీ భుయ్ సెంచరీ చేశారు. 195 బాల్స్‌కు 113 రన్స్ చేసి ఔటయ్యారు. అభిమానులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఆదివారం కావడంతో క్రికెట్ అభిమానులు ఆర్డీటీ స్టేడియానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు.

News September 15, 2024

ఓడీసీ: డాబా యజమాని ఆత్మహత్య

image

ఓడీసీ మండలం పరిధిలోని జరికుంటపల్లి గ్రామం వద్ద డాబా యజమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. బంధువులు వివరాలు మేరకు శనివారం రాత్రి సుమారు 8:30గంటల సమయంలో డాబా యజమాని రమేష్ నిద్ర వస్తోందని భార్య కుమార్తెతో చెప్పి హోటల్ మేడపై ఉన్న గదిలోకి వెళ్లాడు. చాలా సేపు తర్వాత కుటుంబ సభ్యులు వెళ్లి చూడగాఫ్యాన్‌కు ఉరేసుకోవడంతో మృతి చెందినట్లు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

News September 15, 2024

అనంతపురంలో 19న ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం

image

అనంతపురంలోని కలెక్టరేట్‌‌లో ఈ నెల 19న ఉదయం11 గంటలకు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌, హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో హంద్రీనీవా, మైనర్‌ ఇరిగేషన్‌తో పాటు హెచ్చెల్సీకి కేటాయించిన నీటి విడుదల తేదీలను ప్రకటిస్తామన్నారు. ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరుకావాలని కోరారు.

News September 15, 2024

వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధిత చట్టంపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలను, సలహాలను అధికారులకు తెలియజేశారు. జిల్లాలో ఉన్న ప్రతి స్కానింగ్ సెంటర్ ఆక్ట్ ప్రకారం నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

News September 15, 2024

పోలీస్ సిబ్బందిపై ప్రశంసల వర్షం కురిపించిన ఎస్పీ రత్న

image

శ్రీ సత్యసాయి జిల్లా వినాయక శోభాయాత్ర నిమజ్జనం కార్యక్రమాలు విజయవంతం చేయడంపట్ల ఎస్పీ పోలీస్ సిబ్బందిపై శనివారం ప్రశంసల వర్షం కురిపించారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చక్కగా విధులు నిర్వర్తించారన్నారు. కదిరి ధర్మవరం హిందూపురంలోని ప్రధాన పట్టణాల్లో సైతం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి నిబద్ధతతో పని చేశారన్నారు. కావున జిల్లా పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

News September 15, 2024

హిందూపురం: రోడ్డు ప్రమాదంలో జవాన్ మృతి

image

హిందూపురం మండలం బీరేపల్లి సమీపంలోని కేమల్ పరిశ్రమ గేట్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ మాజీ జవాన్ అచ్చప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. హిందూపురం నుంచి గోరంట్ల వైపు వెళుతున్న కారు వెళ్తుండగా గోరంట్ల నుంచి ద్విచక్ర వాహనంలో అచ్చప్ప హిందూపురం వస్తున్నారు. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొనడంతో అచ్చప్ప అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 14, 2024

హిందూపురంలో CM చిత్రపటానికి పోలీసుల క్షీరాభిషేకం

image

హిందూపురం పట్టణంలో ఎక్సైజ్ స్టేషన్‌లో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటానికి శనివారం ఎక్సైజ్ పోలీసులు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు కమలాకర్, రాంప్రసాద్‌లు మాట్లాడుతూ.. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, ఎక్సైజ్ శాఖను విలీనం చేస్తూ ఎక్సైజ్ శాఖను పునరుద్ధరణ చేయడం ఎంతో అభినందనీయమన్నారు.

News September 14, 2024

అనంతపురం జిల్లా వ్యాప్తంగా నీటి సరఫరా బంద్

image

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా తాగునీటి కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతం చేశారు. 63 పంప్ హౌస్‌లలో నుంచి నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కార్మికులు ఇవాళ ప్రకటించారు. సత్య సాయి తాగునీటి పథకాన్ని 19 విభాగాలుగా విభజించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం దారుణమని, దీనిని వ్యతిరేకిస్తున్నామని కార్మికులు తెలిపారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగుతుందన్నారు.

News September 14, 2024

అనంత: ప్రభుత్వ లాంఛనాలతో ఏఆర్ కానిస్టేబుల్ అంత్యక్రియలు

image

బుక్కపట్నం మండలంలోని గరుగు తాండ గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ చంద్ర నాయక్ శుక్రవారం విజయవాడలో గుండెపోటుతో మృతి చెందాడు. శనివారం జిల్లా ఎస్పీ వి.రత్న ఆదేశాలతో ప్రభుత్వా లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత పోలీసు అధికారులు పాల్గొన్నారు.