India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణను టీడీపీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. ఈయనకు బోయ సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడిగా గుర్తింపు ఉంది. 2009 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హిందూపురం నుంచి పోటీ చేసి ఓడిపోయ్యారు. హిందూపురం పార్లమెంట్ స్థానం ఆశించారు, కానీ టీడీపీ అధిష్ఠానం అనంతపురం పార్లమెంట్ స్థానాన్ని కేటాయించింది.
గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్ఠానం గుమ్మనూరు జయరాంను ఖరారు చేసింది. ఆలూరుకి చెందిన జయరాం వైసీపీ నుండి కొద్దిరోజుల క్రితం టీడీపీలో చేరగా.. ఎట్టకేలకు ఆయన పోటీచేసే స్థానంపై సస్పెన్స్ వీడింది. అటు కదిరి నుంచి కందికుంట వెంకటప్రసాద్ భార్య కాకుండా ప్రసాద్ బరిలో ఉంటారని ప్రకటించింది. అనంతపురం అర్బన్ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ బరిలో ఉంటారని టీడీపీ తుది జాబితాలో పేర్కొంది.
పుట్టపర్తి మండలలో శుక్రవారం వింత గొర్రె పిల్ల పుట్టింది. మండల పరిధిలోని సుబ్బరాయునిపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మూర్తికి చెందిన ఓ గొర్రె ఎనిమిది కాళ్లు, రెండు తలలతో కూడిన గొర్రె పిల్లకు జన్మనిచ్చింది. కాగా కొద్ది సేపటికే గొర్రె పిల్ల మృతి చెందినట్లు గొర్రెల కాపారి తెలియజేశారు.
అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హసన్బాషా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. సమస్య ఎక్కడ తలెత్తిన 08554-275892, 9390098329 నంబర్లకు ఫోన్ చేసి సమస్య తెలియజేయాలని కోరారు. అధికారులు వచ్చి సమస్య పరిష్కారం చేస్తారని తెలిపారు.
అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హసన్బాషా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. సమస్య ఎక్కడ తలెత్తిన 08554-275892, 9390098329 నంబర్లకు ఫోన్ చేసి సమస్య తెలియజేయాలని కోరారు. అధికారులు వచ్చి సమస్య పరిష్కారం చేస్తారని తెలిపారు.
పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన ఘటన గురువారం జరిగింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. బత్తలపల్లికి చెందిన సృజన ఇంట్లో ఎవరూలేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో కడుపు నొప్పి ఎక్కువై భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్ట్స్ కళాశాలలో డిసెంబర్లో నిర్వహించిన డిగ్రీ సెమిస్టర్ ఫలితాలను ప్రిన్సిపాల్ దివాకర్ రెడ్డి విడుదల చేశారు. 5వ సెమిస్టర్లో 1,261 మందికి గాను 862 మంది ఉత్తీర్ణత సాధించారు. ఆర్ట్స్లో 60 శాతం, కామర్స్లో 74 శాతం, సైన్స్లో 71 శాతం ఉత్తీర్ణులయ్యారు. అలాగే 3వ సెమిస్టర్లో 855 మందికి గాను 449 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొదటి సెమిస్టర్లో 1,028 గాను 657 మంది పాసైనట్లు తెలిపారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గురువారం ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. అందులో తాడిపత్రిలో అత్యధికంగా 41.4 డిగ్రీలు నమోదైనట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా శాస్త్రవేత్తలు సహదేవ రెడ్డి, నారాయణస్వామి తెలిపారు. గుంతకల్ 41.2 శింగనమల41.1, పరిగి 40.9 శెట్టూరు 40.8, గుత్తి, చెన్నేకొత్త పల్లి, కనగానపల్లి 40.7, ధర్మవరం 40.6 నమోదైనట్లు తెలిపారు.
ఎన్నికల్లో పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నెల వారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాత నేరస్తులు, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.
ఉరవకొండ పట్టణంలోని 10వార్డ్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శర్మాస్ వలి(23) బుధవారం సాయంత్రం బెంగళూరులో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పీజీలో ఉంటున్న అతడికి ఉన్న ఫలంగా ఛాతీలో నొప్పి రావడంతో స్నేహితులు సమీప ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Sorry, no posts matched your criteria.