Anantapur

News August 10, 2024

అనంతపురం మీదుగా ప్రత్యేక రైళ్లు

image

అనంతపురం మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు కలబురగి-బెంగళూరు మధ్య ప్రయాణిస్తాయన్నారు. బెంగుళూరు నుంచి రైలు (06533) ఆగస్టు 14, 16, 17వ తేదీల్లో రాత్రి 9 గంటలకు బయలుదేరి ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని మీదుగా ప్రయాణిస్తుందన్నారు. ఈ రైలు తిరుగు ప్రయాణం (06534) 15, 17, 18వ తేదీల్లో కలబురగిలో ఉదయం 9.30కు బయలుదేరి రాత్రి 8కి బెంగళూరుకి చేరుకుంటుంది.

News August 10, 2024

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా హేమలత

image

అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గుజ్జుల హేమలత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2024-25 ఏడాదికి సంబంధించి ఆరో తేదీ ఎన్నికలు నిర్వహించగా శుక్రవారం ఫలితాలు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ అనంతపురం జిల్లా శాఖ ఆర్థిక కార్యదర్శిగా ఉన్న హేమలతను జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

News August 10, 2024

సత్యసాయి: పథకాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

image

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని వివిధ శాఖల అమలు చేస్తున్న పథకాలను సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేత సమీక్షించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో డ్వామా పీడీ విజయేంద్రప్రసాద్, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో కలెక్టర్ చర్చించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న పథకాల కోసం 15వ తేదీలోగా అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు.

News August 9, 2024

తాడిపత్రి: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

image

తాడిపత్రి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. పట్టణ పరిధిలోని వడ్లపాలెం వీధికి చెందిన శ్రీనివాసులు అనే యువకుడు ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాసులు పెళ్లి కాలేదన్న మనస్థాపంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News August 9, 2024

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి సవిత

image

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి శ్రీ సత్యసాయి జిల్లాలో ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొననున్నారు. జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో 15వ తేదీ జరిగే జాతీయ పతాక ఆవిష్కరణకు మంత్రి సవిత ముఖ్యఅతిథిగా హాజరవుతారని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ ఒక ప్రకటనలో తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

News August 9, 2024

అనంత: 21 మంది సీఐల బదిలీ

image

అనంతపురం రేంజ్ పరిధిలో 21 మంది సీఐలకు స్థానచలనం కల్పించారు. ఈ మేరకు సీఐలను బదిలీ చేస్తూ శుక్రవారం అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషీ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం 41 మంది సీఐలను బదిలీ చేయగా.. ఈ రోజు మరో 21 మందికి స్థానచలనం కల్పిస్తూ పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు డీఐజీ కార్యాలయం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.

News August 9, 2024

వర్షంలోనే కెనాల్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి

image

శింగననమల నియోజకవర్గంలో కాలువల ద్వారా నీటిని అందించేందుకు ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రత్యేక దృష్టి పెట్టారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆమె నియోజకవర్గంలోని హెచ్ఎల్సీ కాలువను పరిశీలించారు. క్షేత్రస్థాయికి వెళ్లి శిథిలావస్థకు చేరుకున్న కాలువలను స్వయంగా పరిశీలించారు. గార్లదిన్నె నుంచి పుట్లూరు చివరి వరకు నీరు వెళ్లేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పనులు చేయాలని అధికారులకు సూచించారు.

News August 9, 2024

హిందూపురంలో ట్యాంకర్ ఢీకొని బాలుడి మృతి

image

హిందూపురం పట్టణ పరిధిలోని మోడల్ కాలనీలో వాటర్ ట్యాంకర్ ఢీకొని రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. మోడల్ కాలనీలో నివాసముంటున్న బాబ్జాన్ కుమారుడు జునైద్(2) ఆడుకుంటుండగా ట్యాంకర్ ఢీకొట్టింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 9, 2024

SMC Elections: అనంత.. 29, సత్యసాయిలో 10 చోట్ల వాయిదా

image

★ అనంతపురం జిల్లాలో 1741 పాఠశాలల్లో యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 971 పాఠశాలల్లో ఏకగ్రీవంగా ఎన్నికవగా 741 చోట్ల ఎన్నికలు జరిగాయి. కోరం లేక 29 పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
★ సత్యసాయి జిల్లాలో 2065 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 2055 కమిటీలను ప్రశాంత వాతావరణంలో ఎన్నుకున్నారు. కోరం లేక 10 చోట్ల వాయిదా పడ్డాయి.

News August 9, 2024

రాయదుర్గం మీదుగా నడిచే మూడు రైళ్లు రద్దు

image

రాయదుర్గంలోని రైల్వేస్టేషన్‌లో సిగ్నలింగ్ వ్యవస్థను మార్చేందుకు నేడు రాయదుర్గం మీదుగా ప్రయాణించే 3 రైళ్లను రద్దు చేసినట్లు నైరుతి రైల్వే హుబ్లీ డివిజన్ ముఖ్య సమాచార అధికారి డాక్టర్ మంజునాథ్ తెలిపారు. చిక్కజాజూరు-గుంతకల్లు, హొస్పేట -బెంగళూరు మధ్య ప్రయాణించే 3 రైళ్లు రాయదుర్గం మీదుగా కాకుండా హొస్పేట, అమరావతి కాలనీ, దావణగెరె, చిక్కజాజురు మార్గంలో వెళ్తాయన్నారు.